తేజస్సు
మనం గతంలో నాదం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు దాని తదుపరి స్థాయి అయిన తేజస్సు గురించి తెలుసుకుందాము. భౌతికముగా నాదము మరియు తేజస్సు అనగా శబ్దము, కాంతులను పరి శీలించిన, శబ్దముకంటే కాంతియొక్క వేగము, త్వరణము(velocity), వ్యాపకత్వము, పరిధి ఎక్కువ. కావుననే, అనేక లక్షల కాంతిసంవత్సరాల దూరములొ నున్న నక్షత్రములను ఈభౌతిక నేత్రములతో చూడగలుగుచున్నాము. ఇట్లే, ఆధ్యాత్మికభావములో కూడ నాదముకంటే తెజస్సునకు ఎక్కువ ప్రాముఖ్యత కలదు. ఈతేజస్సు భౌతికమైన కాంతికాదు. ఇది ఆత్మసంబంధమైనది (spiritual). ఈతేజస్సు జ్ఞాననేత్రము ద్వారా మాత్రమే గోచరమగునది. ధ్యానసమాధుల్లో మాత్రమే అనుభవము లోనికి వచ్చునది. ఈఅధ్యాయములో తేజస్సునకు భౌతికమైన ఉదాహరణలు వచ్చినప్పటికీ, వాటిని ఆత్మ సంబంధమైనవిగాను, పారలౌకికమైనవి గాను భావించవలెను.
మొదట నాదమునకు తేజస్సునకు గల సంబంధము తెలుసుకొందాము. తేజోబిందూపనిషత్ 5వ అధ్యాయములో ఈ విధంగా చెప్పబడినది. "శాంతాశాంత విహీనాత్మా నాదంత జ్యోతిరూపకః, మహా వాక్యార్థతో బ్రహస్మిత్యతిదూరతః| తచ్ఛబ్దవర్జస్త్వం శబ్దహీనో యొ నాదాంతజ్యోతిరేవసః| అఖండైక రసోవాహమానందోస్మితి వర్జితః, సర్వాతీత స్వభాత్మా నాదాంత జ్యోతిరేవసః" ఈ వాక్యములననుసరించి శాంతము, అశాంతము మున్నగునవి విసర్జించినవానికి, బ్రహ్మస్మి మొదలగు మహావాక్యార్థములు మరియు శబ్దమునుకూడ విసర్జించినవానికి, అఖండైకరసప్రవాహములో మునిగితేలుచు, అన్నివిధము లైన ప్రాపంచికస్వభావములు విసర్జించినవానికి, నాదముయొక్క అంతమందు జ్యోతి రూపమొక్కటియే మిగులును. దీనిని బట్టి నాదముయొక్క అంతమందు తేజస్సు మిగులునని ఋజువగుచున్నది. ఆ తేజోరూపదర్శనము వలన సకలాతీత సమతుల్య భావన ఏర్పడుచున్నది.
మండలబ్రాహ్మణోపనిషత్ లో 'అంతర్లక్ష్యము' ను వివరించుచూ భౌతికముగా నాద బిందువును ఎట్లు సాధించవచ్చునో, ఆ తదుపరి తేజోదర్శనమెట్లగునో వివరించబడినది. "మూలాధారా దారభ్య బ్రహ్మరంధ్రపర్యంతం సుషుమ్నాసూర్యాభా, తన్మధ్యే, తటిత్కోటిసమా మృణాళతన్తుసూక్ష్మా కుండలినీ, తత్ర తమోనివృత్తిః, తద్దర్శనా పాపనివృత్తిః, తర్జన్యగ్రోన్మీలిత కర్ణరంధ్రద్వయే, ఫూత్కార శబ్దోజాయతే, తత్రస్థితేమనసి, చక్షుర్మధ్యనీలజ్యోతిపశ్యతి, ఏవంహృదఏపి." మూలాధారము నుండి బ్రహ్మరంద్ర(సహస్రారము)పర్యంతము సుషుమ్నానాడి సూర్యునివలె ప్రకాశింపుచున్నది. దానినడుమ, తటిత్కోటిసమానమైన తామరనూలువోలె సూక్ష్మమైన కుండలినీశక్తి(ప్రాణశక్తి) వెలుగుచున్నది. అప్పుడు తమోనివృత్తి చెందును. చూపుడువేళ్ళ కొనలచేత కర్ణరంధ్రములు మూసికొనిన యెడల ఫూత్కార శబ్దము వినపడును. అపుడు స్థితప్రజ్ఞతో కూడిన మనస్సుతో నేత్రమధ్యమందలి నీలజ్యోతి కనపడును. అట్లే హృదయమందు కూడ తేజోదర్శనము చూడవలెను.
పైవివరణలో, వెనుక, నాదములో చెప్పినదంతయూ, రెండువాక్యములలో ఉపనిషద్రష్ట ప్రవచించినారు. కావుననే, ప్రతివాక్యమును, ప్రతిశబ్దమును ఎంతోలోతుగా అలోచించవలసిన ఆవశ్యకత కన్పట్టు చున్నది. నాదబిందువును మానసికముగా సాధించలేక పోయినచో, భౌతికముగా ఎలా సాధించగలమో ఇక్కడ వివరించారు. మన చెవులలో చూపుడువేళ్ళ కొనలను జొనిపిన ప్రాణఘోష వినపడును. అది ఒక రంధ్రము నుండి గాలి వేగముగా ప్రయాణించు శబ్దమును పోలియుండును. ఆశబ్దమునకు నాదమును ఆపాదించి, దృష్టిని ఆజ్ఞాచక్రమునందు అనగా భ్రుకుటియందు నిలిపిన, నాదబిందువును సాధించ గలము. దానిపై ఏకాగ్రతతో మనస్సును నిలిపినయెడల 'నీలజ్యొతి' కనపడును. ఆనీలజ్యొతి ఆత్మ దర్శనముతప్ప మరి యితరముకాదు. ఈసాధనలో చాలామంది చాలారంగులు, వివిధరూపాలు కలవని సూచించుచున్నారు. ఈవిషయములో తెలుసుకొనవలసినదేమిటంటే, ఇది ఎవరికివారికి ఒక ప్రత్యేకమైన అనుభవము. ఇంకొకరితో పోల్చిచూడరాదు. అందుకే, చాలామంది ద్రష్టలు రకరకాలుగా చెప్పినను, వీటిని గురించితెలుసుకొని, తనదైన మార్గములో సాధకుడు గమ్యాన్ని చేరవలసి యుంటుంది. ఎన్ని రంగులు, ఎన్ని ఆకారములు సాధనలో కనిపించిననూ, చివరికి, పరిపూర్ణమైన తెలుపులో కలసిపో వలసినదే! పండువెన్నెలవంటి ఆతేజస్సులో ఆనందమనుభవించ వలసినదే! ఈఉపనిషద్రష్ట ప్రణవ తేజో మయ స్వరూపము గురించి, అనగా నాదబిందువు యొక్క కాంతిమయస్వరూపము గురించి ఈ విధంగా ప్రవచించారు. "స్ఫటిక ధూమ్ర బిందు నాద కళా నక్షత్ర ఖద్యో తాదీ సువర్ణ నవరత్నాదిప్రభా దృశ్యంతే, తదేవ ప్రణవ స్వరూపమ్|" "స్ఫటిక మైన తెల్లని కాంతియు, బిందు నాదకళా నక్షత్రముల వంటి కాంతియు, మెరుము, దీపము, స్వర్ణము, నవరత్నములునగు కాంతి చూడబడుచున్నది. అదియే ప్రణవస్వరూపము." దీనిని బట్టి ప్రణవమునకు తేజోరూపము కలదని ఋజువగుచున్నది. వివిధకాంతుల గురించి చెప్పిననూ, మొదట స్ఫటికమైన తెల్లనికాంతి యని చెప్పుటవలన, అదియే అసలైన స్వరూపమని తెలుయుచున్నది. తెల్లనికాంతిలో అన్నివర్ణములు కలిసియున్నవి కదా! ఇదియే స్వప్రకాశదర్శనము. కావున దీనిని అంతర్లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్లక్ష్యమనగా, తనలో తన గురించి తాను చూచుట. లేదా తెలుసుకొనుట. దీనిపై 'బహిర్లక్ష్యము' కలదని ఈఉపనిషత్ లోనే సూచించినారు. బహిర్లక్ష్యమనగా, తనను దాటి పైనున్న దానిని చూచుట, లేదా, తెలుసుకొనుట.
"బహిర్లక్ష్యస్తు నాసాగ్రే చతుష్షడష్ట దశ ద్వాదశాంగుళిభిః క్రమాత్ నీలద్యుతి శ్యామత్వ సద్రుగ్రక్త భఙ్గీస్ఫురచ్ఛుక్ల పీతవర్ణ ద్వయోపేతం,వ్యోమతత్త్వం పశ్యతి, సతు యోగీ, చల దృష్ట్యా వ్యోమభాగ వీక్షితు పురుషస్యదృష్టగ్రే ద్వాదశాంగులమానః జ్యొతిః పశ్యతి. తదామృతతత్త్వమేతి." "బహిర్లక్ష్యమనగా నాసికా గ్రమందు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండంగుళముల చేత క్రమముగా నీలవర్ణ ప్రకాశము గాను, శ్యామలవర్ణసమానమైన రక్తవర్ణముతో కూడినదిగాను, తెలుపును, పీత(బంగారు)వర్ణమును కలిసినట్లుండు, వ్యోమతత్త్వమును జూచుచున్నాడు. వాడే యోగి. చలదృష్టి చేత వ్యోమభాగమును జూచెడి యోగి దృష్టియొక్క అగ్రభాగమునందు జ్యోతికిరణములు కనబడును. ఇందువలన దృష్టి స్థిరమగుచున్నది. శిరోగ్రభాగమునందు పన్నెండంగుళములకు మీద, జ్యోతిస్సమూహదర్శనము కలిగి, అమృతతత్త్వము కలుగుచున్నది."
ఈబహిర్లక్ష్యము సాధకునికి అత్యంతప్రధానము. ఎంతోతీవ్రమైన సాధనను ఉపనిషద్రష్ట కొన్ని సాదారణ వాక్యములలో ప్రవచించినారు. దీనిని నిశితముగా పరిశీలించినచో, సరియైన మార్గము దొరకును. బహిర్లక్ష్యము నాసికాగ్రము నుండి బయలుదేరి, ఆజ్ఞాచక్రము, సహస్రారము చేరి, అటనుండి ఇంకనూ పైకి పోవుచున్నది. అనగా సహస్రారముదాటి ఇంకనూ స్థాయిలు గలవని తేలుచున్నది. ఇక్కడ 'చల దృష్టి' అని సూచించినారు. చలదృష్టి అనగా దృష్టిని కేంద్రీకరించుస్థానమును పైపైకి తీసుకొని వెళ్ళుట. అలా పైపైకి శిరోగ్రభాగమునుండి ఇంకనూ పైకి తీసుకొని వెళ్ళవలయును. ఇచట అంగుళములనగా కొలతకాదని, స్థాయీబేధమని గ్రహించవలెను. తదుపరి, వివిధ స్థాయిలలో కనిపించు తేజస్సు యొక్క వర్ణములు వివరించుచూ, నీలము, శ్యామలవర్ణముతో కలసియుండు ఎరుపు, తెలుపు బంగారు వర్ణముతో కలసియుండు వర్ణములు తెలియజేయుచూ, దృష్టియొక్క అగ్రభాగమునందు జ్యోతికిరణము లు కనబడునని సూచించినారు. నాసికాగ్రమునుండి, కనులవరకూ వున్నది అధోదృష్టి. అనగా క్రిందకు, ప్రపంచసంబంధమైనవి చూచుట. ఆజ్ఞాచక్రమునుండి ఊర్ధ్వదృష్టి మొదలగును. అక్కడనుండి భౌతికేతరమైనవి, పారలౌకికమైనవి కనపడును. అచ్చోట జ్యోతికిరణములు కనబడునని సూచించి నారు. అనగా ఆతేజోమయ స్వరూపముయొక్క కిరణములు మాత్రమే కనపడును. అనగా, ఆనిరాకార పరమాత్మ యొక్క అంశమగు ఆత్మ కనబడును. ఇచట దృష్టి స్థిరమగును. అనగా దృఢమైన ఏకాగ్రత కలుగును. కాని చలదృష్టి ఆపరాదు. ఆ ఏకాగ్రస్థానమును మెల్లమెల్లగా ఇంకనూ పైపైకి తీసుకొని పోయినయెడల జ్యోతిసమూహము కనపడును. అనగా, జ్యోతికిరణముల, అనగా ఆత్మ యొక్క మూలమైన పరమాత్మఅనుభవము కలుగును. అపుడు అమృతతత్త్వము కలుగును. అట్లు చేసినవాడే యోగి అని నిర్వచించినారు. ఈస్థాయికి వచ్చిన సాధకుని ఆత్మస్వరూపమే ఇంకనూ పైస్థాయిలకు తీసుకొనిపోగలదు.
ఈ సారి కలుసుకున్నప్పుడు దీని తదుపరి స్థాయి అయిన 'చైతన్యము' గురించి తెలుసుకుందాము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము.)
మనం గతంలో నాదం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు దాని తదుపరి స్థాయి అయిన తేజస్సు గురించి తెలుసుకుందాము. భౌతికముగా నాదము మరియు తేజస్సు అనగా శబ్దము, కాంతులను పరి శీలించిన, శబ్దముకంటే కాంతియొక్క వేగము, త్వరణము(velocity), వ్యాపకత్వము, పరిధి ఎక్కువ. కావుననే, అనేక లక్షల కాంతిసంవత్సరాల దూరములొ నున్న నక్షత్రములను ఈభౌతిక నేత్రములతో చూడగలుగుచున్నాము. ఇట్లే, ఆధ్యాత్మికభావములో కూడ నాదముకంటే తెజస్సునకు ఎక్కువ ప్రాముఖ్యత కలదు. ఈతేజస్సు భౌతికమైన కాంతికాదు. ఇది ఆత్మసంబంధమైనది (spiritual). ఈతేజస్సు జ్ఞాననేత్రము ద్వారా మాత్రమే గోచరమగునది. ధ్యానసమాధుల్లో మాత్రమే అనుభవము లోనికి వచ్చునది. ఈఅధ్యాయములో తేజస్సునకు భౌతికమైన ఉదాహరణలు వచ్చినప్పటికీ, వాటిని ఆత్మ సంబంధమైనవిగాను, పారలౌకికమైనవి గాను భావించవలెను.
మొదట నాదమునకు తేజస్సునకు గల సంబంధము తెలుసుకొందాము. తేజోబిందూపనిషత్ 5వ అధ్యాయములో ఈ విధంగా చెప్పబడినది. "శాంతాశాంత విహీనాత్మా నాదంత జ్యోతిరూపకః, మహా వాక్యార్థతో బ్రహస్మిత్యతిదూరతః| తచ్ఛబ్దవర్జస్త్వం శబ్దహీనో యొ నాదాంతజ్యోతిరేవసః| అఖండైక రసోవాహమానందోస్మితి వర్జితః, సర్వాతీత స్వభాత్మా నాదాంత జ్యోతిరేవసః" ఈ వాక్యములననుసరించి శాంతము, అశాంతము మున్నగునవి విసర్జించినవానికి, బ్రహ్మస్మి మొదలగు మహావాక్యార్థములు మరియు శబ్దమునుకూడ విసర్జించినవానికి, అఖండైకరసప్రవాహములో మునిగితేలుచు, అన్నివిధము లైన ప్రాపంచికస్వభావములు విసర్జించినవానికి, నాదముయొక్క అంతమందు జ్యోతి రూపమొక్కటియే మిగులును. దీనిని బట్టి నాదముయొక్క అంతమందు తేజస్సు మిగులునని ఋజువగుచున్నది. ఆ తేజోరూపదర్శనము వలన సకలాతీత సమతుల్య భావన ఏర్పడుచున్నది.
మండలబ్రాహ్మణోపనిషత్ లో 'అంతర్లక్ష్యము' ను వివరించుచూ భౌతికముగా నాద బిందువును ఎట్లు సాధించవచ్చునో, ఆ తదుపరి తేజోదర్శనమెట్లగునో వివరించబడినది. "మూలాధారా దారభ్య బ్రహ్మరంధ్రపర్యంతం సుషుమ్నాసూర్యాభా, తన్మధ్యే, తటిత్కోటిసమా మృణాళతన్తుసూక్ష్మా కుండలినీ, తత్ర తమోనివృత్తిః, తద్దర్శనా పాపనివృత్తిః, తర్జన్యగ్రోన్మీలిత కర్ణరంధ్రద్వయే, ఫూత్కార శబ్దోజాయతే, తత్రస్థితేమనసి, చక్షుర్మధ్యనీలజ్యోతిపశ్యతి, ఏవంహృదఏపి." మూలాధారము నుండి బ్రహ్మరంద్ర(సహస్రారము)పర్యంతము సుషుమ్నానాడి సూర్యునివలె ప్రకాశింపుచున్నది. దానినడుమ, తటిత్కోటిసమానమైన తామరనూలువోలె సూక్ష్మమైన కుండలినీశక్తి(ప్రాణశక్తి) వెలుగుచున్నది. అప్పుడు తమోనివృత్తి చెందును. చూపుడువేళ్ళ కొనలచేత కర్ణరంధ్రములు మూసికొనిన యెడల ఫూత్కార శబ్దము వినపడును. అపుడు స్థితప్రజ్ఞతో కూడిన మనస్సుతో నేత్రమధ్యమందలి నీలజ్యోతి కనపడును. అట్లే హృదయమందు కూడ తేజోదర్శనము చూడవలెను.
పైవివరణలో, వెనుక, నాదములో చెప్పినదంతయూ, రెండువాక్యములలో ఉపనిషద్రష్ట ప్రవచించినారు. కావుననే, ప్రతివాక్యమును, ప్రతిశబ్దమును ఎంతోలోతుగా అలోచించవలసిన ఆవశ్యకత కన్పట్టు చున్నది. నాదబిందువును మానసికముగా సాధించలేక పోయినచో, భౌతికముగా ఎలా సాధించగలమో ఇక్కడ వివరించారు. మన చెవులలో చూపుడువేళ్ళ కొనలను జొనిపిన ప్రాణఘోష వినపడును. అది ఒక రంధ్రము నుండి గాలి వేగముగా ప్రయాణించు శబ్దమును పోలియుండును. ఆశబ్దమునకు నాదమును ఆపాదించి, దృష్టిని ఆజ్ఞాచక్రమునందు అనగా భ్రుకుటియందు నిలిపిన, నాదబిందువును సాధించ గలము. దానిపై ఏకాగ్రతతో మనస్సును నిలిపినయెడల 'నీలజ్యొతి' కనపడును. ఆనీలజ్యొతి ఆత్మ దర్శనముతప్ప మరి యితరముకాదు. ఈసాధనలో చాలామంది చాలారంగులు, వివిధరూపాలు కలవని సూచించుచున్నారు. ఈవిషయములో తెలుసుకొనవలసినదేమిటంటే, ఇది ఎవరికివారికి ఒక ప్రత్యేకమైన అనుభవము. ఇంకొకరితో పోల్చిచూడరాదు. అందుకే, చాలామంది ద్రష్టలు రకరకాలుగా చెప్పినను, వీటిని గురించితెలుసుకొని, తనదైన మార్గములో సాధకుడు గమ్యాన్ని చేరవలసి యుంటుంది. ఎన్ని రంగులు, ఎన్ని ఆకారములు సాధనలో కనిపించిననూ, చివరికి, పరిపూర్ణమైన తెలుపులో కలసిపో వలసినదే! పండువెన్నెలవంటి ఆతేజస్సులో ఆనందమనుభవించ వలసినదే! ఈఉపనిషద్రష్ట ప్రణవ తేజో మయ స్వరూపము గురించి, అనగా నాదబిందువు యొక్క కాంతిమయస్వరూపము గురించి ఈ విధంగా ప్రవచించారు. "స్ఫటిక ధూమ్ర బిందు నాద కళా నక్షత్ర ఖద్యో తాదీ సువర్ణ నవరత్నాదిప్రభా దృశ్యంతే, తదేవ ప్రణవ స్వరూపమ్|" "స్ఫటిక మైన తెల్లని కాంతియు, బిందు నాదకళా నక్షత్రముల వంటి కాంతియు, మెరుము, దీపము, స్వర్ణము, నవరత్నములునగు కాంతి చూడబడుచున్నది. అదియే ప్రణవస్వరూపము." దీనిని బట్టి ప్రణవమునకు తేజోరూపము కలదని ఋజువగుచున్నది. వివిధకాంతుల గురించి చెప్పిననూ, మొదట స్ఫటికమైన తెల్లనికాంతి యని చెప్పుటవలన, అదియే అసలైన స్వరూపమని తెలుయుచున్నది. తెల్లనికాంతిలో అన్నివర్ణములు కలిసియున్నవి కదా! ఇదియే స్వప్రకాశదర్శనము. కావున దీనిని అంతర్లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్లక్ష్యమనగా, తనలో తన గురించి తాను చూచుట. లేదా తెలుసుకొనుట. దీనిపై 'బహిర్లక్ష్యము' కలదని ఈఉపనిషత్ లోనే సూచించినారు. బహిర్లక్ష్యమనగా, తనను దాటి పైనున్న దానిని చూచుట, లేదా, తెలుసుకొనుట.
"బహిర్లక్ష్యస్తు నాసాగ్రే చతుష్షడష్ట దశ ద్వాదశాంగుళిభిః క్రమాత్ నీలద్యుతి శ్యామత్వ సద్రుగ్రక్త భఙ్గీస్ఫురచ్ఛుక్ల పీతవర్ణ ద్వయోపేతం,వ్యోమతత్త్వం పశ్యతి, సతు యోగీ, చల దృష్ట్యా వ్యోమభాగ వీక్షితు పురుషస్యదృష్టగ్రే ద్వాదశాంగులమానః జ్యొతిః పశ్యతి. తదామృతతత్త్వమేతి." "బహిర్లక్ష్యమనగా నాసికా గ్రమందు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండంగుళముల చేత క్రమముగా నీలవర్ణ ప్రకాశము గాను, శ్యామలవర్ణసమానమైన రక్తవర్ణముతో కూడినదిగాను, తెలుపును, పీత(బంగారు)వర్ణమును కలిసినట్లుండు, వ్యోమతత్త్వమును జూచుచున్నాడు. వాడే యోగి. చలదృష్టి చేత వ్యోమభాగమును జూచెడి యోగి దృష్టియొక్క అగ్రభాగమునందు జ్యోతికిరణములు కనబడును. ఇందువలన దృష్టి స్థిరమగుచున్నది. శిరోగ్రభాగమునందు పన్నెండంగుళములకు మీద, జ్యోతిస్సమూహదర్శనము కలిగి, అమృతతత్త్వము కలుగుచున్నది."
ఈబహిర్లక్ష్యము సాధకునికి అత్యంతప్రధానము. ఎంతోతీవ్రమైన సాధనను ఉపనిషద్రష్ట కొన్ని సాదారణ వాక్యములలో ప్రవచించినారు. దీనిని నిశితముగా పరిశీలించినచో, సరియైన మార్గము దొరకును. బహిర్లక్ష్యము నాసికాగ్రము నుండి బయలుదేరి, ఆజ్ఞాచక్రము, సహస్రారము చేరి, అటనుండి ఇంకనూ పైకి పోవుచున్నది. అనగా సహస్రారముదాటి ఇంకనూ స్థాయిలు గలవని తేలుచున్నది. ఇక్కడ 'చల దృష్టి' అని సూచించినారు. చలదృష్టి అనగా దృష్టిని కేంద్రీకరించుస్థానమును పైపైకి తీసుకొని వెళ్ళుట. అలా పైపైకి శిరోగ్రభాగమునుండి ఇంకనూ పైకి తీసుకొని వెళ్ళవలయును. ఇచట అంగుళములనగా కొలతకాదని, స్థాయీబేధమని గ్రహించవలెను. తదుపరి, వివిధ స్థాయిలలో కనిపించు తేజస్సు యొక్క వర్ణములు వివరించుచూ, నీలము, శ్యామలవర్ణముతో కలసియుండు ఎరుపు, తెలుపు బంగారు వర్ణముతో కలసియుండు వర్ణములు తెలియజేయుచూ, దృష్టియొక్క అగ్రభాగమునందు జ్యోతికిరణము లు కనబడునని సూచించినారు. నాసికాగ్రమునుండి, కనులవరకూ వున్నది అధోదృష్టి. అనగా క్రిందకు, ప్రపంచసంబంధమైనవి చూచుట. ఆజ్ఞాచక్రమునుండి ఊర్ధ్వదృష్టి మొదలగును. అక్కడనుండి భౌతికేతరమైనవి, పారలౌకికమైనవి కనపడును. అచ్చోట జ్యోతికిరణములు కనబడునని సూచించి నారు. అనగా ఆతేజోమయ స్వరూపముయొక్క కిరణములు మాత్రమే కనపడును. అనగా, ఆనిరాకార పరమాత్మ యొక్క అంశమగు ఆత్మ కనబడును. ఇచట దృష్టి స్థిరమగును. అనగా దృఢమైన ఏకాగ్రత కలుగును. కాని చలదృష్టి ఆపరాదు. ఆ ఏకాగ్రస్థానమును మెల్లమెల్లగా ఇంకనూ పైపైకి తీసుకొని పోయినయెడల జ్యోతిసమూహము కనపడును. అనగా, జ్యోతికిరణముల, అనగా ఆత్మ యొక్క మూలమైన పరమాత్మఅనుభవము కలుగును. అపుడు అమృతతత్త్వము కలుగును. అట్లు చేసినవాడే యోగి అని నిర్వచించినారు. ఈస్థాయికి వచ్చిన సాధకుని ఆత్మస్వరూపమే ఇంకనూ పైస్థాయిలకు తీసుకొనిపోగలదు.
ఈ సారి కలుసుకున్నప్పుడు దీని తదుపరి స్థాయి అయిన 'చైతన్యము' గురించి తెలుసుకుందాము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము.)