సహస్రారమునకు పైన చక్రములుగాని స్థాయిలుగాని కలవా?
నేను 1988 నుండి 1990 మధ్యలో, కృష్ణాజిల్లా గన్నవరంలోవున్నప్పుడు, మదీయ మాతృమూర్తులు, సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీ గారిని పైప్రశ్న అడిగినాను. దానికి వారు, సహస్రారముపైన ఆరు (6) చక్రములు అనగా స్థాయిలు గలవని, ఇది రహస్యమని, సహస్రారమునకు చేరిన తర్వాత, వీటిగురించి తెలియునని, అందులో మూడుస్థాయిలు శరీరముండగా అనుభవములోనికి వచ్చునని, మిగిలిన పై మూడు స్థాయిలు, శరీరపాతానంతరము, అనగా శరీరమును విడచిపెట్టిన తర్వాత మాత్రమే అనుభవములోనికి వచ్చునని తెలియజేసినారు. వాటి పేర్లు మొదలైనవి తెలియజేసినారు. వారు చెప్పినప్రకారము నేను మూలాధారము నుండి సహస్రారము వరకు, మరియు ఆ పై స్థాయిలు చూపించే ఒక చార్టు తయారుచేశాను. కాని కాలక్రమములో అది ఎక్కడ కనుమరుగైపోయిందో తెలియదు. కొన్నిరోజులక్రితం, నేను ముఖపుస్తకములో, శ్రీరుద్రఈశ్వర్ అనువారు పెట్టిన చిత్రమును చూసినాను. అందులో, మూలాధారమునకు దిగువ 7, మూలాధారము నుండి సహస్రారము వరకు 7, మరియు సహస్రారము పైన 7 చక్రములను గమనించినాను. అందులో కొంత వివరణకూడా యిచ్చినారు. కాని అది సరిగా కనపడనందున, సంబంధిత వెబ్ సైటును వెదకి పట్టుకొని ఆవివరణను కూడా తెలుసుకున్నాను. వాటిని ఈక్రింద ఇస్తున్నాను. ఇంతటి అమూల్యమైన యోగవిషయమును తెలియజేసిన శ్రీరుద్రఈశ్వర్ గారికి మాయొక్క కృతజ్ఞతలు తెలియజేసికొనుచున్నాము.
The Chakras Above sahasrara chakra: The most subtle of the chakras lie above the crown chakra at the top of the head, the higher the Chakra the more powerful it is, the more functionality it has, the higher its frequency. As we exist within an Antahkarana tower of energy which stretches from Earth to Heaven, it is really good to be able to talk to and control each chakra. The way to do this is to remove all Negative karmic mass, all energy blockages which block the communication. Like the tower of Babel.
Buddhist literature cites thirty-two chakras above sahasrara chakra.
Agamic Hindu tradition delineates seven levels of the rarified dimensions of paranada, the first tattva and the highest stratum of sound. They are: vyapini, vyomanga, ananta, anatha, anashrita, samana and unmana. There are 36 tatvas or Octaves containing 7 chakras each although God is infinite, there are an infinity of chakras.
వీటిని చూసినతర్వాత, ఈ విషయమును, మాయొక్క వాట్సప్ గ్రూపు "జ్ఞానయోగసాధనసభ" లో, వుంచి, సరిగ్గా ఇదే విషయాన్ని, గురువుగారు చెప్పారని, ఒక చార్టుకూడా తయరుచేశానని, కాని దురదృష్టవశాత్తు ఆ చార్టు పోయినదని చెప్పగా, తాడేపల్లిగూడెంలో వున్న గురువుగారి సీనియర్ శిష్యురాలైన శ్రీమతి నున్న లీలగారు, తాను గురువుగారినడిగి, ఆవిషయములు తెలుసుకొని ఒకపుస్తకములో వ్రాసుకొన్నానని, ఆ పేజీలు ఫొటో తీసి వాట్సప్ గ్రూపులో పెట్టినారు. వాటిని ఈ దిగువ ఇస్తున్నాను.
నేను 1988 నుండి 1990 మధ్యలో, కృష్ణాజిల్లా గన్నవరంలోవున్నప్పుడు, మదీయ మాతృమూర్తులు, సద్గురువులు పోడూరి కృష్ణవేణు మాతాజీ గారిని పైప్రశ్న అడిగినాను. దానికి వారు, సహస్రారముపైన ఆరు (6) చక్రములు అనగా స్థాయిలు గలవని, ఇది రహస్యమని, సహస్రారమునకు చేరిన తర్వాత, వీటిగురించి తెలియునని, అందులో మూడుస్థాయిలు శరీరముండగా అనుభవములోనికి వచ్చునని, మిగిలిన పై మూడు స్థాయిలు, శరీరపాతానంతరము, అనగా శరీరమును విడచిపెట్టిన తర్వాత మాత్రమే అనుభవములోనికి వచ్చునని తెలియజేసినారు. వాటి పేర్లు మొదలైనవి తెలియజేసినారు. వారు చెప్పినప్రకారము నేను మూలాధారము నుండి సహస్రారము వరకు, మరియు ఆ పై స్థాయిలు చూపించే ఒక చార్టు తయారుచేశాను. కాని కాలక్రమములో అది ఎక్కడ కనుమరుగైపోయిందో తెలియదు. కొన్నిరోజులక్రితం, నేను ముఖపుస్తకములో, శ్రీరుద్రఈశ్వర్ అనువారు పెట్టిన చిత్రమును చూసినాను. అందులో, మూలాధారమునకు దిగువ 7, మూలాధారము నుండి సహస్రారము వరకు 7, మరియు సహస్రారము పైన 7 చక్రములను గమనించినాను. అందులో కొంత వివరణకూడా యిచ్చినారు. కాని అది సరిగా కనపడనందున, సంబంధిత వెబ్ సైటును వెదకి పట్టుకొని ఆవివరణను కూడా తెలుసుకున్నాను. వాటిని ఈక్రింద ఇస్తున్నాను. ఇంతటి అమూల్యమైన యోగవిషయమును తెలియజేసిన శ్రీరుద్రఈశ్వర్ గారికి మాయొక్క కృతజ్ఞతలు తెలియజేసికొనుచున్నాము.
The Chakras Above sahasrara chakra: The most subtle of the chakras lie above the crown chakra at the top of the head, the higher the Chakra the more powerful it is, the more functionality it has, the higher its frequency. As we exist within an Antahkarana tower of energy which stretches from Earth to Heaven, it is really good to be able to talk to and control each chakra. The way to do this is to remove all Negative karmic mass, all energy blockages which block the communication. Like the tower of Babel.
Buddhist literature cites thirty-two chakras above sahasrara chakra.
Agamic Hindu tradition delineates seven levels of the rarified dimensions of paranada, the first tattva and the highest stratum of sound. They are: vyapini, vyomanga, ananta, anatha, anashrita, samana and unmana. There are 36 tatvas or Octaves containing 7 chakras each although God is infinite, there are an infinity of chakras.
వీటిని చూసినతర్వాత, ఈ విషయమును, మాయొక్క వాట్సప్ గ్రూపు "జ్ఞానయోగసాధనసభ" లో, వుంచి, సరిగ్గా ఇదే విషయాన్ని, గురువుగారు చెప్పారని, ఒక చార్టుకూడా తయరుచేశానని, కాని దురదృష్టవశాత్తు ఆ చార్టు పోయినదని చెప్పగా, తాడేపల్లిగూడెంలో వున్న గురువుగారి సీనియర్ శిష్యురాలైన శ్రీమతి నున్న లీలగారు, తాను గురువుగారినడిగి, ఆవిషయములు తెలుసుకొని ఒకపుస్తకములో వ్రాసుకొన్నానని, ఆ పేజీలు ఫొటో తీసి వాట్సప్ గ్రూపులో పెట్టినారు. వాటిని ఈ దిగువ ఇస్తున్నాను.
అందులో గురువుగారు ఈవిధంగా తెలియజేశారు. సహస్రారము పైనుండి, వరుసగా, కర్మలోకం, భ్రమరలోకం, మాయాలోకం (దేవీలోకం), సున్ను (ఆకారస్వరూపం), మహాసున్ను, చైతన్యలోకం, ఆపైన పరబ్రహ్మ వుంటారని తెలియజేశారు. తదుపరి, వీటినే, అనన్య (నిరాక్షర శబ్దరహిత), అనామి, మరియు నిర్మల పరబ్రహ్మ అనే స్థాయిలుగా విభజించి చెప్పారు. అనామి స్థాయి వరకు ధ్యానములో వెళ్ళగలమని, తదుపరి స్థాయిలను దేహాంతమున గాని చేరుకోలేమని తెలియజేసినారు. ఈ విషయములను అందించినటువంటి శ్రీమతి నున్న లీలగారికి మాయొక్క కృతజ్ఞతలను తెలియజేయుచున్నాము.
తదుపరి, దీనికి ఎక్కడైనా ఆధారము దొరకునా అని ప్రయత్నించగా, యోగశిఖోపనిషత్, షష్ఠోధ్యాయము, 11వ విభాగములో ఈ విధముగా నున్నది. "నిరంజనే విలీయే తే మరున్మనసి పద్మజ, యోవై నాదస్సవై బిన్దుస్తద్వై చిత్తం ప్రకీర్తితమ్, నాదోబిన్దుశ్చ చిత్తంచ, త్రిభిరైక్యం ప్రసాధయేత్, మనఏవహి బిన్దుశ్చ ఉత్పత్తిస్థితి కారణమ్, మనసోత్పద్యతే బిన్దుర్యథా క్షీరం ఘృతాత్మకమ్, షట్చక్రాణి పరిజ్ఞాత్వా ప్రవిశేత్సుఖ మణ్డలమ్, ప్రవిశేద్వాయుమాకృష్య తథైవోర్థ్వం నియోజయేత్, వాయుం బిన్దుం తథా చక్రం చిత్తంచైవ సమభ్యసేత్, సమాధిమేకేన సమమమృతం యాంతి యోగినః." అనగా, "వాయువు నిరంజనమైన, మనస్సునందు లీనమగును. నాదమేదో అదే బిందువు, అదే చిత్తము, నాదబిందు చిత్తములకైక్యము సాధించవలెను. మనస్సు, బిందువును, ఉత్పత్తికి, స్థితికిని కారణములు. మనస్సుచే బిందువు పాలచే నెయ్యివలె పుట్టుచున్నది. షట్చక్రములనెరిగిన తర్వాత, సుఖమండలము ప్రవేశించవలెను. వాయువునాకర్షించి ప్రవేశింపవలెను. అట్లే పైకిన్ని నియోగించవలెను. వాయువును, బిందువును, చక్రమును, చిత్తమును అభ్యసించవలెను. సమాధిని, సమముగా అమృతమును యోగులు పొందుదురు." విషయము తేటతెల్లముగా నున్నందున వివరణ అవుసరములేదు. ఇందులో షట్చక్రముల నెరిగిన తర్వాత సుఖమండలము ప్రవేశింప వలయునని తెలియజేసినారు. అనగా, సహస్రారము పైన ఇంకనూ స్థాయిలు కలవని తెలియుచున్నది. ఇంకనూ ఏమైనా కలదా అని ప్రయత్నించినాము.
మండలబ్రాహ్మణోపనిషత్ లో బహిర్లక్ష్యము' కలదని సూచించినారు. బహిర్లక్ష్యమనగా, తనను దాటి పైనున్న దానిని చూచుట, లేదా, తెలుసుకొనుట. "బహిర్లక్ష్యస్తు నాసాగ్రే చతుష్షడష్ట దశ ద్వాదశాంగుళిభిః క్రమాత్ నీలద్యుతి శ్యామత్వ సద్రుగ్రక్త భఙ్గీస్ఫురచ్ఛుక్ల పీతవర్ణ ద్వయోపేతం,వ్యోమతత్త్వం పశ్యతి, సతు యోగీ, చల దృష్ట్యా వ్యోమభాగ వీక్షితు పురుషస్యదృష్టగ్రే ద్వాదశాంగులమానః జ్యొతిః పశ్యతి. తదామృతతత్త్వమేతి." "బహిర్లక్ష్యమనగా నాసికా గ్రమందు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండంగుళముల చేత క్రమముగా నీలవర్ణ ప్రకాశము గాను, శ్యామలవర్ణసమానమైన రక్తవర్ణముతో కూడినదిగాను, తెలుపును, పీత(బంగారు)వర్ణమును కలిసినట్లుండు, వ్యోమతత్త్వమును జూచుచున్నాడు. వాడే యోగి. చలదృష్టి చేత వ్యోమభాగమును జూచెడి యోగి దృష్టియొక్క అగ్రభాగమునందు జ్యోతికిరణములు కనబడును. ఇందువలన దృష్టి స్థిరమగుచున్నది. శిరోగ్రభాగమునందు పన్నెండంగుళములకు మీద, జ్యోతిస్సమూహదర్శనము కలిగి, అమృతతత్త్వము కలుగుచున్నది." ఇందులో అత్యంత రహస్యమైన, సునిశితమైన, క్లిష్టమైన యోగ విధానాన్ని సూచించినారు. బహిర్లక్ష్యము, నాసికాగ్రము నుండి, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండంగుళముల పైన క్రమముగా కలదని, తెలియజేస్తూ, దానిని చలదృష్టి చే వీక్షించాలని తెలియజేసినారు. ఇచట అంగుళములకొలతలు స్థాయిబేధములు . వీటిని చలదృష్టి చే అనగా, దృష్టి కేంద్రీకరణ స్థానమును, ఆజ్ఞాచక్రమునుండి క్రమముగా పైపైకి తీసికొనిపోవుచూ, అధిగమించవలెను. ఇది ఇక్కడి రహస్యము. ఇక్కడనుండి అంతా ఊర్థ్వదృష్టి తప్ప, అథో లేక సమానదృష్టి పనికిరాదు. అది పతనము కావించును. ఇక్కడ ఇంకొక గమనించ తగ్గ విషయము కలదు. ఈసాధనలో అనేక వర్ణములు గోచరించునని తెలియజేసినారు. కాని, అవిఅన్నీ దృశ్యమానమవవు. సాధకునియొక్క యోగ్యత, పరిపక్వతననుసరించి, ఆయాస్థాయీలలో, ఆయా వర్ణములు దృశ్యమానమవగలవు. మరియు, ఏయిద్దరి సాధనలు ఒక్కరీతిగా వుండనందున, వారి అనుభవములు కూడా ఎవరికి వారికి ప్రత్యేకముగా వుండునే తప్ప, ఒక్క రీతిగా నుండవు. కావున, ఊర్థ్వ మరియు క్రమమైన చలదృష్టిద్వారా, నాసికాగ్రము నుండి, అయా స్థాయిలనుక్రమించుచూ, సహస్రారము దాటి, వ్యోమభాగము పైన, జ్యోతిసమూహ దర్శనము కలిగి అమృతత్త్వము కలుగునని తెలియజేసినారు. యోగశిఖోపనిషత్తులో కూడా, ఇలాగే షట్చక్రముల నెరిగినతర్వాత, సుఖమండలము ప్రవేశించినచో, సమాధిని, సమానముగా అమృతమును యోగులు పొందెదరని తెలియజేసినారు. ఈ రెండింటికినీ, తేడా యేమియూ లేదుకదా? దీనినే, మా సద్గురువులు, ఇంకొద్దిగా విశదీకరించి, స్థాయిలను విడదీసి, వాటినిపొందు విధానమును తెలియజేసినారు. ఇది సద్గురువులయొక్క మహత్తు. కాబట్టి ఇంకొక సారి ఋజువైన దేమిటంటే, ఉపనిషద్వాక్యములు, అనగా వేదములు, సద్గురు యుపదేశములు, పెద్దల అనుభవములు, "తత్తు సమన్వయాత్" అనే బ్రహ్మసూత్రముననుసరించి, పరబ్రహ్మ విషయములో సమన్వయము చెందుతాయి.
తదుపరి, దీనికి ఎక్కడైనా ఆధారము దొరకునా అని ప్రయత్నించగా, యోగశిఖోపనిషత్, షష్ఠోధ్యాయము, 11వ విభాగములో ఈ విధముగా నున్నది. "నిరంజనే విలీయే తే మరున్మనసి పద్మజ, యోవై నాదస్సవై బిన్దుస్తద్వై చిత్తం ప్రకీర్తితమ్, నాదోబిన్దుశ్చ చిత్తంచ, త్రిభిరైక్యం ప్రసాధయేత్, మనఏవహి బిన్దుశ్చ ఉత్పత్తిస్థితి కారణమ్, మనసోత్పద్యతే బిన్దుర్యథా క్షీరం ఘృతాత్మకమ్, షట్చక్రాణి పరిజ్ఞాత్వా ప్రవిశేత్సుఖ మణ్డలమ్, ప్రవిశేద్వాయుమాకృష్య తథైవోర్థ్వం నియోజయేత్, వాయుం బిన్దుం తథా చక్రం చిత్తంచైవ సమభ్యసేత్, సమాధిమేకేన సమమమృతం యాంతి యోగినః." అనగా, "వాయువు నిరంజనమైన, మనస్సునందు లీనమగును. నాదమేదో అదే బిందువు, అదే చిత్తము, నాదబిందు చిత్తములకైక్యము సాధించవలెను. మనస్సు, బిందువును, ఉత్పత్తికి, స్థితికిని కారణములు. మనస్సుచే బిందువు పాలచే నెయ్యివలె పుట్టుచున్నది. షట్చక్రములనెరిగిన తర్వాత, సుఖమండలము ప్రవేశించవలెను. వాయువునాకర్షించి ప్రవేశింపవలెను. అట్లే పైకిన్ని నియోగించవలెను. వాయువును, బిందువును, చక్రమును, చిత్తమును అభ్యసించవలెను. సమాధిని, సమముగా అమృతమును యోగులు పొందుదురు." విషయము తేటతెల్లముగా నున్నందున వివరణ అవుసరములేదు. ఇందులో షట్చక్రముల నెరిగిన తర్వాత సుఖమండలము ప్రవేశింప వలయునని తెలియజేసినారు. అనగా, సహస్రారము పైన ఇంకనూ స్థాయిలు కలవని తెలియుచున్నది. ఇంకనూ ఏమైనా కలదా అని ప్రయత్నించినాము.
మండలబ్రాహ్మణోపనిషత్ లో బహిర్లక్ష్యము' కలదని సూచించినారు. బహిర్లక్ష్యమనగా, తనను దాటి పైనున్న దానిని చూచుట, లేదా, తెలుసుకొనుట. "బహిర్లక్ష్యస్తు నాసాగ్రే చతుష్షడష్ట దశ ద్వాదశాంగుళిభిః క్రమాత్ నీలద్యుతి శ్యామత్వ సద్రుగ్రక్త భఙ్గీస్ఫురచ్ఛుక్ల పీతవర్ణ ద్వయోపేతం,వ్యోమతత్త్వం పశ్యతి, సతు యోగీ, చల దృష్ట్యా వ్యోమభాగ వీక్షితు పురుషస్యదృష్టగ్రే ద్వాదశాంగులమానః జ్యొతిః పశ్యతి. తదామృతతత్త్వమేతి." "బహిర్లక్ష్యమనగా నాసికా గ్రమందు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండంగుళముల చేత క్రమముగా నీలవర్ణ ప్రకాశము గాను, శ్యామలవర్ణసమానమైన రక్తవర్ణముతో కూడినదిగాను, తెలుపును, పీత(బంగారు)వర్ణమును కలిసినట్లుండు, వ్యోమతత్త్వమును జూచుచున్నాడు. వాడే యోగి. చలదృష్టి చేత వ్యోమభాగమును జూచెడి యోగి దృష్టియొక్క అగ్రభాగమునందు జ్యోతికిరణములు కనబడును. ఇందువలన దృష్టి స్థిరమగుచున్నది. శిరోగ్రభాగమునందు పన్నెండంగుళములకు మీద, జ్యోతిస్సమూహదర్శనము కలిగి, అమృతతత్త్వము కలుగుచున్నది." ఇందులో అత్యంత రహస్యమైన, సునిశితమైన, క్లిష్టమైన యోగ విధానాన్ని సూచించినారు. బహిర్లక్ష్యము, నాసికాగ్రము నుండి, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండంగుళముల పైన క్రమముగా కలదని, తెలియజేస్తూ, దానిని చలదృష్టి చే వీక్షించాలని తెలియజేసినారు. ఇచట అంగుళములకొలతలు స్థాయిబేధములు . వీటిని చలదృష్టి చే అనగా, దృష్టి కేంద్రీకరణ స్థానమును, ఆజ్ఞాచక్రమునుండి క్రమముగా పైపైకి తీసికొనిపోవుచూ, అధిగమించవలెను. ఇది ఇక్కడి రహస్యము. ఇక్కడనుండి అంతా ఊర్థ్వదృష్టి తప్ప, అథో లేక సమానదృష్టి పనికిరాదు. అది పతనము కావించును. ఇక్కడ ఇంకొక గమనించ తగ్గ విషయము కలదు. ఈసాధనలో అనేక వర్ణములు గోచరించునని తెలియజేసినారు. కాని, అవిఅన్నీ దృశ్యమానమవవు. సాధకునియొక్క యోగ్యత, పరిపక్వతననుసరించి, ఆయాస్థాయీలలో, ఆయా వర్ణములు దృశ్యమానమవగలవు. మరియు, ఏయిద్దరి సాధనలు ఒక్కరీతిగా వుండనందున, వారి అనుభవములు కూడా ఎవరికి వారికి ప్రత్యేకముగా వుండునే తప్ప, ఒక్క రీతిగా నుండవు. కావున, ఊర్థ్వ మరియు క్రమమైన చలదృష్టిద్వారా, నాసికాగ్రము నుండి, అయా స్థాయిలనుక్రమించుచూ, సహస్రారము దాటి, వ్యోమభాగము పైన, జ్యోతిసమూహ దర్శనము కలిగి అమృతత్త్వము కలుగునని తెలియజేసినారు. యోగశిఖోపనిషత్తులో కూడా, ఇలాగే షట్చక్రముల నెరిగినతర్వాత, సుఖమండలము ప్రవేశించినచో, సమాధిని, సమానముగా అమృతమును యోగులు పొందెదరని తెలియజేసినారు. ఈ రెండింటికినీ, తేడా యేమియూ లేదుకదా? దీనినే, మా సద్గురువులు, ఇంకొద్దిగా విశదీకరించి, స్థాయిలను విడదీసి, వాటినిపొందు విధానమును తెలియజేసినారు. ఇది సద్గురువులయొక్క మహత్తు. కాబట్టి ఇంకొక సారి ఋజువైన దేమిటంటే, ఉపనిషద్వాక్యములు, అనగా వేదములు, సద్గురు యుపదేశములు, పెద్దల అనుభవములు, "తత్తు సమన్వయాత్" అనే బ్రహ్మసూత్రముననుసరించి, పరబ్రహ్మ విషయములో సమన్వయము చెందుతాయి.