నాదము
మనం గతములో ఒకచోట 'ఓం'కారము లోని అర్థమాత్ర (నాదము) గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాము . దీనిని స్థూలంగా 'ఓం' అని అంటారు. 'ఓం' అంటే, అకార, ఉకార, మకార, అర్థమాత్రల సమ్మేళనము. ఇందులో నాదము ఎక్కడ వుంది? అనే ప్రశ్న వెంటనే వస్తుంది. నాదము ఓంకారాన్నిఅనుష్ఠించడంలోను, అనుసంధానించడంలోను సాధింపబడుతోంది. శ్రీవేటూరి వారు 'ఓంకార నాదానుసంధానమౌ' అని ప్రయోగించారు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. మనం ఓం అని ఒక్కసారి ఉచ్ఛరించి వదిలివేయరాదు. దానిని మన ఊపిరి, శక్తి ఉన్నంతవరకూ సాగదీసి, తదు పరి దాన్ని మన మనస్సుతో పొడిగించాలి. అలా చేయగాచేయగా, ఒకానొక పరిస్థితిలో, ఓంకారము లోని అ, ఉ, మ లనే అక్షరాలు లయించిపోయి, అక్షరంలేని శబ్దంమాత్రమే మిగులుతుంది. దీన్నే నాదము, నాదబిందువు అని అంటారు. ఈ భావంతోనే, శ్రీశంకరాచార్యులవారు అమ్మవారిని 'సౌందర్య లహరి'లో 'నాదబిందు కళాధరి' అని కీర్తించారు. ఈ నాదబిందు సాధనకు ఓంకారమొక్కటే సులభమార్గం. దీనిని పరిచయం చెయ్యడం కోసమే ఒకసారి 'మాండలిన్' పై 'నమక చమకములు' పలికించడం జరిగింది. ఈ నాదబిందువు గురించి, పెద్దలు, సనాతనులు ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రసంగవశాత్తు 'ఓం' అని వచ్చినా దానిని నాదబిందువుగానే పరిగణించ వలసినదిగా ప్రార్ధన. నాద బిందువు యొక్క భౌతిక రూపమే 'ఓం'. [ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చును. ఆత్మసాక్షాత్కారం దాకా వచ్చినతర్వాత, నాదము గురించి ఎందుకు? అని. యోగమార్గములో, పరబ్రహ్మను చేరుటకు నాదబిందువు చాలా దగ్గర దారి. (shortcut) చాలామంది నియమిత పధ్ధతి ప్రకారం ముందుకు సాగవలసి వస్తుంది. కాని, జన్మతః జ్ఞానపరంగా, యోగపరంగా ఒకింత పరిణితి, పరిపక్వత సాధించిన వారికి, ఇటువంటి పద్ధతులు సనాతనులు సూచించారు. అటువంటి వారికిది చాలా సులభము. తెలుసుకొని, జాగ్రత్తగా అనుసరించే వారికి కూడ ఇది సులభమార్గమే అవుతుంది. మొట్టమొదటే నాదబిందువు గురించి చెపితే కొంత గందర గోళం ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడ వుంది. అందువలన ఇంతవరకూ వచ్చిన తర్వాత ఇక్కడ చెపితే, కొంతమేరకు అర్థమవుతుందనే భావనతో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. పాఠకులు గమనింప ప్రార్థన.)
అధర్వశిరోపనిషత్ 5వ ఖండంలో ఓంకారమునకు ఈ దిగువ తెల్పిన 9 నిర్వచనములు నీయబడినవి.
1. అథఃకస్మాదుచ్యతే ఓంకారః? యస్మాదుచ్ఛార్యమాణయేవ స్సర్వం శరీరమ్ మూర్థ్వమున్నయతి, తస్మాదుచ్యతే ఓంకారః| ఓం అని పలుకుటకు ప్రయత్నించినవెంటనే దేహమంతయు, అనగా కుండలిని ముఖద్వారము మొదలుకొని, ఏకాదశద్వారములుకల దేహమునంతయూ ప్రాణవాయువు ఊర్ఠ్వ భాగము నకు లేవదీయును. కావున ఓంకారమనబడుచున్నది.
2. అథఃకస్మాదుచ్యతే ప్రణవః? యస్మాదుచ్ఛార్యమాణయేవ ఋచో, యజూగ్ మ్ షి, సామధర్వాంగి రసశ్ఛ యజ్ఞే బ్రహ్మణేభ్యః ప్రణామయతి| తస్మాదుచ్యతే ప్రణవః| ఎందువలన ఉచ్ఛరింపబడుచుండగనే, ఋక్కులను, యజస్సులను, సమములను, అథర్వవేద మంత్రములను, షడంగములు మున్నగు వాటిని, జపయజ్ఞము నందు బ్రహ్మవర్చస్సును, తన్నుచ్చరించువారిచే పొందింప జేయుచున్నందున, ప్రణవమని చెప్పబడుచున్నది.
3. అథఃకస్మాదుచ్యతే సర్వవ్యాపీ? యస్మాదుచ్ఛార్యమాణయేవ సర్వాన్ లోకాన్ వ్యాప్నోతి, సేహో యథా పలలపిండం, శాంతమూలమోతప్రోత మను ప్రాప్య సర్వం వ్యతిశిష్టస్త స్యైవాను విద్ధం వ్యతిశిష్ట స్తస్మాదుచ్యతే సర్వవ్యాపీ| ఉచ్ఛరింపబడుచుండగనే కర్మఫలభూతములగు భూమ్యాకాశాది సకల లోకములను, నువ్వులపిండి ముద్దలో చమురు ఎట్లు వ్యాపించియున్నదో అట్లు శాంతమూలమగు ఓతప్రోతమగు జగత్తును అనుసరించి పొంది మిగిలియున్నదో, అందువలన సర్వవ్యాపీ అని చెప్ప బడును. (బట్టలు నేయునపుడు ఉపయోగించే నిలువు అడ్డ దారములను సంస్కృతములో ఓతప్రోతము లంటారు. తెలుగులో పడుగు, పేకలంటారు. వస్త్రములో నిలువు, అడ్డదారములెటుల వ్యాపించి ఉన్నవో, ఓంకారము కూడ ఈజగత్తులో అలా వ్యాపిస్తుంది.)
4. అథఃకస్మాదుచ్యతే అనంతః? యస్మాదుచ్ఛార్యమాణయేవ ఆద్యంత నోపలభ్యతే, తిర్యగూర్థ్వ మాధస్తాత్తస్మా దుచ్యతే అనంతః| ఉచ్ఛరింపబడుచుండగనే ఆదియు అంతము కనబడుటలేదో, అష్టదిశలందును, అధోభాగము నందును ఆద్యంతములు కనబడుటలేదో, అందువలన అనంతమని చెప్పబడుచున్నది.
5. అథఃకస్మాదుచ్యతే తారమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ గర్భజన్మజరామరణ సంసార మహాభయాత్తారయతి, తస్మాదుచ్యతే తారమ్| ఉచ్ఛరింపబడిన వెంటనే గర్భవాసక్లేశము, జనన కాలికాబాధ, ముదిమి, చావు మున్నగునవికల సంసారమునుండి తరింప జేయుటవలన తారమని చెప్పబడుచున్నది.
6. అథఃకస్మాదుచ్యతే సూక్ష్మమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ సూక్ష్మోభూత్వాపరశ్శరీరాణ్యే వాధితిష్టతి , తస్మాదుచ్యతే సూక్ష్మమ్| ఉచ్ఛరింపబడుచుండగనే అతి సూక్ష్మమునై, స్థావరజంగమాత్మకములగు భూతముల యొక్క శరీరములను ఆధీనము చేసికొనుచున్నది. కావున సూక్ష్మమనబడుచున్నది.
7. అథఃకస్మాదుచ్యతే శుక్లమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ క్లందతే, క్లామయతే, తస్మాదుచ్యతే శుక్లమ్| ఉచ్ఛరింపబడుచుండగనే లోపల ధ్వని చేయగలుగుచున్నదో, నాడీగణోత్పన్నదోషములను నాశనము చేయుచున్నదో, అజ్ఞాన తత్కార్యములను నాశనము చేయుచున్నదో, అందువలన శుక్లమన బడుచున్నది.
8. అథఃకస్మాదుచ్యతే వైద్యుతమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవాతి మహతి, తమసి సర్వంశరీరమ్ విద్యోతయతి , తస్మాదుచ్యతే వైద్యుతమ్| ఉచ్ఛరింపబడుచుండగనే అత్యంత గాఢమైన అంధకారము నందు, లేదా అజ్ఞానమునందున్న సకల దేహమును ప్రకాశింపజేయుచున్నదో, అందువలన వైద్యుత మనబడుచున్నది.
9. అథఃకస్మాదుచ్యతే పరంబ్రహ్మ?యస్మాదుచ్ఛార్యమాణయేవ బృహతి, బృహయతి, తస్మాదుచ్యతే పరంబ్రహ్మ| ఉచ్ఛరింపబడుచుండగనే వృద్ధిని పొందుచున్నదో, అన్యములైన వాటిని వృద్ధి పొందింప జేయుచున్నదో, అందువలన పరబ్రహము అని చెప్పబడుచున్నది.
పై నిర్వచనములు పరిశీలించినచో, ఓంకారము ఊర్ధ్వముఖముగా ప్రయాణము చేయుటకు, అనగా యోగామార్గామునకు మార్గదర్శి. సర్వవేద, సర్వమంత్రార్థము. సర్వప్రపంచమునందు వ్యాపించి యున్నది. జన్మ, జరా, మృత్యు బాధారాహిత్యము కలుగజేయునది. సంసారమహాభయ నాశకము. అత్యంతసూక్ష్మము. సర్వభూతములను వశీకరించునది. భౌతికముగా ఉచ్ఛరించినచో, లోపల అనగా మానసికముగా స్పందన కలుగజేయునది. నాడులలో ఉత్పన్నమైన దోషములను పరిహరించునది. ప్రకాశస్వరూపము. తాను వృద్ధిపొందుతూ, సాధకుని వృద్ధిపొందించునది అని విశదమగుచున్నది. ఇన్ని గుణములు కలది మరొకటి ఈప్రపంచములో కనబడుటలేదు. ఇటివంటి ఓంకారము అదే నాద బిందువు నిరాకార పరమాత్మను చేరుటకు ఉపయోగపడుననుటలో ఎటువంటి సంశయము లేదు.
'కైవల్యోపనిషత్' 10వ శ్లోకములో, "ఆత్మానమరణింకృత్వా ప్రణవం చోత్తరారణి, జ్ఞాన నిర్మధనా భ్యాసాత్పాశం దహతి పణ్డితః| తన్ను అధారారణి గాను, ప్రణవము నుత్తరారణిగాను గావించుకొని, జ్ఞానా భ్యాసమను మథనముచే బ్రహ్మజ్ఞాని అజ్ఞానమను పాశమును దహించుచున్నాడు." అని చెప్పబడినది. అరణిఅంటే యజ్ఞములో అగ్నిని పుట్టించుటకు చెక్కతో చేసినటువంటి సాధనము. అధారారణిని నేలపై వుంచి, దాని రంధ్రములో నుత్తరారణినుంచి వేగముగా త్రిప్పినచో అగ్ని జనించును. ఈవిధముగా సాధకుడు తన్నుఅధారారణిగను, ఓంకారమును నుత్తరారణిగాను భావించి, జ్ఞానమథనము గావించి నచో అజ్ఞానపాశము దహించబడును. దీనినిబట్టి నాదబిందూపాసన అజ్ఞానాంధకారమును పోగొట్టు ననుటలో సందేహము లేదు. సాధకునికి మొదట అజ్ఞానము పూర్తిగా నశిస్తేనే గాని, ముందుకు వెళ్ళలేడు. కాబట్టి సాధకునికి ఇది చాలా ముఖ్యమైనది.
నాదబిందువు యొక్క ఉత్పత్తి స్థానములను 'అమృతనాదోపనిషత్' చక్కగా వివరించినది. "అఘోష మవ్యఞ్జన మస్వరంచ, మత్తాలు కంఠోష్ఠ మనాసికంచ యత్, అరేఫజాత ముభయోష్మ వర్జితం,యదక్షరం నక్షరతే కథంచిత్|మాత్రాలిఙ్గపదంత్యక్త్వాశబ్దవ్యంజనవర్జితం,అస్వరేణ మకారేణ పదం సూక్ష్మంహి గచ్ఛతి| ఘోషవ్యంజన స్వరతాలుకంఠోష్ఠ నాసికముల సంబంధము లేనిదియు, రేఫము నుండి పుట్టినది కనిదియు, ఉభయోష్మవర్జితమునగు ఏ అక్షరము కలదో, అది ఎన్నడునూ నశింపనిదై యున్నది. శబ్దవ్యంజన రహితమైన, అకార, ఉకార, మకారమను మూడు మాత్రల గుర్తులతో కూడిన ఓంకారపదమును విడచి, స్వరరహితమగు అర్థమాత్రతో, అనగా ప్రణవముయొక్క తురీయమగు అర్థ మాత్ర సహాయమున, కేవలపదమును, తురీయాతీతమగు పరబ్రహ్మపదమును పొందుచున్నాడు." మొదటి శ్లోకమును పరిశీలించినచో ఉపనిషద్రష్ఠ యొక్క స్వరవిజ్ఞానము అనగా శరీరమందు శబ్దోత్పన్న స్థానములయొక్క విజ్ఞానము, ఎంతకలదో, తెలియుచున్నది. అచ్చులు, హల్లులు, స్వరము కానిది, తాలువు, కంఠము, ముక్కు మున్నగు వాటినుండి పుట్టినది కానిది, రేఫము కానిది(ర్ర్ర్ ర్ కానిది), పెదవులనుండి పుట్టినది కానిది, ఏఅక్షరమైతే వున్నదో, అది నాశనములేనిది అని విశదీకరించారు. దీనినిబట్టి నాదబిందువు భాషనుండికాని, శరీరమునుండికాని ఉత్పన్నముకాదు అని, మానసికముగా మాత్రమే సాధ్యపడునని తెలుయుచున్నది. ఇక రెండవ శ్లోకములో, దీని ద్వారా తురీయాతీత మైన పరబ్రహ్మపదమును చేరుకొనవచ్చునని, రూఢిపరచుచున్నారు. ఈ ఉపనిషత్ లోనే, 32, 33వ శ్లోకములలో, ఓంకారము ఇంకనూ నిశితముగా పరిశీలింపబడినది. "పార్థివః పంచమాత్రస్తు, చతుర్మా త్రస్తు వారుణః, ఆగ్నేయస్తు త్రిమాత్రో, వాయువ్యస్తు ద్విమాత్రకః| ఏకమాత్ర స్తదాకాశో, హ్యమాత్రంతు విచిన్తయేత్, సంధిం కృత్వాత్ మనసా, చింతయే దాత్మనే నాత్మని|" "శబ్దస్పర్శరూపరసగంధములను పంచమాత్రలతో కూడినది పార్థివ ప్రణవము. శబ్దస్పర్శరూపరసములను నాలుగు మాత్రలతో కూడినది వారుణ ప్రణవము. శబ్దస్పర్శరూపములను మూడు మాత్రలతో కూడినది ఆగ్నేయ ప్రణవము. (ఇక్కడ ఆగ్నేయమంటే దిక్కు కాదు, పంచభూతములలో అగ్నిభూతము) శబ్దస్పర్శలను రెండు మాత్రలతో కూడినది వాయువ్య ప్రణవము. (ఇక్కడ కూడా దిక్కు కాదు, వాయుభూతము) శబ్దమను ఒక్కమాత్రతో కూడినది ఆకాశ ప్రణవము. మాత్రారహితమైనది ఆమాత్ర ప్రణవము. అట్టి ఆమాత్ర ప్రణవమును ఆత్మతో జేర్చి, ఆత్మయందు, ఆత్మను ధ్యానించవలెను." ఈ వివరణలో ఓంకారమునకు, పంచ మహాభూతము లకు గల సంబంధం వివరింపబడినది. ఓంకారమును, మానసికముగా నిరంతరముగా పొడిగించి భావిస్తూ ఉన్నచో, క్రమముగా ఒక్కక్క మాత్ర, ఒక్కొక్క మహాభూతము లయించి, చివరకు ఆమాత్ర ప్రణవము మిగులును. నాదబిందువంటే ఇదే. మనకు తెలుసున్నంతలో, శుద్ధగమ్భీరనిరాకార పరమాత్మస్వరూపముతో పోల్చతగినది ఏదైనా వుంటే, అది నాదబిందువొక్కటే! ఈ నాదబిందువును ఆత్మతో జేర్చి ఆత్మను ద్యానింప వలెను. ఇందులో మొదటిది మన ఆత్మ. రెండవది దీనికి మూలమైన పరమాత్మ. పరమాత్మను ధ్యానించడానికి దాని అంశమైన ఆత్మవల్లే అవుతుంది. కాబట్టి అలా చెప్పారు. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలి. మోషేకి యోహావా (బైబిల్ పరిభాషలో పరమాత్మ) కొండ గుహలో అగ్నిజ్వాల రూపములో కనిపించినపుడు, మోషే నీ గురించి ప్రజలకి ఏమని చెప్పాలి? అని అడిగినప్పుడు, ఆయన 'Tell them, 'I am that I am'" అని అంటారు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మన నాలుగు మహావాక్యాల వంటిది. ఇందులో మొదటి 'I' పరమాత్మ, రెండో 'I' ఆత్మ. ఎన్ని రకాలుగా చెప్పుకున్న, దీని అసలుఅర్థం ఇదే. కాబట్టి పరమాత్మను పట్టుకోవడానికి ఆత్మే సరియైన సాధనం. ఇటివంటి సాధనమైన ఆత్మకి, నిరాకార పరబ్రహ్మతో సరిసమానమైనటువంటి నాదబిందువును అనుసంధానించి ధ్యానం చేస్తే, తప్పక పరబ్రహ్మ యొక్క అపరోక్షానుభవము కలుగుతుంది.
బ్రహ్మవిద్యోపనిషత్ నందు ఓంకారము యొక్క భౌతిక రూపమును చక్కగా వివరించినారు. "ఓమిత్యేకాక్షరం బ్రహ్మ యదుక్తం బ్రహ్మ వాదిభిః, శరీరమ్ తస్యవక్ష్యామి, స్థానం కాలం లయా తథా| తత్ర దేవాస్త్రయః ప్రోక్తాః లోకావేదాస్త్రయోన్నయః, తిస్రో మాత్రార్థమాత్రాచ ఆక్షరాస్యశ వస్యచ|" బ్రహ్మవేత్తలగు వారు 'ఓం' అను ఏకాక్షరమునే బ్రహ్మమని చెప్పుచున్నారు. ఆ బ్రహ్మావలంబనభూతమగు ప్రణవము యొక్క స్థానకాలమాత్రాది వివరణము చెప్పబడినది. 'అ' కారమునకు, ఋగ్వేదము, గార్హపత్యాగ్ని, పృధివి, బ్రహ్మ, సూర్యకాంతి, దక్షిణనేత్రము. 'ఉ' కారమునకు, యజుర్వేదము, దక్షిణాగ్ని, అంతరిక్షము విష్ణువు, చంద్రకాంతి, వామ నేత్రము. 'మ' కారమునకు సామవేదము, అహవనీయాగ్ని, ద్యులోకము, ఈశ్వరుదు, అగ్నికాంతి, తృతీయనేత్రము, లేదా ఆజ్ఞాచక్రము. ఈత్రిమాత్రా ప్రణవముయొక్క ఊర్థ్వ మందు అర్థమాత్ర ప్రకాశింపుచున్నది. అనగా ఆజ్ఞాచక్రమునకు పైభాగమునందు, అనగా సహస్రారము నందు అర్థమాత్రాస్థానము. అనగా నాదబిందూపాసన ఆజ్ఞాచక్రమున మొదలై సహస్రారమును చేరును. ఇది ధ్యానయోగములో అత్యంత ముఖ్యమైనది. అత్యున్నత స్థానమైనటువంటి ఆసహస్రారమును చేరుటకు నాదబిందువు ఒక ముఖ్య సాధనము.
యోగశిఖోపనిషత్ ప్రణవమును లింగమని నిర్వచించినది. "సుక్ష్మాత్వా త్కారణత్వాచ్ఛలనా ద్గమనాదపి, లక్షణాత్పరమేశస్య లిమ్గామిత్యభిధేయతే| అతి సుక్ష్మమగుట చేతనూ, సర్వకారణమగుట చేతనూ, అన్నిటినీ తనయందు లీనము చేసుకొనుటచేతనూ, అన్నింటియందు చేరియుండుట చేతనూ, పరమేశ్వరుని లక్షణములు కలిగియుండుటచేతనూ, ప్రణవము లింగమని చెప్పబడుచున్నది." దీనిని బట్టి లింగస్వరూపము ప్రణవమని తెలుయుచున్నది. లింగాకారమును పరిశీలించినచో, ఒకానొక రూపమును కలిగియున్ననూ, నైరూప్యమగుటచేత, ఆరూపమిదియని ఖచ్చితముగా చెప్పలేము. సాకారస్వరూపము నుండి మనస్సును నిరాకారస్వరూపము లోనికి మార్చుటకు ఒక సాధనముగా లింగస్వరూపమేర్పడి యుండునని ఒకభావన. కావుననే ప్రణవము లింగమని భావింపబడినది. నిరాకారోపాసనకు నాద బిందువే సరియైన సాధనము.
యోగవాశిష్టము, ఉత్పత్తిప్రకరణములో శ్రీవశిష్టులవారు శ్రీరామచంద్రులవారికి ఈరకంగా బోధించారు. "ఓంకారోచ్ఛరణప్రాప్తశబ్ద తత్త్వానుభావనాత్, సుషుప్తో సంవిదోజాతే, ప్రాణస్పందోనిరుద్ధ్యతే| ఓంకారము నుచ్ఛరించుచూ, అద్దాని అర్థమును చింతనచేయుటవలన బాహ్యపదార్థజ్ఞానము సంపూర్ణముగా నుప శమింప ప్రాణస్పందనము నిరోధింపబడును." శ్రీవశిష్టులవారు దీనికి ఉదాహరణ కూడా ఇచ్చారు. "ఇతి సంచింతయన్నేవ బలిః పరమకోవిదః, ఓంకారార్థమాత్రార్థం భావయన్మౌనమాస్థితం, సంశాంత సర్వ సంకల్పః ప్రశాంతకల్పనాగణః|ఈప్రకారముగా చింతనచేయుచూ మహాజ్ఞానియైన బలిచక్రవర్తి, సమస్త సంకల్పములు లెస్సగా శమించినవాడై, కల్పనాసమూహవర్జితుడై, ఓంకారముయొక్క అర్థమాత్రార్థ మగు తురీయాత్మనుభావించుచూ (స్వాత్మస్వరూపమును అనుభవించుచూ),మౌనముగా నుండెను. దీనిని బట్టి శ్రీరామచంద్రునికే పూర్వీకుడైన శ్రీబలిచక్రవర్తి కాలము నుండియే ఈనాదబిందూపాసన కలదని ఋజువగుచున్నది.
ఇంకనూ శ్రీ వశిష్టులవారు శ్రీరామచంద్రులవారికి, నిర్వాణప్రకరణములో ఇలాసూటిగా ఆదేశిం చారు. "ఒమిత్యుదస్తభవ వాసనమేకమాస్స్వ్య నత్వం నచాహమపి నానది హస్తి సత్యం| ఓరామచంద్రా! నీవు ఓంకారముయొక్క మొదటి మూడుపాదములు (అకార, ఉకార, మకారములు) నాల్గవపాదమున (అర్థమాత్రలో) లయమొనర్చి, (అనగా నాదబిందువును సాధించి) సంసార వాసనారహితుడవై, ఏక తురియా రూపుడవై, యుండుము"
ఈ రకమైన మునిప్రోక్త, ఉపనిషత్ వాక్యోపదేశమైన మార్గము ద్వారా సాధకుడు పరబ్రహ్మము యొక్క అపరోక్షానుభూతి పొందవలయును.
ఈసారి కలుసుకున్నప్పుడు, నాదము యొక్క తదుపరి స్థాయి యైన 'తేజస్సు' గురించి తెలుసుకుం దాము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)
మనం గతములో ఒకచోట 'ఓం'కారము లోని అర్థమాత్ర (నాదము) గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాము . దీనిని స్థూలంగా 'ఓం' అని అంటారు. 'ఓం' అంటే, అకార, ఉకార, మకార, అర్థమాత్రల సమ్మేళనము. ఇందులో నాదము ఎక్కడ వుంది? అనే ప్రశ్న వెంటనే వస్తుంది. నాదము ఓంకారాన్నిఅనుష్ఠించడంలోను, అనుసంధానించడంలోను సాధింపబడుతోంది. శ్రీవేటూరి వారు 'ఓంకార నాదానుసంధానమౌ' అని ప్రయోగించారు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. మనం ఓం అని ఒక్కసారి ఉచ్ఛరించి వదిలివేయరాదు. దానిని మన ఊపిరి, శక్తి ఉన్నంతవరకూ సాగదీసి, తదు పరి దాన్ని మన మనస్సుతో పొడిగించాలి. అలా చేయగాచేయగా, ఒకానొక పరిస్థితిలో, ఓంకారము లోని అ, ఉ, మ లనే అక్షరాలు లయించిపోయి, అక్షరంలేని శబ్దంమాత్రమే మిగులుతుంది. దీన్నే నాదము, నాదబిందువు అని అంటారు. ఈ భావంతోనే, శ్రీశంకరాచార్యులవారు అమ్మవారిని 'సౌందర్య లహరి'లో 'నాదబిందు కళాధరి' అని కీర్తించారు. ఈ నాదబిందు సాధనకు ఓంకారమొక్కటే సులభమార్గం. దీనిని పరిచయం చెయ్యడం కోసమే ఒకసారి 'మాండలిన్' పై 'నమక చమకములు' పలికించడం జరిగింది. ఈ నాదబిందువు గురించి, పెద్దలు, సనాతనులు ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రసంగవశాత్తు 'ఓం' అని వచ్చినా దానిని నాదబిందువుగానే పరిగణించ వలసినదిగా ప్రార్ధన. నాద బిందువు యొక్క భౌతిక రూపమే 'ఓం'. [ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చును. ఆత్మసాక్షాత్కారం దాకా వచ్చినతర్వాత, నాదము గురించి ఎందుకు? అని. యోగమార్గములో, పరబ్రహ్మను చేరుటకు నాదబిందువు చాలా దగ్గర దారి. (shortcut) చాలామంది నియమిత పధ్ధతి ప్రకారం ముందుకు సాగవలసి వస్తుంది. కాని, జన్మతః జ్ఞానపరంగా, యోగపరంగా ఒకింత పరిణితి, పరిపక్వత సాధించిన వారికి, ఇటువంటి పద్ధతులు సనాతనులు సూచించారు. అటువంటి వారికిది చాలా సులభము. తెలుసుకొని, జాగ్రత్తగా అనుసరించే వారికి కూడ ఇది సులభమార్గమే అవుతుంది. మొట్టమొదటే నాదబిందువు గురించి చెపితే కొంత గందర గోళం ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడ వుంది. అందువలన ఇంతవరకూ వచ్చిన తర్వాత ఇక్కడ చెపితే, కొంతమేరకు అర్థమవుతుందనే భావనతో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. పాఠకులు గమనింప ప్రార్థన.)
అధర్వశిరోపనిషత్ 5వ ఖండంలో ఓంకారమునకు ఈ దిగువ తెల్పిన 9 నిర్వచనములు నీయబడినవి.
1. అథఃకస్మాదుచ్యతే ఓంకారః? యస్మాదుచ్ఛార్యమాణయేవ స్సర్వం శరీరమ్ మూర్థ్వమున్నయతి, తస్మాదుచ్యతే ఓంకారః| ఓం అని పలుకుటకు ప్రయత్నించినవెంటనే దేహమంతయు, అనగా కుండలిని ముఖద్వారము మొదలుకొని, ఏకాదశద్వారములుకల దేహమునంతయూ ప్రాణవాయువు ఊర్ఠ్వ భాగము నకు లేవదీయును. కావున ఓంకారమనబడుచున్నది.
2. అథఃకస్మాదుచ్యతే ప్రణవః? యస్మాదుచ్ఛార్యమాణయేవ ఋచో, యజూగ్ మ్ షి, సామధర్వాంగి రసశ్ఛ యజ్ఞే బ్రహ్మణేభ్యః ప్రణామయతి| తస్మాదుచ్యతే ప్రణవః| ఎందువలన ఉచ్ఛరింపబడుచుండగనే, ఋక్కులను, యజస్సులను, సమములను, అథర్వవేద మంత్రములను, షడంగములు మున్నగు వాటిని, జపయజ్ఞము నందు బ్రహ్మవర్చస్సును, తన్నుచ్చరించువారిచే పొందింప జేయుచున్నందున, ప్రణవమని చెప్పబడుచున్నది.
3. అథఃకస్మాదుచ్యతే సర్వవ్యాపీ? యస్మాదుచ్ఛార్యమాణయేవ సర్వాన్ లోకాన్ వ్యాప్నోతి, సేహో యథా పలలపిండం, శాంతమూలమోతప్రోత మను ప్రాప్య సర్వం వ్యతిశిష్టస్త స్యైవాను విద్ధం వ్యతిశిష్ట స్తస్మాదుచ్యతే సర్వవ్యాపీ| ఉచ్ఛరింపబడుచుండగనే కర్మఫలభూతములగు భూమ్యాకాశాది సకల లోకములను, నువ్వులపిండి ముద్దలో చమురు ఎట్లు వ్యాపించియున్నదో అట్లు శాంతమూలమగు ఓతప్రోతమగు జగత్తును అనుసరించి పొంది మిగిలియున్నదో, అందువలన సర్వవ్యాపీ అని చెప్ప బడును. (బట్టలు నేయునపుడు ఉపయోగించే నిలువు అడ్డ దారములను సంస్కృతములో ఓతప్రోతము లంటారు. తెలుగులో పడుగు, పేకలంటారు. వస్త్రములో నిలువు, అడ్డదారములెటుల వ్యాపించి ఉన్నవో, ఓంకారము కూడ ఈజగత్తులో అలా వ్యాపిస్తుంది.)
4. అథఃకస్మాదుచ్యతే అనంతః? యస్మాదుచ్ఛార్యమాణయేవ ఆద్యంత నోపలభ్యతే, తిర్యగూర్థ్వ మాధస్తాత్తస్మా దుచ్యతే అనంతః| ఉచ్ఛరింపబడుచుండగనే ఆదియు అంతము కనబడుటలేదో, అష్టదిశలందును, అధోభాగము నందును ఆద్యంతములు కనబడుటలేదో, అందువలన అనంతమని చెప్పబడుచున్నది.
5. అథఃకస్మాదుచ్యతే తారమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ గర్భజన్మజరామరణ సంసార మహాభయాత్తారయతి, తస్మాదుచ్యతే తారమ్| ఉచ్ఛరింపబడిన వెంటనే గర్భవాసక్లేశము, జనన కాలికాబాధ, ముదిమి, చావు మున్నగునవికల సంసారమునుండి తరింప జేయుటవలన తారమని చెప్పబడుచున్నది.
6. అథఃకస్మాదుచ్యతే సూక్ష్మమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ సూక్ష్మోభూత్వాపరశ్శరీరాణ్యే వాధితిష్టతి , తస్మాదుచ్యతే సూక్ష్మమ్| ఉచ్ఛరింపబడుచుండగనే అతి సూక్ష్మమునై, స్థావరజంగమాత్మకములగు భూతముల యొక్క శరీరములను ఆధీనము చేసికొనుచున్నది. కావున సూక్ష్మమనబడుచున్నది.
7. అథఃకస్మాదుచ్యతే శుక్లమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవ క్లందతే, క్లామయతే, తస్మాదుచ్యతే శుక్లమ్| ఉచ్ఛరింపబడుచుండగనే లోపల ధ్వని చేయగలుగుచున్నదో, నాడీగణోత్పన్నదోషములను నాశనము చేయుచున్నదో, అజ్ఞాన తత్కార్యములను నాశనము చేయుచున్నదో, అందువలన శుక్లమన బడుచున్నది.
8. అథఃకస్మాదుచ్యతే వైద్యుతమ్?యస్మాదుచ్ఛార్యమాణయేవాతి మహతి, తమసి సర్వంశరీరమ్ విద్యోతయతి , తస్మాదుచ్యతే వైద్యుతమ్| ఉచ్ఛరింపబడుచుండగనే అత్యంత గాఢమైన అంధకారము నందు, లేదా అజ్ఞానమునందున్న సకల దేహమును ప్రకాశింపజేయుచున్నదో, అందువలన వైద్యుత మనబడుచున్నది.
9. అథఃకస్మాదుచ్యతే పరంబ్రహ్మ?యస్మాదుచ్ఛార్యమాణయేవ బృహతి, బృహయతి, తస్మాదుచ్యతే పరంబ్రహ్మ| ఉచ్ఛరింపబడుచుండగనే వృద్ధిని పొందుచున్నదో, అన్యములైన వాటిని వృద్ధి పొందింప జేయుచున్నదో, అందువలన పరబ్రహము అని చెప్పబడుచున్నది.
పై నిర్వచనములు పరిశీలించినచో, ఓంకారము ఊర్ధ్వముఖముగా ప్రయాణము చేయుటకు, అనగా యోగామార్గామునకు మార్గదర్శి. సర్వవేద, సర్వమంత్రార్థము. సర్వప్రపంచమునందు వ్యాపించి యున్నది. జన్మ, జరా, మృత్యు బాధారాహిత్యము కలుగజేయునది. సంసారమహాభయ నాశకము. అత్యంతసూక్ష్మము. సర్వభూతములను వశీకరించునది. భౌతికముగా ఉచ్ఛరించినచో, లోపల అనగా మానసికముగా స్పందన కలుగజేయునది. నాడులలో ఉత్పన్నమైన దోషములను పరిహరించునది. ప్రకాశస్వరూపము. తాను వృద్ధిపొందుతూ, సాధకుని వృద్ధిపొందించునది అని విశదమగుచున్నది. ఇన్ని గుణములు కలది మరొకటి ఈప్రపంచములో కనబడుటలేదు. ఇటివంటి ఓంకారము అదే నాద బిందువు నిరాకార పరమాత్మను చేరుటకు ఉపయోగపడుననుటలో ఎటువంటి సంశయము లేదు.
'కైవల్యోపనిషత్' 10వ శ్లోకములో, "ఆత్మానమరణింకృత్వా ప్రణవం చోత్తరారణి, జ్ఞాన నిర్మధనా భ్యాసాత్పాశం దహతి పణ్డితః| తన్ను అధారారణి గాను, ప్రణవము నుత్తరారణిగాను గావించుకొని, జ్ఞానా భ్యాసమను మథనముచే బ్రహ్మజ్ఞాని అజ్ఞానమను పాశమును దహించుచున్నాడు." అని చెప్పబడినది. అరణిఅంటే యజ్ఞములో అగ్నిని పుట్టించుటకు చెక్కతో చేసినటువంటి సాధనము. అధారారణిని నేలపై వుంచి, దాని రంధ్రములో నుత్తరారణినుంచి వేగముగా త్రిప్పినచో అగ్ని జనించును. ఈవిధముగా సాధకుడు తన్నుఅధారారణిగను, ఓంకారమును నుత్తరారణిగాను భావించి, జ్ఞానమథనము గావించి నచో అజ్ఞానపాశము దహించబడును. దీనినిబట్టి నాదబిందూపాసన అజ్ఞానాంధకారమును పోగొట్టు ననుటలో సందేహము లేదు. సాధకునికి మొదట అజ్ఞానము పూర్తిగా నశిస్తేనే గాని, ముందుకు వెళ్ళలేడు. కాబట్టి సాధకునికి ఇది చాలా ముఖ్యమైనది.
నాదబిందువు యొక్క ఉత్పత్తి స్థానములను 'అమృతనాదోపనిషత్' చక్కగా వివరించినది. "అఘోష మవ్యఞ్జన మస్వరంచ, మత్తాలు కంఠోష్ఠ మనాసికంచ యత్, అరేఫజాత ముభయోష్మ వర్జితం,యదక్షరం నక్షరతే కథంచిత్|మాత్రాలిఙ్గపదంత్యక్త్వాశబ్దవ్యంజనవర్జితం,అస్వరేణ మకారేణ పదం సూక్ష్మంహి గచ్ఛతి| ఘోషవ్యంజన స్వరతాలుకంఠోష్ఠ నాసికముల సంబంధము లేనిదియు, రేఫము నుండి పుట్టినది కనిదియు, ఉభయోష్మవర్జితమునగు ఏ అక్షరము కలదో, అది ఎన్నడునూ నశింపనిదై యున్నది. శబ్దవ్యంజన రహితమైన, అకార, ఉకార, మకారమను మూడు మాత్రల గుర్తులతో కూడిన ఓంకారపదమును విడచి, స్వరరహితమగు అర్థమాత్రతో, అనగా ప్రణవముయొక్క తురీయమగు అర్థ మాత్ర సహాయమున, కేవలపదమును, తురీయాతీతమగు పరబ్రహ్మపదమును పొందుచున్నాడు." మొదటి శ్లోకమును పరిశీలించినచో ఉపనిషద్రష్ఠ యొక్క స్వరవిజ్ఞానము అనగా శరీరమందు శబ్దోత్పన్న స్థానములయొక్క విజ్ఞానము, ఎంతకలదో, తెలియుచున్నది. అచ్చులు, హల్లులు, స్వరము కానిది, తాలువు, కంఠము, ముక్కు మున్నగు వాటినుండి పుట్టినది కానిది, రేఫము కానిది(ర్ర్ర్ ర్ కానిది), పెదవులనుండి పుట్టినది కానిది, ఏఅక్షరమైతే వున్నదో, అది నాశనములేనిది అని విశదీకరించారు. దీనినిబట్టి నాదబిందువు భాషనుండికాని, శరీరమునుండికాని ఉత్పన్నముకాదు అని, మానసికముగా మాత్రమే సాధ్యపడునని తెలుయుచున్నది. ఇక రెండవ శ్లోకములో, దీని ద్వారా తురీయాతీత మైన పరబ్రహ్మపదమును చేరుకొనవచ్చునని, రూఢిపరచుచున్నారు. ఈ ఉపనిషత్ లోనే, 32, 33వ శ్లోకములలో, ఓంకారము ఇంకనూ నిశితముగా పరిశీలింపబడినది. "పార్థివః పంచమాత్రస్తు, చతుర్మా త్రస్తు వారుణః, ఆగ్నేయస్తు త్రిమాత్రో, వాయువ్యస్తు ద్విమాత్రకః| ఏకమాత్ర స్తదాకాశో, హ్యమాత్రంతు విచిన్తయేత్, సంధిం కృత్వాత్ మనసా, చింతయే దాత్మనే నాత్మని|" "శబ్దస్పర్శరూపరసగంధములను పంచమాత్రలతో కూడినది పార్థివ ప్రణవము. శబ్దస్పర్శరూపరసములను నాలుగు మాత్రలతో కూడినది వారుణ ప్రణవము. శబ్దస్పర్శరూపములను మూడు మాత్రలతో కూడినది ఆగ్నేయ ప్రణవము. (ఇక్కడ ఆగ్నేయమంటే దిక్కు కాదు, పంచభూతములలో అగ్నిభూతము) శబ్దస్పర్శలను రెండు మాత్రలతో కూడినది వాయువ్య ప్రణవము. (ఇక్కడ కూడా దిక్కు కాదు, వాయుభూతము) శబ్దమను ఒక్కమాత్రతో కూడినది ఆకాశ ప్రణవము. మాత్రారహితమైనది ఆమాత్ర ప్రణవము. అట్టి ఆమాత్ర ప్రణవమును ఆత్మతో జేర్చి, ఆత్మయందు, ఆత్మను ధ్యానించవలెను." ఈ వివరణలో ఓంకారమునకు, పంచ మహాభూతము లకు గల సంబంధం వివరింపబడినది. ఓంకారమును, మానసికముగా నిరంతరముగా పొడిగించి భావిస్తూ ఉన్నచో, క్రమముగా ఒక్కక్క మాత్ర, ఒక్కొక్క మహాభూతము లయించి, చివరకు ఆమాత్ర ప్రణవము మిగులును. నాదబిందువంటే ఇదే. మనకు తెలుసున్నంతలో, శుద్ధగమ్భీరనిరాకార పరమాత్మస్వరూపముతో పోల్చతగినది ఏదైనా వుంటే, అది నాదబిందువొక్కటే! ఈ నాదబిందువును ఆత్మతో జేర్చి ఆత్మను ద్యానింప వలెను. ఇందులో మొదటిది మన ఆత్మ. రెండవది దీనికి మూలమైన పరమాత్మ. పరమాత్మను ధ్యానించడానికి దాని అంశమైన ఆత్మవల్లే అవుతుంది. కాబట్టి అలా చెప్పారు. ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలి. మోషేకి యోహావా (బైబిల్ పరిభాషలో పరమాత్మ) కొండ గుహలో అగ్నిజ్వాల రూపములో కనిపించినపుడు, మోషే నీ గురించి ప్రజలకి ఏమని చెప్పాలి? అని అడిగినప్పుడు, ఆయన 'Tell them, 'I am that I am'" అని అంటారు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మన నాలుగు మహావాక్యాల వంటిది. ఇందులో మొదటి 'I' పరమాత్మ, రెండో 'I' ఆత్మ. ఎన్ని రకాలుగా చెప్పుకున్న, దీని అసలుఅర్థం ఇదే. కాబట్టి పరమాత్మను పట్టుకోవడానికి ఆత్మే సరియైన సాధనం. ఇటివంటి సాధనమైన ఆత్మకి, నిరాకార పరబ్రహ్మతో సరిసమానమైనటువంటి నాదబిందువును అనుసంధానించి ధ్యానం చేస్తే, తప్పక పరబ్రహ్మ యొక్క అపరోక్షానుభవము కలుగుతుంది.
బ్రహ్మవిద్యోపనిషత్ నందు ఓంకారము యొక్క భౌతిక రూపమును చక్కగా వివరించినారు. "ఓమిత్యేకాక్షరం బ్రహ్మ యదుక్తం బ్రహ్మ వాదిభిః, శరీరమ్ తస్యవక్ష్యామి, స్థానం కాలం లయా తథా| తత్ర దేవాస్త్రయః ప్రోక్తాః లోకావేదాస్త్రయోన్నయః, తిస్రో మాత్రార్థమాత్రాచ ఆక్షరాస్యశ వస్యచ|" బ్రహ్మవేత్తలగు వారు 'ఓం' అను ఏకాక్షరమునే బ్రహ్మమని చెప్పుచున్నారు. ఆ బ్రహ్మావలంబనభూతమగు ప్రణవము యొక్క స్థానకాలమాత్రాది వివరణము చెప్పబడినది. 'అ' కారమునకు, ఋగ్వేదము, గార్హపత్యాగ్ని, పృధివి, బ్రహ్మ, సూర్యకాంతి, దక్షిణనేత్రము. 'ఉ' కారమునకు, యజుర్వేదము, దక్షిణాగ్ని, అంతరిక్షము విష్ణువు, చంద్రకాంతి, వామ నేత్రము. 'మ' కారమునకు సామవేదము, అహవనీయాగ్ని, ద్యులోకము, ఈశ్వరుదు, అగ్నికాంతి, తృతీయనేత్రము, లేదా ఆజ్ఞాచక్రము. ఈత్రిమాత్రా ప్రణవముయొక్క ఊర్థ్వ మందు అర్థమాత్ర ప్రకాశింపుచున్నది. అనగా ఆజ్ఞాచక్రమునకు పైభాగమునందు, అనగా సహస్రారము నందు అర్థమాత్రాస్థానము. అనగా నాదబిందూపాసన ఆజ్ఞాచక్రమున మొదలై సహస్రారమును చేరును. ఇది ధ్యానయోగములో అత్యంత ముఖ్యమైనది. అత్యున్నత స్థానమైనటువంటి ఆసహస్రారమును చేరుటకు నాదబిందువు ఒక ముఖ్య సాధనము.
యోగశిఖోపనిషత్ ప్రణవమును లింగమని నిర్వచించినది. "సుక్ష్మాత్వా త్కారణత్వాచ్ఛలనా ద్గమనాదపి, లక్షణాత్పరమేశస్య లిమ్గామిత్యభిధేయతే| అతి సుక్ష్మమగుట చేతనూ, సర్వకారణమగుట చేతనూ, అన్నిటినీ తనయందు లీనము చేసుకొనుటచేతనూ, అన్నింటియందు చేరియుండుట చేతనూ, పరమేశ్వరుని లక్షణములు కలిగియుండుటచేతనూ, ప్రణవము లింగమని చెప్పబడుచున్నది." దీనిని బట్టి లింగస్వరూపము ప్రణవమని తెలుయుచున్నది. లింగాకారమును పరిశీలించినచో, ఒకానొక రూపమును కలిగియున్ననూ, నైరూప్యమగుటచేత, ఆరూపమిదియని ఖచ్చితముగా చెప్పలేము. సాకారస్వరూపము నుండి మనస్సును నిరాకారస్వరూపము లోనికి మార్చుటకు ఒక సాధనముగా లింగస్వరూపమేర్పడి యుండునని ఒకభావన. కావుననే ప్రణవము లింగమని భావింపబడినది. నిరాకారోపాసనకు నాద బిందువే సరియైన సాధనము.
యోగవాశిష్టము, ఉత్పత్తిప్రకరణములో శ్రీవశిష్టులవారు శ్రీరామచంద్రులవారికి ఈరకంగా బోధించారు. "ఓంకారోచ్ఛరణప్రాప్తశబ్ద తత్త్వానుభావనాత్, సుషుప్తో సంవిదోజాతే, ప్రాణస్పందోనిరుద్ధ్యతే| ఓంకారము నుచ్ఛరించుచూ, అద్దాని అర్థమును చింతనచేయుటవలన బాహ్యపదార్థజ్ఞానము సంపూర్ణముగా నుప శమింప ప్రాణస్పందనము నిరోధింపబడును." శ్రీవశిష్టులవారు దీనికి ఉదాహరణ కూడా ఇచ్చారు. "ఇతి సంచింతయన్నేవ బలిః పరమకోవిదః, ఓంకారార్థమాత్రార్థం భావయన్మౌనమాస్థితం, సంశాంత సర్వ సంకల్పః ప్రశాంతకల్పనాగణః|ఈప్రకారముగా చింతనచేయుచూ మహాజ్ఞానియైన బలిచక్రవర్తి, సమస్త సంకల్పములు లెస్సగా శమించినవాడై, కల్పనాసమూహవర్జితుడై, ఓంకారముయొక్క అర్థమాత్రార్థ మగు తురీయాత్మనుభావించుచూ (స్వాత్మస్వరూపమును అనుభవించుచూ),మౌనముగా నుండెను. దీనిని బట్టి శ్రీరామచంద్రునికే పూర్వీకుడైన శ్రీబలిచక్రవర్తి కాలము నుండియే ఈనాదబిందూపాసన కలదని ఋజువగుచున్నది.
ఇంకనూ శ్రీ వశిష్టులవారు శ్రీరామచంద్రులవారికి, నిర్వాణప్రకరణములో ఇలాసూటిగా ఆదేశిం చారు. "ఒమిత్యుదస్తభవ వాసనమేకమాస్స్వ్య నత్వం నచాహమపి నానది హస్తి సత్యం| ఓరామచంద్రా! నీవు ఓంకారముయొక్క మొదటి మూడుపాదములు (అకార, ఉకార, మకారములు) నాల్గవపాదమున (అర్థమాత్రలో) లయమొనర్చి, (అనగా నాదబిందువును సాధించి) సంసార వాసనారహితుడవై, ఏక తురియా రూపుడవై, యుండుము"
ఈ రకమైన మునిప్రోక్త, ఉపనిషత్ వాక్యోపదేశమైన మార్గము ద్వారా సాధకుడు పరబ్రహ్మము యొక్క అపరోక్షానుభూతి పొందవలయును.
ఈసారి కలుసుకున్నప్పుడు, నాదము యొక్క తదుపరి స్థాయి యైన 'తేజస్సు' గురించి తెలుసుకుం దాము.
(మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వుంటాము)