ప్రాణోత్క్రమణము
జీవన్ముక్తలక్షణాలు, జీవన్ముక్తునిదశలు గురించి తెలుసుకున్న తర్వాత, విదేహముక్తికిద్వారము, చతుర్ముఖబ్రహ్మ మొదలుకొని చీమవరకు, ప్రతీజీవికి తప్పనిసరి అయిన ప్రాణోత్క్రమణముగురించి అంటే మరణముగురించి తెలుసుకుందాము. మరణము అంటే ఏముంది, చచ్చిపోవడమేకదా! దీని గురించి ఏమితెలుసుకోవాలి, ఎందుకుతెలుసుకోవాలి? అనే ప్రశ్నలు వస్తాయి. ఆధ్యాత్మికజీవితములొ సంభవించే ప్రతీదశగురించి సాధకుడు తప్పనిసరిగా క్షుణ్ణముగా తెలుసుకోవాలి. ప్రతీదానియొక్క పూర్తిజ్ఞానము సంపాదించి, దాన్ని ఆఎరుకతో అనుభవించాలి. ఈప్రాణోత్క్రమణము ప్రతీవారికి వారివారి జ్ఞానముయొక్క స్థాయిలని బట్టి సంభవిస్తుంది. అజ్ఞాని దీన్నిగురించి భయపడతాడుగాని, జ్ఞాని ఎంతమాత్రమూ భయ పడడు. పైగా దీనిని పరబ్రహ్మస్వరూపమునకు జేర్చే సాధనముగాభావించి, సాదరముగా స్వాగతిస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోనవిషయము ఇంకొకటివుంది. ఇక్కడ పెద్దలుచెప్పిన విషయాలను భౌతిక మరణముతో పోల్చిచూడవద్దు. వీరు చెప్పిన విషయములు ఆత్మకు, తత్సంబంధిత ఇతరశరీరాలకు (ఇవి భౌతికశరీరానికిఅందవు, ధ్యానములోను, యోగములోనుమాత్రమే అనుభవములోనికి వస్తాయి) సంబంధించినవి. ఇక్కడ చెప్పిన కొన్నిపరిణామాలు ఈభౌతికశరీరములొ సంభవింపవుకూడా! ఈ విషయాలను ఆదృష్టిలో మాత్రమే గమనించ మనవి. ఇప్పుడు ప్రాణోత్క్రమణము గురించి మహానుభావులు ఏమి వివరించారో తెలుసుకుందాము.
యోగవాసిష్టము:నిర్వాణ ప్రకరణము:32వ సర్గ:దేహపాత విచారము:(ఈశ్వరుడు వశిష్టునితో వచింపు చున్నాడు:)
పరమచైతన్యము జీవుల శరీరమున ప్రవేశించి, కార్యముల నాచరింపజేయు విధిని, దేహముల బ్రవేశించి, చలనయుక్తమై, స్నాత, భోక్త, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, మున్నగు సంజ్ఞలను బడయు విధానమునుచెప్పుచున్నాను వినుము. ఈచైతన్యమునకొక శక్తి యున్నది. అయ్యది ఆవరణశక్తి. అయ్యది తనకాశ్రయమగు బ్రహ్మమును మరుగునపడజేసి, లేదనిపించుచూ, పూర్వార్జితములగు సంస్కారజనితములగు యత్నములను, వివిధములును, విధినిషేధరూపకమగు కాయిక,వాచికకర్మల వలన మనోభావము పొంది చైతన్యము నుండి ఉద్భవించినదయ్యు, జడమువోలె నగుచున్నది. ఇట్లు వ్యవహారదశను బొందిన బ్రహ్మశక్తి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల వలన ద్రష్టృ, దృశ్య, దర్శనములను బేధముల బొందుచున్నది. పరమచైతన్యము ఈ మాయాశక్తి యొక్క ప్రసాదమువలననే కళంకితమై జగద్రూప గంధర్వనగరములను సృష్టించుచున్నది. (పరమార్థ భావమున) సృష్టించుటలేదు.
సర్వవ్యాపియగు ఈ చిత్ శక్తి బలముననే ఈజీవులందరూ వికాసమునందుచున్నారు. ఈజీవులు చైతన్యముయొక్క ప్రతిబింబమాత్రులు.(పంచభూత)ద్రవ్యస్వభావులగు జీవులు అద్రవ్య(నర్ధర్మక) స్వభా వమగు చైతన్యముయొక్క ప్రతిబింబమని నుడువవీలుపడదందువా? (ఇక్కడ ఒక విషయాన్ని గమ్మత్తుగా చెప్పారు. జ్ఞాని స్వస్వరూపజ్ఞానముపొంది, ఆపరాచైతన్యము యొక్క ప్రతిబింబమే తనఆత్మ అని తెలుసుకుంటాడు. కాని తాను భౌతికశరీరమని భావించే అజ్ఞానియొక్క ఆత్మకూడా ఆచైతన్యము యొక్క ప్రతిబింబమని చెప్పగలమా? అని ప్రశ్నించారు. దానికి జవాబు కూడా ఇస్తున్నారు.) ద్రవ్యము యొక్క ప్రతిబింబమే పడవలెనను నియమము లేదు. అద్దమునందు గుణము, క్రియలు మున్నగువాటి ప్రతిబింబముకూడా పడుచున్నది. ఇటగూడ నట్లే గ్రహింపవలయును. ఈజీవుడు బ్రహ్మము యొక్క ప్రతిబింబమైననూ, నిజస్వరూపమును విస్మరించినందున జడభావము పొందినాడు. సద్బ్రాహ్మణుడు మోహవశమునను కుకర్మల నాచరించుట వలన శూద్రత్వము బొందుట లేదా? (చూశారా! చేసే కర్మలనుబట్టే వర్ణము నిర్ణయింపబడుతుంది.) ఈచైతన్యము స్వస్వరూపమును విస్మరించుట వలననే చిత్తభావమును బొందినది. మహాత్ములు కూడా మోహవశమున వికలత్వము బొంది, దీనభావము నొందుచున్నారు కదా! తరంగముల వలన నీరు సంభవించునట్లు ఈచైతన్యము కూడ ప్రాణవాయువుతో నధ్యస్తమై శరీరమును సంచరింపజేయుచున్నది. (ఈ శరీరము నడవటానికి, ప్రాణవాయువుతోపాటు చైతన్యముకూడ అవుసరమే). పరమాత్మ శరీరశకటమునునడిపింపగోరి, మనస్సు, ప్రాణములను దృఢ వాహనముల రెండింటిని సృష్టించినాడు. ఈచైతన్యము జడరూపమును గ్రహించి, జీవభావమునొంది, ప్రాణమను గుఱ్ఱముకట్టబడిన మనస్సనురథమునెక్కి, తనస్వరూపమును త్యజింపకున్ననూ, జాగ్రద్దశయందు, జన్మించుచున్నాననితోచు పదార్థములుగను, స్వప్నావస్థయందు(మేల్కొనిన) నష్ట మగు పదార్థములుగను, కనబడుచున్నది. కాని ఈపదార్థములుగా మారుటలేదు. అందువలన తరంగ త్వము జలములనుండి వేరుకానట్లు, ఈచైతన్యముకూడ జగత్తునుండి వేరుకాదు. దీపమున ఇల్లే ప్రకాశించునట్లు, నిరామయమగు పరమాత్మ చైతన్యముండుటవలననే, జీవుడు జీవించుచున్నాడు. సూర్యుడు తాను(నీటినావిరిగ మార్చి) సృష్టించి ప్రకాశింపజేయు మేఘమండలము వలననే గప్పబడి, తిరోధాన, మ్లాన, ఖండభావముల బొందునట్లు, చైతన్యముగూడ అన్నిటికినీ ఆధారమయ్యు, ఈ శరీరమున వైవశ్యము నొందుచున్నది. ఎక్కుడుగా కల్లుద్రావి మత్తుగన్న మనుజుడు తన అవయవము ఖండింపబడిననూ దానిని గ్రహింపజాలనట్లు, చైతన్యముగూడ వైవశ్యము నొంది, స్వస్వరూపమును గ్రహింపజాలకున్నది. మదమత్తుడు కైపుతగ్గినా తానా సమయమున యొనర్చిన చెయిదముల గుర్తుకు దెచ్చుకొననియట్లు చైతన్యముకూడ మోహము వినష్టమవ, స్వస్వరూపమును గ్రహింపజాలదు.
కుష్టురోగి హస్తపాదములవలె కొంచెము కొంచెముగ సర్వశరీరవ్యాపియగు జీవచైతన్యము విలుప్త మవ, ప్రాణవాయువుయొక్క శక్తిగూడ హస్తపాదాది శరీరాంగములు గూడ వైవశ్యమునందును. అప్పుడు చైతన్యము హృదయకమలమున చలనరహితమై, యజ్ఞమునకుపయోగించని కాష్టపాత్ర వలె నుండును. హృదయకమలదళములు చలనరహితమవ, విసనకర్రవీవనిచొ, గాలి కట్టువడునట్లు అంతరముననున్న ప్రాణవాయువులన్నియు నాగిపోవును. గాలి ఆగిపోవ కట్టువడు దుమారమువోలె ప్రాణవాయువు లో నడిగిన జీవుడు నామరూపొపాధిరహితుడై, కారణస్వరూపుడైవెలయును. అప్పుడు అతని మనస్సు గూడ రజోగుణహీనము, నిరాధారమునై ప్రాణవాయువుతోలీనమై కారణాత్మతనందును. మరల వృక్ష బీజమువలె దేహరూపముగ బ్రకాశించుచుండును. ఇట్లు వైకల్యమునందిన మూలకారణములతో పుర్యష్టకము ప్రశాంతమైన, [పుర్యష్టకమనిన శరీరమనే నగరములోకల ఎనిమిది ముఖ్యమైన భాగాలు. అవి, 1.జ్ఞానేంద్రియపంచకము, 2.కర్మేంద్రియపంచకము, 3.ప్రాణాదిపంచకము, 4.ఆకాశాదిపంచకము, 5.అంతఃకరణచతుష్టయము, 6.కామము, 7.కర్మలు, 8.తమస్సు(అవిద్య)] దేహము నిశ్చలమై పడి పోవును. స్వస్వరూపాజ్ఞానమను మోహమువలన చైతన్యము చేత్యాంకురమును బొందుచున్నది. దానియండే వాసనాసమూహములన్నియూ గూడ స్పందించుచున్నవి. ఈవాసనలవలన పరిచాలితమై చైతన్యము స్వస్వరూపమును విస్మరించి, ఆళీకములగు(స్వప్నములవంటి) కల్పనల నోనర్చు చుండును. క్రమముగా హృదయకమలదళములు వికసింప పుర్యష్టకముగూడ పరిస్ఫుటమగును. ఈ హ్సృదయకమలయంత్రమును నిశ్చలమొనర్చిన, పుర్యష్టకముగూడ వినష్టమై పోవును. శరీర మధ్యమున పుర్యష్టకమున్నంత వరకు అయ్యది జీవద్దశనంటియుండును. పుర్యష్టకము నశించిన శరీరము మృతమైనదిగనెన్నబడును. తన సంకల్పము వలననే జీవుడు మరణాది దుఃఖసమూహము ననుభవించుచున్నాడు. మరియు శరీరమందలి పద్మయంత్రముకూడ ఎడతెగక చలించుచున్నది. ఎవ్వరి హృదయమున సదా పవిత్రమగు వాసనయుండునో, అట్టి జీవులు శాశ్వతులుగను, ఏకరూపులు గను చిరంజీవులు, జీవన్ముక్తులై వెలయుదురు. హృత్పద్మయంత్రము నిరుద్ధమవ, ప్రాణవాయువు శాంతింప ఈశరీరము ధృతి, శక్తి వీడి కాష్టలోష్టసమమై భూమిమీద గూలును. అనాదికాలము నుండి అభ్యస్తములగు వాసనల గూర్చుకొని, మనస్సెచ్చటెచ్చట పరిభ్రమించుచుండునో, అచ్చటచ్చట స్వర్గ నరకముల గాంచుచుండును. గృహస్థుడు దూరమవ, పాడుబడ్డ ఇంటివలె, మనస్సు, ప్రాణ వాయువులు లేచిపోయిన, శరీరము శవరూపము నొందును.
సర్వగామియగు బ్రహ్మచైతన్యమే చేత్యభావమును, అందుండి చేతనభావమును, దానినుండి జీవ భావమును, దానినుండిమనోభావమును, అందుండి పుర్యష్టకమునుదాల్చి, సూక్ష్మశరీరమును దాల్చుచున్నది. ఈభావనదృఢమవ, దానినే సత్యమనితలచి, దీనియందు ఆసక్తినిగొని, తన అతివాహక భావమును మరచును. ఇట్లు కృత్రిమమగుభావనమున, అసత్యశరీరమున సత్యబుద్ధిని గొని, అసత్య మును సత్యముగను, సత్యమునసత్యముగను యొనర్చుచున్నది. సర్వగామియగు ఈచైతన్యము యొక్క ఒకఅంశమాత్రము(అనగా చైతన్యము తనయందు ఒకఅంశను కల్పించుకొని) మనస్సుగా మారి, పుర్యష్టకరధమునధిరోహించి, జగత్తునాక్రమించుచున్నది. ఈచైతన్యము సూక్ష్మ భూతాత్మకము ను, ప్రాణాయామమునునగు పుర్యష్తకరూపశరీరమును లేవదీయ, జనులు దీనిని జీవించియున్న దానినిగ పేర్కొనుచున్నారు. ఈజీవించియుండుట శవమధ్యమున బేతాళముప్రవేశింప, అది కదిలిన జీవించియున్నదని తలంచుటలో బోలియున్నది. పుర్యష్టకము నశించి, చిత్తమాకాశామున లీనమవ, శరీరము కాష్ఠపాషాణమువలె అచేతనమగును. ఈస్థితినే శరీరము మృతమనబడును. క్రొత్తదగు చివురుటాకు కాలక్రమమున ఎండిపోవునట్లు, జీవభావమునందిన ఈచైతన్యము అజ్ఞానమున తన అజరామర బ్రహ్మస్వరూపమునుమరచి, కాలక్రమమున వైవశ్యమొంది, శక్తిరహితమగును. పిదప హృత్పద్మయంత్రము జీవస్మృతిని గోల్పోయి నిశ్చలమవ, ప్రాణవాయువు నిరుద్ధమగును. అప్పుడే మనుష్యుని మృతుడందురు. వృక్ పత్రములవలె మనుష్యుల శరీరములుగూడ పుట్టిగిట్టుచున్నవి. జననమరణములు వీటికి స్వాభావికములు. అగుచో దుఃఖింపనేల? చిత్సముద్రమున ఏఏ వైపుల ఎన్ని శరీరములను బుద్బుదపంక్తులు లేచుచున్నవో చెప్పజాలము. బుద్ధిమంతులకు వీటియందు శాశ్వత బుద్ధిలేదు.
మైత్రాయణ్యుపనిషత్ : ద్వితీయ ప్రపాఠకము:
2.బాహ్యేంద్రియస్తంభనము కలగగా, ఊర్థ్వముగాఉత్క్రమించి(పోయి), బాధపడుచు, పడక, తమస్సు ను పోగొట్టునే, అతడే ఆత్మ. మరియు ఏయితడు నిర్మలుడై ఈశరీరము నుండి లేచి, పరమజ్యోతి రూపము పొంది, నిజరూపు పొందునో, అతడే ఆత్మ. ఈ బ్రహ్మ అమృతము, అభయము.
బ్రహ్మసూత్ర దర్శనం:
ఉత్క్రాంతిని గురించి చెప్పబడ్డది. ఈ విధమైన ఉత్క్రాంతి (బ్రహ్మ)ఉపాసకునికి, ఉపాసకుడు కానివానికి కూడ సమానమౌనా? కాదా? అని సంశయం.
సూ:"సమానాచాసృత్యుపక్రమాదమృతత్త్వంచానుపాష్య" దేవయానమార్గారంభానికి పూర్వం విద్వాంసుడు, అవిద్వాంసుడు వీరిద్దరి ఉత్క్రాంతి సమానమే. ఎందుచేత? 'వాఙ్మనసి' అనే శృతి విశేష మైనది. సగుణవిద్యయందు చెప్పబడిన అమృతత్త్వం కేవలం ఔపచారికమే. గౌణము అవిద్య అనేది దహింపబడక పూర్వమే కలుగుతోందికాబట్టి. సగుణబ్రహ్మజ్ఞానికి(సాకారోపాసకునికి) మూర్ధన్యనాడీ ప్రవేశము ఉత్తరమార్గానపోవడం జరుగుతుంది. ఆయామార్గాల వరకూ ఉపాసకుడైన జ్ఞానికి, ఉపాస కుడు కాని అజ్ఞానికికూడ భూతసూక్ష్మావయవం సమానమే! దేవయానమార్గాన పోకుండా (పర)బ్రహ్మ లోక ప్రాప్తి అనేది సగుణబ్రహ్మజ్ఞానికి కలుగదు కాబట్టి, ఉత్క్రాంతి ఇతనికి సమానమే. ఉపాసకుడు పొందే అమృతత్త్వంకాదు. ఆపేక్షికమైనట్టి అమృతత్త్వమన్నమాట. (సాకారోపాసకుడైన సాధారణజ్ఞానికి, అజ్ఞానికికూడ ప్రాణంపోయే మార్గాలు, అవయవాలు ఒక్కలాగే వుంటాయి. అజ్ఞానికి ఒకవేళ ప్రాణం ఊర్థ్వముగాపోయినా, అక్కడవున్న అవయవాలైన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మున్నగు అవయవాలద్వారా పోతుంది. అజ్ఞానికాబట్టి సంచితము, ప్రారబ్దములను బట్టి తదుపరి జన్మ వుంటుంది. సాధారణజ్ఞానికికూడా ఊర్థ్వముగా ప్రాణంపోయినప్పటికీ, ఉపాసనాదైవము యొక్క ధ్యాస వుండటము వలన ఆసాకారదైవము యొక్క సారూప్య, సామీప్య, సాయుజ్యాలు కలుగుతాయి తప్ప మోక్షం లభించదు. ఉపాసనల వలన లభించిన పుణ్యఫలం పూర్తి కాగానే మళ్ళా జన్మకు వస్తాడు.)
నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలవానికి ఉత్క్రాంతి వున్నదా? లేదా? సంశయ నివారణ. సూ: 'సృష్టోహ్యీ కేషాం'. కొందరి శాఖయందు, కణ్వశాఖయందు దేహమునుండి ప్రాణోత్క్రాంతి నిషేధం స్పష్టంగా వుంది. కాబట్టి బ్రహ్మవిదునకు ఉత్క్రాంతిలేదు. బృహదారణ్యకోపనిషత్ 3.2.12. లో, చనిపోయేవారి ప్రాణాలు ఉత్క్రమణం చెందుతాయా, చెందవా? అని అడుగగా, చెందవు అని యాజ్ఞవల్క్యుడు సమాధానమిచ్చాడు. మరి ప్రాణాలు ఉత్క్రాంతిని పొందకపోతే యితడు మృతుడుకాడు గదా! అనే అనుమానానికి 'అత్ర్యేవ సమ వరీయన్తే' అని ప్రాణాలకు ఇచ్చటనే వినాశాన్నిచెప్పి, ఆవినాశనం సిద్ధించటానికై 'సఉచ్ఛ్వయత్త్వా ధ్మాయ యత్యాధ్మతోమృతశ్వేతే' ఆపురుషుడు ఉబ్బుతాడు, పొట్టవాయువుచేత పూరిమ్పబడుతుంది, దేహముకూడ ఉబ్బుతుంది. మృతుడై పడిపోతాడు అని మరణావస్థను వర్ణించాడు. కాబట్టి అవిద్వాంసు నికి శరీరమునుండియే ప్రాణోత్క్రమణం చెప్పబడ్డది. అంతేతప్ప (పరబ్రహ్మ)విద్వాంసుడైన జీవునికి ప్రాణోత్క్రమణం గాని, మార్గంగాని లేదు. "అతబ్రహ్మ సమశ్నుతే" బ్రహ్మవేత్త ఇచటనే బ్రహ్మ మగును అని శృతి బోధిస్తోంది. సూ: "తానిపరేతథాహ్యాహ" బ్రహ్మవేత్తలకు ఆప్రాణాత్మకాలైన ఇంద్రియాలు, భూతాలూ పరమాత్మయందే లయమౌతాయి. నిరవశేషంగాలయమౌతాయి.'ఏవమే వాస్య' అనేశృతి ఇట్లాగే చెపు తోంది. (ప్రశ్నోపనిషత్ 6.5) నదులన్నీ సముద్రాన్ని పొంది తమతమ రూపాన్ని కోల్పోయి సముద్ర మనే పేరుతొ వ్యవహరింపబడునట్లుగా అంతటా ప్రత్యగ్రూపమైన బ్రహ్మ స్వరూపాన్నే చూస్తూవుండే బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు అపరోక్షజ్ఞానం వల్ల మాత్రమే తెలుసుకోవడానికి వీలైన పురుషుని పొంది (లయమై) తమతమ నామరూపాల్ని కోల్పోతున్నాయి. కాబట్టి బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు పరమాత్మయందే లయమౌతున్నాయి అని సిద్దాంతం. (దీనిని బట్టి తెలుసు కునేదేమిటంటే యోగులకు, బ్రహ్మవేత్తలకు ప్రాణోత్క్రమణంలేదు. వారి శరీరము లోంచి ప్రాణం బయటకురాగానే, పరబ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి, అక్కడే వున్న పరబ్రహ్మలో నిరవశేషంగా లయమవుతుంది. అది ఎవ్వరికీ గోచరము కాదు. వీరియొక్క నిరవశేషలయం కారణముగా, భౌతికశరీరమును పంచభూతాలలో కలపటమే తప్ప, వీరికి ఎటువంటి అపరకర్మలూ అవుసరము లేదు. ఆరాధనోత్సవాలను మాత్రమే జరుపుకోవాలి. ఈ విధానాన్ని సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీగారి పట్ల ఆచరించటం జరిగింది.)
సూ: "అవిద్భాగోవచనాత్" విద్వాంసుని ఇంద్రియాలకు (కళలకు) బ్రహ్మతో పూర్తిగా అవిభాగమైన లయమే అని శృతివచనం. (ప్రశ్నోపనిషత్ 6.5) ఆ కళలయొక్క (ఇంద్రియాలు ప్రాణాలయొక్క) నామ రూపాలు నశిస్తాయి. అన్నీ కలసిపోయి పురుషుడని మాత్రమే వ్యవహారం. ఇట్లు బ్రహ్మైక్యరూపమైనట్టి లయాన్ని పొందినప్పుడు సాధకుడు కళలులేనివాడు, ముక్తుడు అవుతాడు అని చెప్పడంవల్ల నిశ్శేష లయం అని తెలుస్తోంది. అజ్ఞానులకు అవిద్యాశేషం వుంటుంది కాబట్టి, వారి ఇంద్రియలయం సావశేష లయమై వుంటుంది.
శృతి ప్రమాణాలిట్లావున్నాయి.(బృ.దా.ఉ.4.4.1) ఇట్లా జీవుడు ప్రవేశించినతర్వాత హృదయం ప్రకాశి స్తుంది. ఆప్రకాశం సూచించినమార్గంద్వారా జీవుడు నిష్క్రమిస్తాడు.(8.8.6.) హృదయములో నూట ఒక్క ముఖ్యమైన నాడులున్నాయి. అందులో మూర్థంవైపుకుపోయే ఒకనాడి వుంది. దానిద్వారా పైకి పోయే జీవుడు అమృతత్త్వాన్నిపొందుతాడు. మిగతానాడులు కేవలం బయటకుపోవటానికి మార్గాలు గానే వుంటాయి. వాటినుండి నిష్క్రమించినవారికి బ్రహ్మలోకప్రాప్తిలేదని తెలుస్తోంది. సూ: "తదోకోగ్ర జ్వలనంతత్ప్రకాశితద్వారఃవిద్యాసామర్థ్యాత్,తచ్ఛేషగత్యనుస్మృతియోగాచ్ఛహార్థామగ్రహీతశ్శతాధి కయా" సగుణబ్రహ్మవేత్తయొక్క ఆత్మ శరీరంనుండి నిష్క్రమించేటప్పుడు జీవునికి వాసస్థానమైన హృదయం యొక్క చివరిభాగంలో ఒకవిధమైన జ్వలనం కలుగుతుంది. దానిచేత ప్రకాశింపజేయబడిన మార్గం కల వాడై హృదయంలో అధివసించియున్న బ్రహ్మముచేత అనుగ్రహింపబడినవాడై బ్రహ్మవిద్యాసామర్థ్యం వల్లనూ, బ్రహ్మవిద్యకు అంగంగాచెప్పబడిన గతిని ధ్యానించడంవల్లనూ, నూటఒకటవదిఅయిన మూర్థన్య నాడి(సుషుమ్న)మార్గాన నిష్క్రమిస్తాడు. వాగీంద్రియం ఉపసంహరింపబడటం జీవుడు హృదయస్థానా న్ని ప్రవేశించడం, హృదయాగ్రం ప్రకాశించడం అనేవి జ్ఞానికి, అజ్ఞానికి సమానమే. దీనివల్ల నిర్గమించే మార్గం ప్రకాశితమౌతుంది. అయితే జ్ఞాని మూర్థస్థానంలో వున్న సుషుమ్ననాడీ మార్గాన నిష్క్రమిస్తాడు. అమృతత్త్వాన్ని పొందుతాడు. అజ్ఞానులు శరీరమందలి ఇతరద్వారాల గుండా, కండ్లు, ముక్కులు చెవులు మున్నగు వాటి ద్వారా నిష్క్రమిస్తారు.
సూ: "అతశ్చాయనేపి దక్షిణే" విద్యాఫలమనేది నియతంగా వుండేది కాబట్టి దక్షిణాయనంలో చనిపోయిన ఉపాసకునికిసైతం బ్రహ్మలోకప్రాప్తి ఉంది. వేచిఉండనక్కరలేదు. ఉత్తరాయణం అంటే కేవలం కాలాని చెప్పే విభాగంకాదు. ఉత్తరాయణాభిమానియైన దేవత అని అర్థం. కాలాభిమాని అయిన ఆదేవత అన్ని కాలాల్లొనూ వుంటాడు. ఉత్తరాయణమరణం మంచిదని అజ్ఞానులైన వారి విషయంలో చెప్పినారట. భీష్ముడు ఉత్తరాయణంకోసం ప్రతీక్షించడం అనేది లోకాచారంకోసం, తండ్రి తనకు ఇచ్చిన స్వచ్ఛంద మరణమనే వరం యొక్క శక్తిని వెల్లడించడంకోసం అని మనం గ్రహించాలి. (భీష్ముదు కూడా తక్కువ వాడేమీ కాదు. అష్టవసువులలో ఆఖరివాడు. కామధేనువు శాపమువలన మానవునిగా మిగిలిన వసువులతో పాటు జన్మించాడు. గంగ శంతనుని ద్వారా కని, నీటిలో పడవేసిన ఏడుగురు శిశువులూ మిగిలిన వసువులు.)
సూ: "సంపద్యావిర్భావ స్వేన శబ్డాత్" ప్రకాశస్వరూపమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆ ఆత్మరూపంలో విద్వాంసుడు ఆవిర్భూతుడౌతాడు.
సూ: "అనావృత్తిః శబ్దానువృత్తిః శబ్దాత్" (చివరి సూత్రం) అర్చిరాదిమార్గం గుండా బ్రహ్మ లోకానికి పోయిన ఉపాసకులకు పునరావృత్తి లేదు. పునరావృత్తి లేదు.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)
జీవన్ముక్తలక్షణాలు, జీవన్ముక్తునిదశలు గురించి తెలుసుకున్న తర్వాత, విదేహముక్తికిద్వారము, చతుర్ముఖబ్రహ్మ మొదలుకొని చీమవరకు, ప్రతీజీవికి తప్పనిసరి అయిన ప్రాణోత్క్రమణముగురించి అంటే మరణముగురించి తెలుసుకుందాము. మరణము అంటే ఏముంది, చచ్చిపోవడమేకదా! దీని గురించి ఏమితెలుసుకోవాలి, ఎందుకుతెలుసుకోవాలి? అనే ప్రశ్నలు వస్తాయి. ఆధ్యాత్మికజీవితములొ సంభవించే ప్రతీదశగురించి సాధకుడు తప్పనిసరిగా క్షుణ్ణముగా తెలుసుకోవాలి. ప్రతీదానియొక్క పూర్తిజ్ఞానము సంపాదించి, దాన్ని ఆఎరుకతో అనుభవించాలి. ఈప్రాణోత్క్రమణము ప్రతీవారికి వారివారి జ్ఞానముయొక్క స్థాయిలని బట్టి సంభవిస్తుంది. అజ్ఞాని దీన్నిగురించి భయపడతాడుగాని, జ్ఞాని ఎంతమాత్రమూ భయ పడడు. పైగా దీనిని పరబ్రహ్మస్వరూపమునకు జేర్చే సాధనముగాభావించి, సాదరముగా స్వాగతిస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోనవిషయము ఇంకొకటివుంది. ఇక్కడ పెద్దలుచెప్పిన విషయాలను భౌతిక మరణముతో పోల్చిచూడవద్దు. వీరు చెప్పిన విషయములు ఆత్మకు, తత్సంబంధిత ఇతరశరీరాలకు (ఇవి భౌతికశరీరానికిఅందవు, ధ్యానములోను, యోగములోనుమాత్రమే అనుభవములోనికి వస్తాయి) సంబంధించినవి. ఇక్కడ చెప్పిన కొన్నిపరిణామాలు ఈభౌతికశరీరములొ సంభవింపవుకూడా! ఈ విషయాలను ఆదృష్టిలో మాత్రమే గమనించ మనవి. ఇప్పుడు ప్రాణోత్క్రమణము గురించి మహానుభావులు ఏమి వివరించారో తెలుసుకుందాము.
యోగవాసిష్టము:నిర్వాణ ప్రకరణము:32వ సర్గ:దేహపాత విచారము:(ఈశ్వరుడు వశిష్టునితో వచింపు చున్నాడు:)
పరమచైతన్యము జీవుల శరీరమున ప్రవేశించి, కార్యముల నాచరింపజేయు విధిని, దేహముల బ్రవేశించి, చలనయుక్తమై, స్నాత, భోక్త, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, మున్నగు సంజ్ఞలను బడయు విధానమునుచెప్పుచున్నాను వినుము. ఈచైతన్యమునకొక శక్తి యున్నది. అయ్యది ఆవరణశక్తి. అయ్యది తనకాశ్రయమగు బ్రహ్మమును మరుగునపడజేసి, లేదనిపించుచూ, పూర్వార్జితములగు సంస్కారజనితములగు యత్నములను, వివిధములును, విధినిషేధరూపకమగు కాయిక,వాచికకర్మల వలన మనోభావము పొంది చైతన్యము నుండి ఉద్భవించినదయ్యు, జడమువోలె నగుచున్నది. ఇట్లు వ్యవహారదశను బొందిన బ్రహ్మశక్తి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల వలన ద్రష్టృ, దృశ్య, దర్శనములను బేధముల బొందుచున్నది. పరమచైతన్యము ఈ మాయాశక్తి యొక్క ప్రసాదమువలననే కళంకితమై జగద్రూప గంధర్వనగరములను సృష్టించుచున్నది. (పరమార్థ భావమున) సృష్టించుటలేదు.
సర్వవ్యాపియగు ఈ చిత్ శక్తి బలముననే ఈజీవులందరూ వికాసమునందుచున్నారు. ఈజీవులు చైతన్యముయొక్క ప్రతిబింబమాత్రులు.(పంచభూత)ద్రవ్యస్వభావులగు జీవులు అద్రవ్య(నర్ధర్మక) స్వభా వమగు చైతన్యముయొక్క ప్రతిబింబమని నుడువవీలుపడదందువా? (ఇక్కడ ఒక విషయాన్ని గమ్మత్తుగా చెప్పారు. జ్ఞాని స్వస్వరూపజ్ఞానముపొంది, ఆపరాచైతన్యము యొక్క ప్రతిబింబమే తనఆత్మ అని తెలుసుకుంటాడు. కాని తాను భౌతికశరీరమని భావించే అజ్ఞానియొక్క ఆత్మకూడా ఆచైతన్యము యొక్క ప్రతిబింబమని చెప్పగలమా? అని ప్రశ్నించారు. దానికి జవాబు కూడా ఇస్తున్నారు.) ద్రవ్యము యొక్క ప్రతిబింబమే పడవలెనను నియమము లేదు. అద్దమునందు గుణము, క్రియలు మున్నగువాటి ప్రతిబింబముకూడా పడుచున్నది. ఇటగూడ నట్లే గ్రహింపవలయును. ఈజీవుడు బ్రహ్మము యొక్క ప్రతిబింబమైననూ, నిజస్వరూపమును విస్మరించినందున జడభావము పొందినాడు. సద్బ్రాహ్మణుడు మోహవశమునను కుకర్మల నాచరించుట వలన శూద్రత్వము బొందుట లేదా? (చూశారా! చేసే కర్మలనుబట్టే వర్ణము నిర్ణయింపబడుతుంది.) ఈచైతన్యము స్వస్వరూపమును విస్మరించుట వలననే చిత్తభావమును బొందినది. మహాత్ములు కూడా మోహవశమున వికలత్వము బొంది, దీనభావము నొందుచున్నారు కదా! తరంగముల వలన నీరు సంభవించునట్లు ఈచైతన్యము కూడ ప్రాణవాయువుతో నధ్యస్తమై శరీరమును సంచరింపజేయుచున్నది. (ఈ శరీరము నడవటానికి, ప్రాణవాయువుతోపాటు చైతన్యముకూడ అవుసరమే). పరమాత్మ శరీరశకటమునునడిపింపగోరి, మనస్సు, ప్రాణములను దృఢ వాహనముల రెండింటిని సృష్టించినాడు. ఈచైతన్యము జడరూపమును గ్రహించి, జీవభావమునొంది, ప్రాణమను గుఱ్ఱముకట్టబడిన మనస్సనురథమునెక్కి, తనస్వరూపమును త్యజింపకున్ననూ, జాగ్రద్దశయందు, జన్మించుచున్నాననితోచు పదార్థములుగను, స్వప్నావస్థయందు(మేల్కొనిన) నష్ట మగు పదార్థములుగను, కనబడుచున్నది. కాని ఈపదార్థములుగా మారుటలేదు. అందువలన తరంగ త్వము జలములనుండి వేరుకానట్లు, ఈచైతన్యముకూడ జగత్తునుండి వేరుకాదు. దీపమున ఇల్లే ప్రకాశించునట్లు, నిరామయమగు పరమాత్మ చైతన్యముండుటవలననే, జీవుడు జీవించుచున్నాడు. సూర్యుడు తాను(నీటినావిరిగ మార్చి) సృష్టించి ప్రకాశింపజేయు మేఘమండలము వలననే గప్పబడి, తిరోధాన, మ్లాన, ఖండభావముల బొందునట్లు, చైతన్యముగూడ అన్నిటికినీ ఆధారమయ్యు, ఈ శరీరమున వైవశ్యము నొందుచున్నది. ఎక్కుడుగా కల్లుద్రావి మత్తుగన్న మనుజుడు తన అవయవము ఖండింపబడిననూ దానిని గ్రహింపజాలనట్లు, చైతన్యముగూడ వైవశ్యము నొంది, స్వస్వరూపమును గ్రహింపజాలకున్నది. మదమత్తుడు కైపుతగ్గినా తానా సమయమున యొనర్చిన చెయిదముల గుర్తుకు దెచ్చుకొననియట్లు చైతన్యముకూడ మోహము వినష్టమవ, స్వస్వరూపమును గ్రహింపజాలదు.
కుష్టురోగి హస్తపాదములవలె కొంచెము కొంచెముగ సర్వశరీరవ్యాపియగు జీవచైతన్యము విలుప్త మవ, ప్రాణవాయువుయొక్క శక్తిగూడ హస్తపాదాది శరీరాంగములు గూడ వైవశ్యమునందును. అప్పుడు చైతన్యము హృదయకమలమున చలనరహితమై, యజ్ఞమునకుపయోగించని కాష్టపాత్ర వలె నుండును. హృదయకమలదళములు చలనరహితమవ, విసనకర్రవీవనిచొ, గాలి కట్టువడునట్లు అంతరముననున్న ప్రాణవాయువులన్నియు నాగిపోవును. గాలి ఆగిపోవ కట్టువడు దుమారమువోలె ప్రాణవాయువు లో నడిగిన జీవుడు నామరూపొపాధిరహితుడై, కారణస్వరూపుడైవెలయును. అప్పుడు అతని మనస్సు గూడ రజోగుణహీనము, నిరాధారమునై ప్రాణవాయువుతోలీనమై కారణాత్మతనందును. మరల వృక్ష బీజమువలె దేహరూపముగ బ్రకాశించుచుండును. ఇట్లు వైకల్యమునందిన మూలకారణములతో పుర్యష్టకము ప్రశాంతమైన, [పుర్యష్టకమనిన శరీరమనే నగరములోకల ఎనిమిది ముఖ్యమైన భాగాలు. అవి, 1.జ్ఞానేంద్రియపంచకము, 2.కర్మేంద్రియపంచకము, 3.ప్రాణాదిపంచకము, 4.ఆకాశాదిపంచకము, 5.అంతఃకరణచతుష్టయము, 6.కామము, 7.కర్మలు, 8.తమస్సు(అవిద్య)] దేహము నిశ్చలమై పడి పోవును. స్వస్వరూపాజ్ఞానమను మోహమువలన చైతన్యము చేత్యాంకురమును బొందుచున్నది. దానియండే వాసనాసమూహములన్నియూ గూడ స్పందించుచున్నవి. ఈవాసనలవలన పరిచాలితమై చైతన్యము స్వస్వరూపమును విస్మరించి, ఆళీకములగు(స్వప్నములవంటి) కల్పనల నోనర్చు చుండును. క్రమముగా హృదయకమలదళములు వికసింప పుర్యష్టకముగూడ పరిస్ఫుటమగును. ఈ హ్సృదయకమలయంత్రమును నిశ్చలమొనర్చిన, పుర్యష్టకముగూడ వినష్టమై పోవును. శరీర మధ్యమున పుర్యష్టకమున్నంత వరకు అయ్యది జీవద్దశనంటియుండును. పుర్యష్టకము నశించిన శరీరము మృతమైనదిగనెన్నబడును. తన సంకల్పము వలననే జీవుడు మరణాది దుఃఖసమూహము ననుభవించుచున్నాడు. మరియు శరీరమందలి పద్మయంత్రముకూడ ఎడతెగక చలించుచున్నది. ఎవ్వరి హృదయమున సదా పవిత్రమగు వాసనయుండునో, అట్టి జీవులు శాశ్వతులుగను, ఏకరూపులు గను చిరంజీవులు, జీవన్ముక్తులై వెలయుదురు. హృత్పద్మయంత్రము నిరుద్ధమవ, ప్రాణవాయువు శాంతింప ఈశరీరము ధృతి, శక్తి వీడి కాష్టలోష్టసమమై భూమిమీద గూలును. అనాదికాలము నుండి అభ్యస్తములగు వాసనల గూర్చుకొని, మనస్సెచ్చటెచ్చట పరిభ్రమించుచుండునో, అచ్చటచ్చట స్వర్గ నరకముల గాంచుచుండును. గృహస్థుడు దూరమవ, పాడుబడ్డ ఇంటివలె, మనస్సు, ప్రాణ వాయువులు లేచిపోయిన, శరీరము శవరూపము నొందును.
సర్వగామియగు బ్రహ్మచైతన్యమే చేత్యభావమును, అందుండి చేతనభావమును, దానినుండి జీవ భావమును, దానినుండిమనోభావమును, అందుండి పుర్యష్టకమునుదాల్చి, సూక్ష్మశరీరమును దాల్చుచున్నది. ఈభావనదృఢమవ, దానినే సత్యమనితలచి, దీనియందు ఆసక్తినిగొని, తన అతివాహక భావమును మరచును. ఇట్లు కృత్రిమమగుభావనమున, అసత్యశరీరమున సత్యబుద్ధిని గొని, అసత్య మును సత్యముగను, సత్యమునసత్యముగను యొనర్చుచున్నది. సర్వగామియగు ఈచైతన్యము యొక్క ఒకఅంశమాత్రము(అనగా చైతన్యము తనయందు ఒకఅంశను కల్పించుకొని) మనస్సుగా మారి, పుర్యష్టకరధమునధిరోహించి, జగత్తునాక్రమించుచున్నది. ఈచైతన్యము సూక్ష్మ భూతాత్మకము ను, ప్రాణాయామమునునగు పుర్యష్తకరూపశరీరమును లేవదీయ, జనులు దీనిని జీవించియున్న దానినిగ పేర్కొనుచున్నారు. ఈజీవించియుండుట శవమధ్యమున బేతాళముప్రవేశింప, అది కదిలిన జీవించియున్నదని తలంచుటలో బోలియున్నది. పుర్యష్టకము నశించి, చిత్తమాకాశామున లీనమవ, శరీరము కాష్ఠపాషాణమువలె అచేతనమగును. ఈస్థితినే శరీరము మృతమనబడును. క్రొత్తదగు చివురుటాకు కాలక్రమమున ఎండిపోవునట్లు, జీవభావమునందిన ఈచైతన్యము అజ్ఞానమున తన అజరామర బ్రహ్మస్వరూపమునుమరచి, కాలక్రమమున వైవశ్యమొంది, శక్తిరహితమగును. పిదప హృత్పద్మయంత్రము జీవస్మృతిని గోల్పోయి నిశ్చలమవ, ప్రాణవాయువు నిరుద్ధమగును. అప్పుడే మనుష్యుని మృతుడందురు. వృక్ పత్రములవలె మనుష్యుల శరీరములుగూడ పుట్టిగిట్టుచున్నవి. జననమరణములు వీటికి స్వాభావికములు. అగుచో దుఃఖింపనేల? చిత్సముద్రమున ఏఏ వైపుల ఎన్ని శరీరములను బుద్బుదపంక్తులు లేచుచున్నవో చెప్పజాలము. బుద్ధిమంతులకు వీటియందు శాశ్వత బుద్ధిలేదు.
మైత్రాయణ్యుపనిషత్ : ద్వితీయ ప్రపాఠకము:
2.బాహ్యేంద్రియస్తంభనము కలగగా, ఊర్థ్వముగాఉత్క్రమించి(పోయి), బాధపడుచు, పడక, తమస్సు ను పోగొట్టునే, అతడే ఆత్మ. మరియు ఏయితడు నిర్మలుడై ఈశరీరము నుండి లేచి, పరమజ్యోతి రూపము పొంది, నిజరూపు పొందునో, అతడే ఆత్మ. ఈ బ్రహ్మ అమృతము, అభయము.
బ్రహ్మసూత్ర దర్శనం:
ఉత్క్రాంతిని గురించి చెప్పబడ్డది. ఈ విధమైన ఉత్క్రాంతి (బ్రహ్మ)ఉపాసకునికి, ఉపాసకుడు కానివానికి కూడ సమానమౌనా? కాదా? అని సంశయం.
సూ:"సమానాచాసృత్యుపక్రమాదమృతత్త్వంచానుపాష్య" దేవయానమార్గారంభానికి పూర్వం విద్వాంసుడు, అవిద్వాంసుడు వీరిద్దరి ఉత్క్రాంతి సమానమే. ఎందుచేత? 'వాఙ్మనసి' అనే శృతి విశేష మైనది. సగుణవిద్యయందు చెప్పబడిన అమృతత్త్వం కేవలం ఔపచారికమే. గౌణము అవిద్య అనేది దహింపబడక పూర్వమే కలుగుతోందికాబట్టి. సగుణబ్రహ్మజ్ఞానికి(సాకారోపాసకునికి) మూర్ధన్యనాడీ ప్రవేశము ఉత్తరమార్గానపోవడం జరుగుతుంది. ఆయామార్గాల వరకూ ఉపాసకుడైన జ్ఞానికి, ఉపాస కుడు కాని అజ్ఞానికికూడ భూతసూక్ష్మావయవం సమానమే! దేవయానమార్గాన పోకుండా (పర)బ్రహ్మ లోక ప్రాప్తి అనేది సగుణబ్రహ్మజ్ఞానికి కలుగదు కాబట్టి, ఉత్క్రాంతి ఇతనికి సమానమే. ఉపాసకుడు పొందే అమృతత్త్వంకాదు. ఆపేక్షికమైనట్టి అమృతత్త్వమన్నమాట. (సాకారోపాసకుడైన సాధారణజ్ఞానికి, అజ్ఞానికికూడ ప్రాణంపోయే మార్గాలు, అవయవాలు ఒక్కలాగే వుంటాయి. అజ్ఞానికి ఒకవేళ ప్రాణం ఊర్థ్వముగాపోయినా, అక్కడవున్న అవయవాలైన కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మున్నగు అవయవాలద్వారా పోతుంది. అజ్ఞానికాబట్టి సంచితము, ప్రారబ్దములను బట్టి తదుపరి జన్మ వుంటుంది. సాధారణజ్ఞానికికూడా ఊర్థ్వముగా ప్రాణంపోయినప్పటికీ, ఉపాసనాదైవము యొక్క ధ్యాస వుండటము వలన ఆసాకారదైవము యొక్క సారూప్య, సామీప్య, సాయుజ్యాలు కలుగుతాయి తప్ప మోక్షం లభించదు. ఉపాసనల వలన లభించిన పుణ్యఫలం పూర్తి కాగానే మళ్ళా జన్మకు వస్తాడు.)
నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలవానికి ఉత్క్రాంతి వున్నదా? లేదా? సంశయ నివారణ. సూ: 'సృష్టోహ్యీ కేషాం'. కొందరి శాఖయందు, కణ్వశాఖయందు దేహమునుండి ప్రాణోత్క్రాంతి నిషేధం స్పష్టంగా వుంది. కాబట్టి బ్రహ్మవిదునకు ఉత్క్రాంతిలేదు. బృహదారణ్యకోపనిషత్ 3.2.12. లో, చనిపోయేవారి ప్రాణాలు ఉత్క్రమణం చెందుతాయా, చెందవా? అని అడుగగా, చెందవు అని యాజ్ఞవల్క్యుడు సమాధానమిచ్చాడు. మరి ప్రాణాలు ఉత్క్రాంతిని పొందకపోతే యితడు మృతుడుకాడు గదా! అనే అనుమానానికి 'అత్ర్యేవ సమ వరీయన్తే' అని ప్రాణాలకు ఇచ్చటనే వినాశాన్నిచెప్పి, ఆవినాశనం సిద్ధించటానికై 'సఉచ్ఛ్వయత్త్వా ధ్మాయ యత్యాధ్మతోమృతశ్వేతే' ఆపురుషుడు ఉబ్బుతాడు, పొట్టవాయువుచేత పూరిమ్పబడుతుంది, దేహముకూడ ఉబ్బుతుంది. మృతుడై పడిపోతాడు అని మరణావస్థను వర్ణించాడు. కాబట్టి అవిద్వాంసు నికి శరీరమునుండియే ప్రాణోత్క్రమణం చెప్పబడ్డది. అంతేతప్ప (పరబ్రహ్మ)విద్వాంసుడైన జీవునికి ప్రాణోత్క్రమణం గాని, మార్గంగాని లేదు. "అతబ్రహ్మ సమశ్నుతే" బ్రహ్మవేత్త ఇచటనే బ్రహ్మ మగును అని శృతి బోధిస్తోంది. సూ: "తానిపరేతథాహ్యాహ" బ్రహ్మవేత్తలకు ఆప్రాణాత్మకాలైన ఇంద్రియాలు, భూతాలూ పరమాత్మయందే లయమౌతాయి. నిరవశేషంగాలయమౌతాయి.'ఏవమే వాస్య' అనేశృతి ఇట్లాగే చెపు తోంది. (ప్రశ్నోపనిషత్ 6.5) నదులన్నీ సముద్రాన్ని పొంది తమతమ రూపాన్ని కోల్పోయి సముద్ర మనే పేరుతొ వ్యవహరింపబడునట్లుగా అంతటా ప్రత్యగ్రూపమైన బ్రహ్మ స్వరూపాన్నే చూస్తూవుండే బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు అపరోక్షజ్ఞానం వల్ల మాత్రమే తెలుసుకోవడానికి వీలైన పురుషుని పొంది (లయమై) తమతమ నామరూపాల్ని కోల్పోతున్నాయి. కాబట్టి బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు పరమాత్మయందే లయమౌతున్నాయి అని సిద్దాంతం. (దీనిని బట్టి తెలుసు కునేదేమిటంటే యోగులకు, బ్రహ్మవేత్తలకు ప్రాణోత్క్రమణంలేదు. వారి శరీరము లోంచి ప్రాణం బయటకురాగానే, పరబ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి, అక్కడే వున్న పరబ్రహ్మలో నిరవశేషంగా లయమవుతుంది. అది ఎవ్వరికీ గోచరము కాదు. వీరియొక్క నిరవశేషలయం కారణముగా, భౌతికశరీరమును పంచభూతాలలో కలపటమే తప్ప, వీరికి ఎటువంటి అపరకర్మలూ అవుసరము లేదు. ఆరాధనోత్సవాలను మాత్రమే జరుపుకోవాలి. ఈ విధానాన్ని సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీగారి పట్ల ఆచరించటం జరిగింది.)
సూ: "అవిద్భాగోవచనాత్" విద్వాంసుని ఇంద్రియాలకు (కళలకు) బ్రహ్మతో పూర్తిగా అవిభాగమైన లయమే అని శృతివచనం. (ప్రశ్నోపనిషత్ 6.5) ఆ కళలయొక్క (ఇంద్రియాలు ప్రాణాలయొక్క) నామ రూపాలు నశిస్తాయి. అన్నీ కలసిపోయి పురుషుడని మాత్రమే వ్యవహారం. ఇట్లు బ్రహ్మైక్యరూపమైనట్టి లయాన్ని పొందినప్పుడు సాధకుడు కళలులేనివాడు, ముక్తుడు అవుతాడు అని చెప్పడంవల్ల నిశ్శేష లయం అని తెలుస్తోంది. అజ్ఞానులకు అవిద్యాశేషం వుంటుంది కాబట్టి, వారి ఇంద్రియలయం సావశేష లయమై వుంటుంది.
శృతి ప్రమాణాలిట్లావున్నాయి.(బృ.దా.ఉ.4.4.1) ఇట్లా జీవుడు ప్రవేశించినతర్వాత హృదయం ప్రకాశి స్తుంది. ఆప్రకాశం సూచించినమార్గంద్వారా జీవుడు నిష్క్రమిస్తాడు.(8.8.6.) హృదయములో నూట ఒక్క ముఖ్యమైన నాడులున్నాయి. అందులో మూర్థంవైపుకుపోయే ఒకనాడి వుంది. దానిద్వారా పైకి పోయే జీవుడు అమృతత్త్వాన్నిపొందుతాడు. మిగతానాడులు కేవలం బయటకుపోవటానికి మార్గాలు గానే వుంటాయి. వాటినుండి నిష్క్రమించినవారికి బ్రహ్మలోకప్రాప్తిలేదని తెలుస్తోంది. సూ: "తదోకోగ్ర జ్వలనంతత్ప్రకాశితద్వారఃవిద్యాసామర్థ్యాత్,తచ్ఛేషగత్యనుస్మృతియోగాచ్ఛహార్థామగ్రహీతశ్శతాధి కయా" సగుణబ్రహ్మవేత్తయొక్క ఆత్మ శరీరంనుండి నిష్క్రమించేటప్పుడు జీవునికి వాసస్థానమైన హృదయం యొక్క చివరిభాగంలో ఒకవిధమైన జ్వలనం కలుగుతుంది. దానిచేత ప్రకాశింపజేయబడిన మార్గం కల వాడై హృదయంలో అధివసించియున్న బ్రహ్మముచేత అనుగ్రహింపబడినవాడై బ్రహ్మవిద్యాసామర్థ్యం వల్లనూ, బ్రహ్మవిద్యకు అంగంగాచెప్పబడిన గతిని ధ్యానించడంవల్లనూ, నూటఒకటవదిఅయిన మూర్థన్య నాడి(సుషుమ్న)మార్గాన నిష్క్రమిస్తాడు. వాగీంద్రియం ఉపసంహరింపబడటం జీవుడు హృదయస్థానా న్ని ప్రవేశించడం, హృదయాగ్రం ప్రకాశించడం అనేవి జ్ఞానికి, అజ్ఞానికి సమానమే. దీనివల్ల నిర్గమించే మార్గం ప్రకాశితమౌతుంది. అయితే జ్ఞాని మూర్థస్థానంలో వున్న సుషుమ్ననాడీ మార్గాన నిష్క్రమిస్తాడు. అమృతత్త్వాన్ని పొందుతాడు. అజ్ఞానులు శరీరమందలి ఇతరద్వారాల గుండా, కండ్లు, ముక్కులు చెవులు మున్నగు వాటి ద్వారా నిష్క్రమిస్తారు.
సూ: "అతశ్చాయనేపి దక్షిణే" విద్యాఫలమనేది నియతంగా వుండేది కాబట్టి దక్షిణాయనంలో చనిపోయిన ఉపాసకునికిసైతం బ్రహ్మలోకప్రాప్తి ఉంది. వేచిఉండనక్కరలేదు. ఉత్తరాయణం అంటే కేవలం కాలాని చెప్పే విభాగంకాదు. ఉత్తరాయణాభిమానియైన దేవత అని అర్థం. కాలాభిమాని అయిన ఆదేవత అన్ని కాలాల్లొనూ వుంటాడు. ఉత్తరాయణమరణం మంచిదని అజ్ఞానులైన వారి విషయంలో చెప్పినారట. భీష్ముడు ఉత్తరాయణంకోసం ప్రతీక్షించడం అనేది లోకాచారంకోసం, తండ్రి తనకు ఇచ్చిన స్వచ్ఛంద మరణమనే వరం యొక్క శక్తిని వెల్లడించడంకోసం అని మనం గ్రహించాలి. (భీష్ముదు కూడా తక్కువ వాడేమీ కాదు. అష్టవసువులలో ఆఖరివాడు. కామధేనువు శాపమువలన మానవునిగా మిగిలిన వసువులతో పాటు జన్మించాడు. గంగ శంతనుని ద్వారా కని, నీటిలో పడవేసిన ఏడుగురు శిశువులూ మిగిలిన వసువులు.)
సూ: "సంపద్యావిర్భావ స్వేన శబ్డాత్" ప్రకాశస్వరూపమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆ ఆత్మరూపంలో విద్వాంసుడు ఆవిర్భూతుడౌతాడు.
సూ: "అనావృత్తిః శబ్దానువృత్తిః శబ్దాత్" (చివరి సూత్రం) అర్చిరాదిమార్గం గుండా బ్రహ్మ లోకానికి పోయిన ఉపాసకులకు పునరావృత్తి లేదు. పునరావృత్తి లేదు.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)