శ్రీగురుతత్త్వము
ది.9-10-2013న శ్రీనేరేళ్ళ పురుషోత్తమశర్మగారు మాస్వగృహమునకు విచ్చేసినారు. అప్పుడు జరిగిన సంభాషణలో వారు ఒకానొక గ్రంధములో చదివిన ఒకానొక గురుస్తోత్రమును చెప్పినారు. ఆ గురుస్తోత్రములో 31గురులక్షణములు 31గురు నామము లుగా విలసిల్లినవి. ఆ గురుస్తోత్రమును వినినవెంటనే నాకు ఎందులకో ఒక విధమైన ఉద్వేగముకలిగినది. సదరు నామములయొక్క సామాన్యభావార్థముతోపాటు తత్త్వార్థములను కూడా తెలియజేస్తే శ్రీగురుతత్త్వము బాగుగా బొధపడునని అనిపించి నది. దీనిని శ్రీపురుషోత్తమశర్మగారికి చెప్పగా, వారు చాలా ఆనందపడి, వెంటనే ఆపని ప్రారంభించమన్నారు. ఆ స్తోత్రము ఈ విధముగా వున్నది.
“సద్గురుం, పరబ్రహ్మాత్మకం, సనాతనసనాతనం, పురాణం, పరిపూర్ణం, పరమానన్దం, పురుషోత్తమం, అవ్యక్తంవ్యక్తం, మహాతత్త్వం, అహంకారం, పంచభూతా త్మకం, శేషసంజ్ఞాత్మకం, సచ్చిదానంద నిత్య నిర్మలం, సృష్టిస్థితిలయ తిరోధానాను గ్రహమహాకారణం, తత్త్వం, చిన్మాత్ర విస్తారితం, బ్రహ్మం, సర్వజ్ఞసర్వవిలోకనం, మహత్త్వం, ధైర్యయశోప్రజ్ఞాన వైరాగ్యసత్తాస్ఫూర్తి స్వరూపసర్వాత్మకం, శబ్దబ్రహ్మ విద్యాత్మికం, పంచబ్రహ్మ విద్యాత్మికం, తురీయం, నిరామయం, అఖండాత్మతేజోశివం, తురీయాతీతం, హృదయకుహరమధ్యే కేవలంబ్రహ్మమాత్రం, అహమహ మితి, సాక్షి, సాక్షాతాత్మరూపేణభాతి, త్వమేవాహం”
మొదట ఈగురునామములను పరిశీలించినచో, వాటిలో వర్ణింపబడినవన్నీ ఆపరబ్రహ్మ లక్షణములే! వాటినే సద్గురువునకు ఆపాదిస్తున్నారు. ఎందులకు? "బ్రహ్మ విద్ బ్రహ్మైవభవతి". పరబ్రహ్మమును తెలుసుకున్నవాడు పరబ్రహ్మమే అవుతాడు. సద్గురువు, పరబ్రహ్మ ఒకే నాణెముయొక్క రెండు పార్శ్వములు. ఇంకా ముందుకు చూస్తే, సద్గురువు పరబ్రహ్మముకంటే ఎక్కువే అవుతాడు. పరబ్రహ్మము తాను చేయించ వలసినదంతా చక్కగా చేయించి, తాను మాత్రము ఏమీ తెలియనట్లు, దేనికీ అంటకుండా వుంటుంది. కాని సద్గురువు అలాకాదు. తాను కష్టపడి, ఆపరబ్రహ్మముగురించి ఆలోచించి, తెలుసుకొని, దానిని అనుభవించి, తానే అది అయ్యికూడా, తాను దానిలో లయమవ్వకుండా, తనను ఆశ్రయించిన శిష్యులకు సందేహ నివృత్తిచేసి, పరబ్రహ్మ జ్ఞానమునుపదేశించి, దానిని తాను ఎలా అనుభవించాడో, అదేవిధంగా శిష్యులకు కూడా అనుభవంలోకి వచ్చేటట్లుచేస్తాడు. ఇప్పుడు చెప్పండి! గురువు పరబ్రహ్మము కంటే ఎక్కువ అవునా, కాదా? కాబట్టి ఏవైతే పరబ్రహ్మకు వున్నాయో, అవన్నీ సద్గురువుకు చెందుతాయి. ఇందులో సందేహమేమీలేదు.
తదుపరి ఈనామములకు వివరణకోసం, మాకు లభించిన గ్రంధములు, 1.బ్రహ్మవిద్యారత్నాకరము(రెండు సంపుటాలు), 2.శ్రీమద్భగవద్గీత, 3. అష్టావక్రగీత, 4.శ్రీనోరి శ్రీనాధవెంకట సోమయాజులవారి బ్రహ్మసూత్రదర్శనం, 5.ఉపనిషత్తులు, 6.వివేకచూడామణి. అనన్యులైన ఈగ్రంధకర్తలకు మాశరణాగతిని ఇందుమూలముగా తెలియజేసుకొనుచున్నాము. ఇక్కడ ఇంకొక విషయముకూడా చెప్పవలసియున్నది. ప్రతిదానికి చాలాచోట్ల చాలావిధాలుగా వివరణలు వున్నాయి. వాటినన్నింటినీ ఇవ్వా లంటే, ఆగ్రంధాలనే తిరిగివ్రాయవలసి వుంటుంది. అందువల్ల కొన్నింటినే ఎంపిక (selective) గా ఇవ్వడం జరిగింది. ఉత్సాహవంతులైన పాఠకులు పైగ్రంధములను పరిశీలించి, ఇంకా జ్ఞానమును బడయగలరని ఆశిస్తున్నాము.
సద్గురువు గురించి లభించినంతమేరకు అందరికీ తెలియజేయాలని, శ్రీగురుతత్త్వమును అందించాలని మాచిన్నికోరిక. ఈఅత్యుత్సాహములో ఏవైన పొరపాట్లు దొర్లితే మన్నించ ప్రార్థన. దీనిపై పాఠకుల సూచనలను, సలహాలను ఆహ్వానించుచున్నాము.
ఇట్లు, తత్త్వవిశ్లేషణ బృందం.
1.సద్గురుమ్
వివేకచూడామణి:34,35: "శ్రోతోయో~వృజనో~కామహతో యోబ్రహ్మవిత్తమ, బ్రహ్మణ్యు పరతశ్శాంతోనిరింధినఇవానలః" - వేదసారమెరిగి, తదాచరణదక్షుడును, సకలపాప వినిర్ముక్తు డును, నిష్కళంకుడును, కామమునకు లోబడనివాడును, ఉత్తమ బ్రహ్మవేత్తయును, సర్వదా పరబ్రహ్మమునందు రమించుచూ, తత్సుఖమును బడసినవాడును, కట్టెలులేని అగ్నివలె సమస్తవృత్తులు శమించుటచే శాంతమూర్తియై ప్రకాశించువాడును, తనకు నమస్క రించుచుండెడి సత్పురుషులకు బంధువును, ఎటువంటి ప్రయోజనముపేక్షింపకయే దయా సముద్రుడును, అనగా నిర్హేతుకజాయమాన కరుణాసముద్రుడును అయినవాడు, సద్గురువు.
అష్టావక్రగీత: "కృత్వామూర్తి పరిజ్ఞానంచైతన్యస్యకిం గురు:, నిర్వేదసమతాయుక్త్వా యస్తార యతి సంసృతే" - వైరాగ్యము, సమత్వమనెడి యుక్తులచేత ఎవడు చైతన్యము యొక్క విశేష జ్ఞానమును చేసి(పొంది), ఎవడు సంసారమునుండి తరింపజేసి కొనుచున్నాడో, అట్టివాడు గురువు కాడాఏమి?
ఇక్కడ సద్గురువుయొక్క కొన్నిలక్షణములను మాత్రమే ఇవ్వడమైనది. మున్ముందు నామములలో ఇంకా చాలాలక్షణములు, వివరణలు వస్తాయి. ఇంకా కావాలనుకునే వారు, 'శ్రీగురుగీత', www.tatvavisleshana.weebly.com లో 'శ్రీగురుసూక్తము' పరిశీలించ మనవి.
2.పరబ్రహ్మాత్మికం, బ్రహ్మం
అద్వయతారకోపనిషత్:9: "ఆచార్యోవేదసమ్పన్నో విష్ణుభక్తో విమత్సరః, యోగజ్ఞో యోగ నిష్ఠశ్చ సదాయోగా~త్మకశుచిహి:, గురుభక్తిసమాయుక్త: పురుషజ్ఞోవిశేషతః ఏవం లక్షణ సమ్పన్నోగురురిత్యభిధేయతే, గుశ్శబ్దస్త్వన్ధకారస్స్యాత్, రుశబ్దస్తన్నిరోధకః, అన్ధకార నిరోధిత్వా ద్గురురిత్యభిధేయతే, గురురేవ పరబ్రహ్మా, గురురేవ పరాగతిః, గురురేవ పరావిద్యా, గురురేవ పరాయణం, గురురేవపరాకాష్ఠా, గురురేవపరంధనం, యస్మాత్తదుపదేష్ఠాసౌ తస్మాద్గురుతరో గురురితి, యస్సకృదుచ్ఛారయతి, తస్యసంసారమోచనం భవతి, సర్వ జన్మకృతంపాపం తక్షణా దేవ నశ్యతి, సర్వాన్ కామానవాప్నోతి, సర్వ పురుషార్థాసిద్ధిర్భవతి, యఏవం వేదేత్యుపనిషత్" - వేదసంపన్నుడును, విష్ణుభక్తుడును, మాత్సర్యరహితుడును, యోగవేత్తయు, యోగాను ష్ఠానము కలవాడును, సదాయోగాత్మకుడును, శుచియైనవాడును, ఆచార్యుడగును. గురుభక్తి తత్పరుడును, పరమాత్మజ్ఞానము కలవాడు. ఇట్టిలక్షణములు కలవాడు గురువు అని చెప్ప బడును. 'గు' అనగా అంధకారము. 'రు' అనగా దానినిపోగొట్టువాడు. కావున అతనిని 'గురువు' అనిచెప్పబడును. గురువే పరబ్రహ్మము, గురువేపరమగతి, గురువే పరావిద్య, గురువేపరమఆశ్రయము. గురువే పరాకాష్ఠ, గురువే పరమధనము, సదుపదేశము చేయు వాడు కావున గురువు మిక్కిలి గొప్పవాడు. ఎవడు ఈగురుస్తోత్రమును ఒక్కసారి యుచ్ఛ రించునో అట్టివానికి సంసార నివృత్తికలుగును. అతడు అనేక జన్మలలో చేసిన పాపములు తక్షణమే నశించును. అతడు సకలాభీప్సితములును పొందును. అతనికి సకల పురుషార్థ సిద్ధులు కలుగును. ఇదియే ఉపనిషత్తు.
పైన చెప్పినదానిని పరిశీలిస్తే, గురువేపరబ్రహ్మ, ఉత్కృష్ఠమైన ఆశ్రయము గురువే, పర బ్రహ్మమును చేరుకొనుట అనగా 'గతి' గురువే, దానికి కావలసిన జ్ఞానము అనగా పరావిద్య గురువే, దానికి కావలసిన 'పరంధనం' అనగా సాధనసంపత్తి గురువే, ఈవిధముగా ఉపదేశము చేయువాడు నిశ్చయముగా గురువులలోకెల్ల ఉత్తమగురువు. కాబట్టి గురువే పరబ్రహ్మ, పరబ్రహ్మే గురువు. సర్వకాలసర్వావస్థలలోను మనలను ఉద్థరించే గురువుయొక్క స్మరణయే, పరబ్రహ్మ విచారమవుతుంది. ఒకవేళ ప్రత్యక్ష గురువు స్పందించకపోయినా, "శ్రీగురుమండలి” స్పందించి, పరబ్రహ్మవిషయిక జ్ఞానము ను మనకు ప్రసాదించుతుంది. కాబట్టి సద్గురువు పరబ్రహ్మాత్మికమైన వాడు. ఈభావనతో మిగిలిన నామములను 'తత్త్వవిచారణ' చేస్తే మనకు సరియైన జ్ఞానము కలిగి, గురువు యొక్క 'తత్త్వం' పూర్తిగా బొధపడుతుంది.
3.సనాతనసనాతనం, పురాణం
ఈరెండు నామముల భౌతికా ర్ధము ఒక్కటే. కావున ఈరెండింటినీ ఒకేసారి పరిశీలిద్దాం.
శ్రీమద్భగవద్గీత:విజ్ఞానయోగం:10: "బీజమాం సర్వభూతానాం విద్ది పార్థ సనాతనం, బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేస్వినామహమ్" - ఓపార్థా! సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే.
అక్షరపరబ్రహ్మయోగం:9:"కవింపురాణమనుశాపితారమ్,అణోరణీయాసమను స్మరేధ్య:, సర్వస్యధాతారమ చింత్యరూపం ఆదిత్యవర్ణం తమస:పరస్తాత్" - సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించువాడు, అణువు కంటెనూ సూక్ష్మమైనవాడు, అందరినీ ధరించి పోషించు వాడు, అచింత్యస్వరూపుడు, సూర్యునివలె నిత్యచేతన ప్రకాశస్వరూపుడు.
సాంఖ్యయోగం:20:"నజాయతేమ్రియతేవాకదాచిత్,నాయంభూత్వానభూయః, అజోనిత్యః శాశ్వతో~యం పురాణోనహన్యతే హన్యమానే శరీరే" - ఈఆత్మ ఏకాలమునందు పుట్టదు, గిట్టదు. పుట్టియుండినదికాదు. ఇది భావవికారములు (ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరి ణామము, అపక్షయము, వినాశము అను ఆరునూ భావవికారములు) లేనిది. ఇది అజన్మ, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడిననూ ఇది చంపబడదు.
బృహదారణ్యకోపనిషత్:5-4-1: "సయోహైతం మహాధ్యక్షం ప్రధమజం వేదసత్యం బ్రహ్మేతి జహతేమాన్ లోకన్" - ఈగొప్పపూజనీయమైన, మొదట ఉత్పన్నమైన 'సత్య బ్రహ్మను' ఈవిధంగా తెలుసుకొన్నవాడు ఈలోకాన్ని జయిస్తాడు.
మహోపనిషత్:4-12: "పరాత్పరం, యన్మహతోమహంతం, స్వరూపతేజోమయ శాశ్వతం, శివమ్, కవిం, పురాణం, పురుషం, సనాతనం, సర్వేశ్వరం, సర్వదేవైరూపా స్వయం, అహంబ్రహ్మేతినియతమ్,మోక్షహేతుర్మహాత్మానామ్"ఉత్తమోత్తమమైనదియు, మహత్తరమైనదియు, తేజోమయమైనదియు, కళ్యాణకారకమైనదియు, శాశ్వత మైనదియు, సర్వజ్ఞమును, పురాణమును, సనాతనమును, సకలదేవతాబృందమునకు ఉపాస్యమైనదియునగు సర్వేశ్వర రూపమును తెలిసికొన్నచో ఆపిమ్మట ఎప్పుడునూ భయములేదు.
"వాసుదేవస్సనాతనః" - వాసుదేవుడనబడు కేవలపరబ్రహ్మ వస్తువే అనాది, సనాతన మైనది.
శ్రీకృష్ణపరమాత్మ స్వయముగా సమస్తమునకు తానే మూలబీజమని చెప్పినారు. అనగా పరమాత్మే మొదటగా అవ్యక్తముగా వున్నవాడు. దానిలోంచే అన్నీవచ్చినవి. కాబట్టి సనాతన మైన వాటికి సనాతనమని, పురాణమని తెలుస్తున్నది. పైంగలోపనిషత్తు ప్రకారం, సృష్తికి పూర్వం పరమాత్మఒక్కడే వున్నాడు. ఆపరమాత్మలోనే సకలము సంకుచిత వస్త్రమువలె దాగి యున్నది. దానిలోంచి క్రమముగా మహత్తు, విరాట్, గర్భోదకశాయుడయిన శ్రీమహావిష్ణువు (ఈయన మనవిశ్వమునకు చెందిన, స్థితికారకు డైన, చతుర్భుజవిష్ణువు కాడు), సూక్ష్మపంచ భూతములు, వగైరాలన్నియూ పుట్టినవి. ఆవిధముగా అన్నిటికంటె ముందు వున్నటువంటి పరబ్రహ్మ సనాతనసనాతనము. ఆపరబ్రహ్మలక్షణాలు కలిగిన సద్గురువుకూడా 'తత్త్వజ్ఞాన' పరంగా సనాతనుడు. ఎందుకంటే, తత్త్వజ్ఞానం గురుపరంపరనుండే లభిస్తోంది కదా!
4.పరిపూర్ణం
ఈశావాశ్యోపనిషత్:శాన్తిమన్త్రం: "ఓంపూర్ణమదః పూర్ణమిదం, పూర్ణాత్పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణమేవావశిష్యతే"- సృష్టిప్రారంభమునగల ఆత్మపూర్ణ స్వరూ పము. విశ్వము ఆత్మయొక్క ఖండస్వపముకాదు. సృష్ట్యాదియందు సంపూర్ణ స్వరూపము గాగల ఆత్మనుండి, పూర్ణస్వరూపముగా స్థావరజంగమాత్మకవిశ్వము సృజియింపబడినదని చెప్పబడు చున్నది. పూర్ణమునుంచి పూర్ణముతీసివేసిననూ పూర్ణమేశేషించును. (పరిపూర్ణ మైన పరబ్రహ్మ నుండి పూర్ణమైన ప్రకృతి బయటకు వచ్చిననూ, పరబ్రహ్మ పరిపూర్ణుడే). ఆత్మ అవ్యయము.
శ్రీమద్భగవద్గీత:సాంఖ్యయోగం:16: "నాసతోవిద్యతేభావో, నాభావోవిద్యతే సతః, ఉభయో రపిదృష్టో~ న్తః త్వనయోస్త్వదర్శిభిః" - అసద్వస్తువునకు ఉనికియేలేదు. సత్తు అనుదానికి లేమియే లేదు. ఈవిధముగా ఈరెండిటియొక్క వాస్తవరూపములను తత్త్వజ్ఞానియైన వాడే ఎరుంగును.
వివేకచూడామణి:242: "అహేయమనుపాధేయం మనోవాచామగోచరం, అప్రమేయ మను ద్యస్తం, బ్రహ్మపూర్ణమహంమహః" - విడువశక్యముకానిదియు, గ్రహింపశక్యము కానిదియు, మనో వాక్కులకు గోచరము కానిదియు, కొలుచుటకు వీలులేనిదియు, ఆద్యంతరహితమైన తేజోరూపి యునగు పరబ్రహ్మమునేనేను.
పైన పరబ్రహ్మముయొక్క పరిపూర్ణత్వము వర్ణింపబడినది. సమాధ్యావస్థలో పరబ్రహ్మ యొక్క పరిపూర్ణత్వము సర్వచైతన్యరూపములో అనుభవములోనికివచ్చును. ఆపరిపూర్ణ త్వమును అనుభవించి, శాంతచిత్తుడై సద్గురువుండును. అందువలన సద్గురువుకూడా పరిపూర్ణుడే.
5. పరమానన్దమ్
తైత్తిరీయోపనిషత్:3.6: "ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్, అనందాద్ద్యేవఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేనజాతాని, జీవంతి, ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి" - ఆనందము బ్రహ్మ మని గ్రహించితిని. ఆనందము బ్రహ్మస్వరూపము. ఆనందమునుంచే నిజముగా ఈసర్వజీవ రాసులు పుట్టుచున్నవి. ఆనందముచే పుట్టినజీవరాసులు జీవించుచున్నవి. ఆనందములో ప్రవేశించి లయమగుచున్నవి.
2.5.: "తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయాత్, అన్యోన్తరఆత్మానన్దమయా"- ఆవిజ్ఞానమయుని కంటె భిన్నమైనవాడై, ఆవిజ్ఞానమయుని కంటిలోపలనున్న ఆత్మ ఆనంద మయమైనది.
"తస్యప్రియమేశిరః, మోదో దక్షిణపక్షః ప్రమోద ఉత్ర్తరపక్షః, ఆనన్ద ఆత్మా, బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా" - (ఆనన్దమయుని అవయవకల్పన) ఆఆనందమయాత్మకు ప్రియవృత్తియే శిరస్సు, మోదవృత్తియే దక్షిణపక్షము, ప్రమోదవృత్తియే ఉత్తరపక్షము, ఆనందమే ఆత్మ, బ్రహ్మమే ప్రతిష్ఠ..
2.6: "రసోవైసః" - నిశ్చయముగా అతడు ఆనందమే.
2.7: "ఏషహ్యేవానన్దయాతి" - నిశ్చయంగా అతడు ఆనందాన్నిస్తున్నాడు.
2.8: "ఏతమానన్దమయాత్మానముపసంక్రామమితి" -విద్వాంసుడు ఆఆనంద మయాత్మను పొందుతాడు.
చాంధోగ్యోపనిషత్:4-10-5: "ఓంకంబ్రహ్మ, ఖంబ్రహ్మ" - ఓం సుఖంబ్రహ్మ, ఆకాశ వ్యాపకం బ్రహ్మ.
వివేకచూడామణి:352: "నిత్యాద్వయాఖండచిదేకరూపో బుధ్ద్యాదిసాక్షీ సదసద్విలక్షణః, అహంపదప్రత్యయలక్షితార్ధః,ప్రత్యక్సదానందఘనఃపరాత్మా"-పరమాత్మనిత్యముద్వైతరహితము (ఏకము), పరిచ్ఛిన్నముకానిది(పరిపూర్ణము), జ్ఞానప్రకాశములే ముఖ్యమైన స్వరూపముగా కలది, బుద్ధిమొదలైన అంతరేంద్రియములకు సాక్షి, (అవిచేయుపనులు తెలియుచూ, అవి పొందకుండా వున్నది), సత్తగు కారణమునకు (మాయోపాధికుడగు ఈశ్వరునకు), అసత్తగు కారణమునకు (అవిద్యోపాధియగు జీవజగత్తులకు) విలక్షణమైనది, 'అహం' అనుపదముచే బోధితమైన జ్ఞానముచే(నేనను జ్ఞానముచే) సూచింపబడిన అర్థరూపమైనది. అన్తరాత్మ సర్వకాలసర్వావస్థలయందు ఆనందఘనమైనది.
పైవాటినన్నంటినీ గమనించినచో, భౌతికప్రపంచమునకు సబంధించని, వేరే ఆనందం గురించి తెలుస్తుంది. అది సమాధ్యవస్థలో జీవబ్రహ్మైక్యస్థితిలో కలిగే ఆనందం. ఒక్కపరబ్రహ్మ వలననే ఆ ఆనందం లభిస్తుంది. ఆఆనందం అనుభవిస్తూనే శ్రీత్యాగరాజుల వారు "రమించు వారెవరురా, రఘూత్తమా నినువినా" ఓరామచంద్రా! నీకన్నా ఆనందం పొందించేవారెవరు? అని కీర్తించారు. సద్గురువు ఈఆనందం తాను పొందడమేకాకుండా, ఆశ్రితశిష్యులచేత కూడా పొందిస్తాడు. కాబట్టి సద్గురువును "పరమానందస్వరూపం" అనడంలో ఎంతో ఔచిత్యంవుంది.
6. పురుషోత్తమమ్
కఠోపనిషత్:64: "ఇంద్రియేభ్యఃపరాహ్యర్థా అర్ధేభ్యశ్చ పరంమనః, మనసస్తు పరాబుద్ధి బుద్ధేరాత్మా మహాన్పరః॥ మహతః పరమవ్యక్తమవ్యక్తా పురుషంపరః, పురుషాన్నపరం కిచిత్ సాకాష్ఠాసాపరాంగతిః॥" - ఇంద్రియములకంటె ఇంద్రియార్థములు గొప్పవి. ఇంద్రియార్థముల కంటే మనస్సు గొప్పది. అహంకారము, చిత్తము, మనస్సు కంటె బుద్ధి గొప్పది. బుద్ధికంటె మహత్తు గొప్పది. మహత్తత్త్వముకంటే అవ్యక్తము గొప్పది. అవ్యక్తముకంటె పురుషుడు (బ్రహ్మము) గొప్పవాడు. ఆపురుషునికంటె ఏదియూ గొప్పదిలేదు. ఆస్థానమే ఉత్కృష్ఠము. అదే పరమాగతి.
శ్రీమద్భగవద్గీత:పురుషోత్తమప్రాప్తియోగం:18: "యస్మాత్ క్షరమతీతో~ హమక్షరాదపి చోత్తమః, అతోస్మిలోకేవేదేచప్రథితః పురుషోత్తమః" - నశ్వరమగు జడవర్గము(క్షేత్రము) కంటెను నేను అతీతుడను. నాశరహితమైన జీవాత్మకంటెను ఉత్తముడను. కనుక ఈజగత్తునందును, వేదములయందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కితిని.
బృహదారణ్యకోపనిషత్:2-5-1: "యశ్చాయమస్యా పృథివ్యాం తేజోమయః అమృతమయః పురుషోశ్చాయ మధ్యాత్మగ్ం శరీరస్తేమయో~మృతమయః పురుషోయమేవ సయోయ మాత్మా" - పృధివియందు తేజోమయుడు, అమృతమయుడు అయిన ఏపురుషుడున్నాడో, శరీరమండు తేజోమయుడు, అమృతమయుడు అయిన ఏజీవుడైయున్నాడో, అతదే ఆత్మ.
కఠోపనిషత్:2-4-12: "అంగుష్ఠమాత్ర పురుషోమధ్యఆత్మని తిష్ఠతి, ఈశానోభూతభావస్య ఏవాద్యస ఉశ్వః ఏతద్వైతమ్" - (యముడు నచికేతునితో) చేతిబొటనవ్రేలంత పరిమాణంకల పురుషుడు శరీరమధ్యంలో వున్నాడు. అతడు భూతభవిష్యద్వర్తమానాలలో కూడ వున్నాడు. నీవు నన్ను అడిగింది ఇదే.
పురముఅనే ఉపాధియందు వసియించి పరబ్రహ్మ పురుషశబ్దవాచ్యుడైనాడు. సర్వ శరీరములు ఆత్మతో కూడియున్నందున అవియన్నియూ పురుషశబ్దవాచ్యములే. ఆప్రకారము గా జంతువులు, స్త్రీలు కుడా పురుషశబ్దవాచ్యములే. తెలుగుభాషలో మాత్రమే పురుషుడంటే మగవాడు. ఆత్మ, పరబ్రహ్మములే పురుషసబ్దవాచ్యములు. ఆత్మను పురుషశబ్దముగా గైకొన్నచో, పరమాత్మానుభవమును పొందిన ఆత్మను 'పురుషోత్తమం' అనవచ్చును. కావున ఆఅనుభవమును పొందిన సద్గురువు నిశ్చయముగా 'పురుషోత్తముడే!"
7. అవ్యక్తంవ్యక్తం
శ్రీమద్భగవద్గీత:విజ్ఞానయోగం:24: "అవ్యక్తంవ్యక్తమాపన్నం మన్యంతేమామబుద్ధయః, పరంఅభావమజానంతో మామవ్యయమనుత్తమమ్" - నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపనివాడను(అవ్యక్తుడను). నాపరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక నన్ను సాధారణమనుష్యునిగా(వ్యక్తముగా) తలెచెదరు.
వివేకచూడామణి:513: "అవ్యక్తాదిస్థూలపర్యంతమ్ తత్విశ్వం యత్రాభాసమాత్రమ్ ప్రతీతమ్, వ్యోమప్రఖ్యం సూక్ష్మమధ్యాన్తహీనం బ్రహ్మాద్వైతం ద్యత్తదేవాహమస్మి" - ఏవస్తువు నందుఅవ్యక్తము (సూక్ష్మమగు మూలప్రకృతి) మొదలుకొని వ్యక్తమై స్థూలమువరకూ గల (పరమాణువు మొదలు కొని పర్వతాదులవరకును, మహాపరిమాణముగల గగనము వరకూ గల) ఈప్రత్యక్ష సిద్ధమైన (నిజముగా తోచుచున్న) సంకల్పసిద్ధప్రపంచము ఉన్నట్లుగా తోచు చున్నదో, ఏఅఖండపరిపూర్ణ బ్రహ్మము గగనముతో సమానమై సూక్మమైనదో, ఆద్యన్తములు లేనిదో, రెండవది లేనిదై కేవల స్వరూపమైయున్నదో, పూర్వోక్తవిశేషణవిశిష్ఠ, నిర్వికార, నిరామయ, నిరంజన, నిరూప, నిష్కలంక, నిరుపమ, నిర్మల పరబ్రహ్మమే, కేవల చైతన్యాత్మకుడగు 'నేను' అగుచున్నాను.
కైవల్యోపనిషత్: "అచిన్త్యమవ్యక్తమనన్తరూపం శివం ప్రశాన్తమమృతం బ్రహ్మయోనిం, తథా~~దిమధ్యాన్త విహీనమేకం ద్విభుంచిదాననదమరూపమద్భుతమ్" - ఊహకందనిది, మంగళకరమైనది, త్రిగుణరహితమైనది, శాంతత్వముకలది, శాశ్వతము, జగత్కారణము, ఆది మధ్యాంతరహితమైనది, అద్భుతము, వ్యక్తముకానిది, అనన్తరూపముగా ఉన్నది, ఆత్మ (పరబ్రహ్మము).
కఠోపనిషత్:108, 109: "ఇంద్రియేభ్యపరంమనో, మనసఃసత్త్వముత్తమం, సత్త్వాదధి మహానాత్మా, మహతో~వ్యక్తముత్తమం, అవ్యక్తాత్తోపరఃపురుషో వ్యాపకో~లింగ ఏవచ, యత్ జ్ఞాత్వా ముచ్చతే జన్తురమృతంచగచ్చతి" - ఇంద్రియములకంటె మనస్సు శ్రేష్ఠమైనది, ఆ మనస్సు కంటె సత్త్వము అనగా బుద్ధిశ్రేష్ఠమైనది. ఆమహదాత్మకంటె సర్వకారణమగు అవ్యక్తము శ్రేష్ఠ మైనది. ఆవ్యక్తముకంటె పరమైనవాడు పురుషుడు. అతడు సర్వవ్యాపకుడు. అలింగుడు. అట్టివానిని తెలిసికొనినవాడు సంసారబంధమునుండి విముక్తుడై అమృతత్త్వమును పొందుచున్నాడు.
ఇచ్చట పరబ్రహ్మకు గల అవ్యక్తవ్యక్త, అనగా, నిరాకారసాకారస్వరూపములయొక్క విచారణ జరిగింది. పరబ్రహ్మస్వరూపము ఎల్లప్పుడూ నిరాకారస్వరుపమే! అది తనంతతాను ఏమియూ చేయదు ఏదైనా చేయించాలంటే, మహత్తును, అహంకారాన్ని, తద్వారా 'విరాట్'ను ప్రేరే పిస్తుంది. అప్పుడు 'విరాట్' అయిన 'గర్భోదకశాయి విష్ణువు' స్పందించి, తదనుగుణ సాకార స్వరూపాన్ని ధరించి ఆపని పూర్తిచేస్తాడు. "యదాయదాహిధర్మస్య" అనే శ్లోకార్థము ఇదే. ఇంకాకొంచెం లోతుగా చూస్తే, సృష్ఠి, ప్రకృతికిసంభంధించినవేమియూ పరబ్రహ్మవద్దకు రా జాలవు. మహాప్రళయంలో కూడా ఆసమయంలో అజ్ఞానములోవున్న సర్వజీవరాశులు, రాళ్ళు, రప్పలు, పర్వతా లతోసహా అన్నీ పంచభూతాలలోనూ, అవి సూక్ష్మపంచ భూతాలలోనూ, అవి విరాట్లోనూ, విరాట్ అహంకారం లోను, అహంకారం మహత్తులోను లయ మవుతాయే తప్ప, మహత్తు లోంచి పరబ్రహ్మలో లయమవ్వవు. ఎందుకంటే ఆప్రకారంగా లయమయ్య జీవరాశులలో 'బ్రహ్మజ్ఞానము' లేదు కనుక. ఒక్క 'బ్రహ్మవేత్త' మాత్రమే నేరుగా ఎటువంటి అడ్డంకిలేకుండా పరబ్రహ్మలో నిరవశేషంగా లయం పొందుతాడు. (ఈవిషయాన్ని www.tatvavisleshana.weebly.comలో 'ప్రాణోత్క్రమణం'లో విపులంగా చర్చించడ మైనది.) మరలా సృష్ఠిప్రారంభమయ్యే దశలో లోగడ లయంచెందిన విధంగా మహత్తునుండి అహంకారం, విరాట్, సూక్ష్మపంచభూతాలలోంచి భౌతికపంచభూతాల్లోకి, వాటిలోంచి మరలా ప్రకృతి, అన్నీ సృష్ఠించబడతాయి.
కాని సద్గురువుమాత్రం ఒకేసారి అవ్యక్తంలోను, వ్యక్తంలోను కూడా వుండగలడు. దీనికి సరియైన ఉదాహరణ శిష్యులసందేహనివృత్తి. ఆశ్రితశిష్యులు సందేహాలు అడిగినప్పుడు, ఆవశ్యకతను బట్టి, వెంటనే ధ్యానస్థితిలో సమాధిలో ప్రవేశిం చి, సంబంధిత వివరాలు తెలుసు కొని, శిష్యులసందేహాలు అనుభవపూర్వకముగా తీరుస్తారు. (ఇటువంటివి సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీగారు పలుమారులు చేశారు. కొన్నిఉదాహరణలు 'ఒకయోగి ఆత్మకధ' లో కూడావున్నాయి.) దీనినిబట్టి సద్గురువులు స్వయముగాను, ప్రయత్న పూర్వకముగాను, ఒకేసమయంలో అవ్యక్తములోను, వ్యక్తముగా కూడా వుండగలరని విశద మగుచున్నది. కాబట్టి సద్గురువులను 'అవ్యక్తంవ్యక్తం' గా భావించవలసి యుంటుంది.
8.మహత్త్వం, తత్త్వం
సర్వసారోపనిషత్:19: "నైవంభవామ్యహం దేహేనైంద్రియాణిదశైవతు, నబుద్ధిర్మన ఈశశ్చ నాహంకారస్తదైవచ, అప్రాణోహ్యమనాశ్శుభ్రోబుధ్యాధీనాంహి సర్వదాసాక్ష్యహం, సర్వదా నిద్యస్చి న్మాత్రో ~హం నసంశయః, నాహంకర్తా నైషభోక్తా ప్రకృతేస్సాక్షిరూపకః, మత్సాన్నిధ్యా త్ప్రవర్తన్తే దేహోద్యా అజడాయివ, స్థాణుర్నిత్యస్సదానంద శ్శుద్ధోజ్ఞానమయో~ మలః ఆత్మాహం సర్వ భూతానాం విభుస్సాక్షీనసంశయః, బ్రహ్మైద్వాహం సర్వవేదాంతవేద్యం నాహంవేద్యం వ్యోమ వాతాది రూపమ్, రూపంనాహం, నామనాహం, నకర్మర్హ్మైవాహగ్ం, సచ్చిదానంద రూపమ్, నాహందేహో జన్మమృత్యుకుతోమే, నాహంప్రాణం క్షుత్పిపాసేకుతోమే, నాహంచేత శ్శోకమోహౌ కుతోమే, నాహం కర్తా బన్ధమోక్షాకుతోమేత్సుపనిషత్" - నేను శరీరమునుగాను, దశేంద్రియ ములనుగాను, బుద్ధి, మనస్సు, ఈశ్వరుడనుగాను. అదేరీతిగా అహంకారముకూడాగాను. నేను ప్రాణరహితుడను, మనోరహితుడను, పరిశుద్ధుడను, బుద్ధ్యాదులకు సర్వదాసాక్షి భూతుడను. నేను సదానిత్యు డను, చిన్మాత్రుడను. ఇందులో సందియములేదు. నేను కర్తను గాను, భోక్తనుగాను, ప్రకృతికి సాక్షిరూపముగానుందును. నాతోకలసియున్నందున, దేహాదులు చైతన్యవంతలై కార్యములు చేయుచున్నవి. నేను నిశ్చలుడను, నిత్యుడను, సదాఆనంద స్వరూపుడను, శుద్ధుడను, జ్ఞానమయుడను, నిర్మలుడను, సర్వభూతములయొక్క ఆత్మను. సర్వవ్యాపకుడను, సాక్షిని, ఇందులోసందేహములేదు. సర్వవేదాంతవేద్యమగు బ్రహ్మమును నేను. నేను అజ్ఞేయుడను. ఆకాశాది పంచభూతములు నేనుకాను. నేను నామములనుకాను. కర్మలనుకాను. సచ్చిదానంద మయమైన బ్రహ్మమునేనేను. నేను దేహమునుకాను, జనన మరణములు నాకెట్లు? నేను ప్రాణమును కాను, ఆకలిదప్పికలు నాకెట్లు? నేను చిత్తమును కాను, శోకమోహములు నాకెట్లు? నేనుకర్తను కాను, బంధమోక్షములు ఇకనాకెక్కడవున్నవి.
నాదబిందూపనిషత్:22: "ఉత్పన్నేచాత్మవిజ్ఞానే ప్రారబ్దంనైవముంచతి, తత్త్వజ్ఞానో దయా దూర్ధ్వం ప్రారబ్దంనైవవిద్యతే" - ఆత్మవిజ్ఞానము కల్గినంతలో ప్రారబ్దము వదలదు. తత్త్వజ్ఞానో దయమైన పిమ్మట ఇక ప్రారబ్దముండదు.
అన్నపూర్ణోపనిషత్:4-11: "సంవిత్తత్త్వేకృతధ్యానో నిదాఘ యదితిష్ఠసి, తద్యత్నేనాధి కేనోచ్చైరాదయసితతదం వాసనాసంపరిత్యాగే యదియత్నంకరోషిభో, యావద్విలీనం నమనో నతా వద్వాసనాక్షయః, సక్షీణావాసనాయావత్ చిత్తంతావన్నశామ్యతి, యావన్నతత్త్వవిజ్ఞానం తావచ్చిత్తశమః కుతఃయావన్నచిత్తోపశమో, తవతత్త్వవేదనమ్, యావన్నాసనానాశస్తావ తత్త్వాద్గమఃకుతః, యావన్నతత్త్వం సంప్రాప్తిర్నతావద్వాసనాక్షయః, తత్త్వజ్ఞానం మనోనాశో వాసనాక్షయ ఏవచ" - ఋభువు చెప్పుచున్నాడు. ఓనిదాఘా! సంవితత్త్వమున ధ్యానము కల్గి యున్నచో అధికప్రయత్నముతో ఆపదవిని పొందగలవు. వాసనాపరిత్యాగమునందు ప్రయత్నముచేసిన, మనస్సు ఎంతవరకూ విలీనముకాదో, అంతవరకూ వాసనాక్షయముకాదు. వాసనక్షీణించువరకూ చిత్తముపశమింపదు (వాసన = విషయపదార్థ సంగ్రహణము). తత్త్వ విజ్ఞానము రానంతవరకు చిత్తశాంతి ఎక్కడిది? చిత్తోపశాంతి కల్గునంతవరకు తత్త్వవేదనము కాదు. వాసనానాశమగునంతవరకూ తత్త్వజ్ఞానమెట్లు కలుగును? తత్త్వజ్ఞానము వచ్చువరకు వాసనాక్షయమెట్లు కల్గును? కావున, తత్త్వజ్ఞానము, చిత్తనాశము, వాసనాక్షయము పరస్పర కారణములై, దుస్సాధ్యములై యున్నవి.
ఆధ్యాత్మోపనిషత్:7: "మాయోపధిర్జగద్యోని సర్వజ్ఞత్వాదిలక్షణః పారోక్ష్యశ్శబళ స్సత్వా ద్యాత్మకస్తత్పదా~భిదః, ఆలంబనతయాభాత్య స్మత్ప్రత్యయశబ్దయోః, అన్తఃకరణసంభిన్నబోధ సత్వా~పరాబిధః, మాయా~విద్యేవిహాయైవ ఉపాధిపరజీవయోః అఖండం సచ్చిదానందం పరబ్రహ్మవిలక్ష్యతే" - మాయోపాధికత్వము, జగత్కారణము, సర్వజ్ఞత్వము, పరోక్షధర్మ విశిష్ఠత్వము మున్నగునవి పరమాత్మకు తటస్థలక్షణమును, స్వరూపలక్షణమును నగును. అట్టి లక్షణముగల పరమాత్మ మహావాక్యములోని 'తత్' పదవాచ్యార్థముగానగును. అంతఃకరణ సహితుడై అహంతత్త్వమునకు ఆధారవిషయముగా ఆ చిదాభాసుడు(జీవుడు) ప్రకాశించు చున్నాడు. "త్వమ్" అనగా చిదాభాసుడగు జీవుడే! జీవుడు బ్రహ్మముయొక్క ప్రతిబింబమే. ఈశ్వరుడు 'మాయ' శరీరముగాకలవాడు. జీవుడు 'అవిద్య' శరీరముగాకలవాడు. ఈశ్వరోపాధి యగు మాయను, జీవోపాధియగు అవిద్యను త్యజించినయెడల అఖండ సచ్చిదానంద రూపమగు పరబ్రహ్మము యొక్క దర్శనమగును.
వివేకచూడామణి:243: "తత్త్వంపదాదాభ్యామభిదీయమానయోర్బ్రహ్మాత్మనోశ్శోధితయోర్యదీ త్థమ్, శ్రుత్యా తయోస్తత్త్వమసీతి స్మ్యగేకత్వమేవప్రతిపాద్యతేముహు:" - 'తత్', 'త్వం' అను పదములచేత చెప్పబడుచున్న బ్రహ్మస్వరూపులైన జీవాత్మపరమాత్మలు ఈప్రకారముగా (లక్షణా వృత్తిననుసరించి యభేదముతో) బాగుగా పరిశోధింపబడినవారలుకాగా, ఆజీవేశ్వ రులకు 'తత్త్వమసి' (ఆబ్రహ్మము నీవు అయితివి) అను వేదవాక్యముచేత ఐక్యమే లెస్సగా మాటిమాటికీ ప్రతిపాదించబడుచున్నది.
దక్షిణామూర్త్యుపనిషత్: "వైరాగ్యతైలసంపూర్ణే భక్తివర్తిసమన్వితే, ప్రభోధపుర్ణపాత్రేతజ్ఞప్తిదీపం విలోకయేత్" - ఆత్మవిచారణయను ప్రమిదలో వైరాగ్యమను తైలమునుపోసి, అనన్యభక్తి యనెడు వత్తినియుంచి, బ్రహ్మమేనేనను ప్రజ్ఞాదీపమును వెలిగించవలెను.
'మహత్తు' అనేది మొదటగా అవ్యక్తముగానున్నటువంటి పరబ్రహ్మములోనుండి విడివడిన సత్త్వస్వరూపము. తదుపరి 'తత్త్వం' అనుపదమునకు విచారణ జరిగినది. 'తత్' అనగా పర బ్రహ్మము. 'త్వమ్' అనగా జ్ఞానవంతుడైన జీవుడు, అనగా ఆత్మ. ఆత్మే అజ్ఞానంలో వుంటే జీవుడనబడుతుంది. జ్ఞానంపొందగానే, స్వస్వరూపం తెలిసికొని ఆత్మ అవుతుంది. తదుపరి తత్త్వ విచారాన్ని, అనగా పరబ్రహ్మవిచారాన్ని కొనసాగించి, క్రమేణా 'త్వం' అనబడే ఆత్మ 'తత్' అనగా పరబ్రహ్మగా పరిణమిస్తుంది. అప్పుడు 'తత్త్వం' అవుతుంది. ఈవిచారణనే 'తత్త్వ విచారణ' అంటారు. 'తత్త్వం' అన్నదానికి మహావాక్యముల అర్థములే యదార్థములు తప్ప మరియొకటికాదు. కాబట్టి పరబ్రహ్మవిషయికజ్ఞానం పొందాలంటే, తత్త్వవిచారణే సరియైన మార్గం. అందుకే "ఉత్తమం తత్త్వ చింతనమ్" అన్నాఋఉ. మనకు తత్త్వవిచారణలో గజేంద్రుడే మార్గదర్శి. (ఈవిషయాలను www.tatvavisleshana.weebly.com లో 'గజేంద్రమోక్షము - తత్త్వవిచారణ - ఒకపరిశీలన' లో చర్చించడమైనది.)
అందువలన పరబ్రహ్మాన్ని సులువుగా అందించే తత్త్వవిచారాన్ని ఆశ్రితశిష్యులలో పాదుగొల్పే సద్గురువును "మహాతత్త్వం, తత్త్వం" అనడంలో ఎటువంటి మీమాంస లేదుకదా!
9. అహంకారం
పైంగలోపనిషత్ ప్రకారం సృష్టికిపూర్వం పరమాత్మ ఒక్కడేవున్నాడు. ఆపరమాత్మలోనే సకలము సంకుచితవస్త్రమువలె దాగివున్నది. ఆపరమాత్మనుండి రజోగుణముతో నుద్రిక్తమైన మహత్తు ఏర్పడెను. ఆమహత్తునందు ప్రతిఫలించిన బ్రహ్మము హిరణ్యగర్భచైతన్యముగా నుండెను. అందుండి తమోగుణాద్రిక్తమగు అహంకారము పుట్టెను. ఈఅహంకారము అంతః కరణలలోవుండే అహంకారముకాదు. ఈఅహంకారములో పరబ్రహ్మయొక్క ఆంశదాదాపుగా పూర్తిగా వుంది. కొద్దితేడా మాత్రమే వుంటుంది. ఈఅహంకారము పరబ్రహ్మలో తొలుదొల్త రేకెత్తిన 'నేనెవరిని' అన్న వికారమే! ఆవికారఫలితముగా పరబ్రహ్మనుండి మహత్తు, అహంకారము విడివడి తదుపరి సృష్టికార్యమునకు నాంది పలికినవి.
10. పంచభూతాత్మికం
పైవిధముగా ఏర్పడిన అహంకారమునందు ప్రతిఫలించిన పరబ్రహ్మము 'విరాట్' అను చైతన్యమై యుండెను. దానినుండి గర్భోదకశాయి అయిన శ్రీమహావిష్ణువు పుట్టెను. (ఈయన మన త్రిమూర్తులలోని విష్ణువుకాడు). ఈయననుండి సూక్ష్మపంచభూతములు పుట్టెను. ఇవి చైతన్యాత్మకమైనవి. వీటిలోంచే భౌతికపంచభూతములు, మిగిలిన సృష్టి వచ్చినవి. ఇక్కడ నుదహరించిన పంచభూతములు భౌతికమైనవి కావు, చైతన్యరూపమైనట్టివి.
11. శేషసంజ్ఞాత్మికం
మహోపనిషత్:4-8: "ఋతమాత్మా పరంబ్రహ్మ సత్యమిత్యాదికా బుధై కల్పితావ్యవహారార్థం యస్య సంజ్ఞా మహాత్మనః" - ఆత్మ, ఋతము, సత్యము, పరబ్రహ్మము అను పదములు పరబ్రహ్మమునకు వ్యవహారసంజ్ఞలు. వీనిని మహాత్ములు వ్యవహారార్థము కల్పించి ఏర్పరిచిరి.
సంజ్ఞ అనగా గుర్తు లేక నామము. శేషసంజ్ఞాత్మికం అంటే సంజ్ఞలను శేషించినది అని భావం. పరబ్రహ్మము అనామి, అవ్యక్తం, అవ్యయం. కాబట్టి దాన్ని గుర్తించడానికి కొన్ని వ్యవహార నామములు లేదా గుర్తులు కల్పించుకొనవలసి వచ్చినది. అందువలన మహాత్ములు పైవాటిని కల్పించి మనకు అందించారు. వీటిని ఉపయోగించుకొని, తత్త్వవిచారణచేసి, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలిసికొని, అనుభవాన్ని పొందినపిమ్మట, సంజ్ఞామాత్రమైన ఆనామములతో పనిలేదు. వాటిని విసర్జించవలసినదే. అందువలన పరబ్రహ్మము శేషసంజ్ఞాత్మిక మైనది. ఈభావాన్నికలిగించే సద్గురువునకు కూడా ఈనామము వర్తిస్తుంది. ఎప్పుడైతే సద్గుతత్త్వము పరబ్రహ్మానుభవము కలిగిస్తుందో, అప్పుడు సద్గురునామము పోయి పరబ్రహ్మ మాత్రమే శేషిస్తుంది, అనగా మిగులుతుంది.
12.సచ్చిదానందం, నిత్యనిర్మలం
చాందోగ్యోపనిషత్:4-15-1: "యఏషో~క్షిణిపురుషోదృశ్యతో ఏషఆత్మేతిహోవాచ, ఏతదమృత మభయమే తద్బ్రహ్మ తద్యస్మిన్ సర్పెర్వుదకంవాసించతి వర్త్మనే ఏవగచ్చతి" - ఈకంటియందు కనిపించె పురుషుడు ఆత్మ. అతడు అమృతుడు, అభయుడు. అతడే బ్రహ్మ. నేతినిగాని, నీటినిగాని ఇతనియందు పోస్తే అవి అతనికి అంటకుండా ప్రక్కలకుపోతాయి. నేయిగాని, నీరుగాని అతనికి అంటకుండా ప్రక్కలకుపోవడం అంటే, అతనికి పాపాలు అంటవు అని చెప్పడానికే.
ముండకోపనిషత్:2-2-9: "హిరణ్మయేకోశే విరజం బ్రహ్మనిష్కలమ్, తచ్ఛుబ్రమ్ జ్యోతిషాం జ్యోతిస్తద్యదాత్మ విదోవిదుః" - ఆనిర్మలమైన, కలారహితుడైన బ్రహ్మ జ్యోతిర్మయమైన పరమ కోశంలోవున్నాడు. అతడు శుద్ధమైనవాడు. ఆతువంటివానినిగానే అత్మజ్ఞానులు అతనిని తెలుసుకొంటున్నారు.
బృహదారణ్యకోపనిషత్:4-3-12: "అనన్యానుగతం పుణ్యేనానన్వాగతం, పాపేన తీర్ణోహి తదాసర్వాన్ శోకాన్ హృదయస్యభవతి" - ఆతత్త్వానికి పుణ్యపాపాలు అంటవు. ఎందుచేత నంటే, సుషుప్తిలో హృదయంలో ఉంటూనే సమస్తశోకాలూ లేనివాడౌతాడు.
4-3-14: "అనన్వాగతస్తేన భవత్యసంగోహ్యంపురుషః" - అతడు భోగయుక్తుడు కాడు. ఈఆత్మ అసంగుడు.
తేజబిందూపనిషత్:6-1-4: "సర్వగ్ం సచ్చిన్మయంవిద్ది సచ్చిన్మయంతతమ్, సచ్చిదానంద మద్వైతగ్ం సచ్చిదానందమవ్యయమ్, సచ్చిదానందమాత్రగ్ంహి, సచ్చిదానందమన్యకం, సచ్చిదానందరూపో~హగ్ం సచ్చిదానంద మేవఖమ్, సచ్చిదానందమేవత్వగ్ం సచ్చిదానంద కో~ స్మ్యహన్ మనోబుధ్యహంకార చిత్తసంఘాతకాహ్యామీ, నత్వం, నాహం, నచాన్యంవా సర్వం బ్రహ్మైవ కేవలం నవాక్యం నపదంవేదం నాక్షరం నజడంక్వచిత్" - ఋభుమహర్షి చెప్పు చున్నాడు. సర్వప్రపంచము సచ్చిదానందము. అద్వైతము, అవ్యయము, సచ్చిదానంద మాత్రము, సచ్చిదానందరూపము, ఆకాశము. నీవు, నేను సచ్చిదానందము. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నీవు, నేను, మరొకరు లేరు. సర్వముకేవలము బ్రహ్మమే. వాక్యము, అక్షరము, జడము ఏమియూలేదు.
శంకరసూక్తి: "అన్యో~సావహమన్యో~స్మీత్యుపాస్తే యో~దేవతాం, నసవేదోనరోబ్రహ్మ నశవేదో న్యధాపశుః" - ఏమూఢజనుడు సర్వదా స్వయంప్రకాశమున సచ్చిదానందాత్మక, నిష్కలంక నిర్వికార పరబ్రహ్మస్వరూపమయ్యు, తననిరవధికానందరూప విశృంఖలత్వసర్వాత్మ భావత్వ మును తెలిసికొనజాలక బ్రహ్మోపాసన విడనాడి ఇతర దేవతోపాసన చేయుచున్నాడొ, అతడు బ్రహ్మమునెరుంగజాలక పశువగును.
ఇచట మరియొకసారి పరబ్రహ్మయొక్క నిర్మలసచ్చిదానందస్వరూపమును తెలియజేయు చున్నారు. ఎప్పుడైఅతే ఆత్మ బ్రహ్మీభావభూతమవుతుందో, అప్పుడు నిర్మలచైతన్యానంద స్వరూపుడౌతాడు. అప్పుడతనికి ఏవిధమైన కలంకము అంటదు. అప్పుడు తనఆత్మలోనే కాకుండా, సకల చరాచరప్రపంచ మంతటా, అణువణులోను ఆనిర్మలచైతన్యానందాన్ని దర్శించి, అనుభవిస్తాడు. శ్రీవల్లభాచార్యులు తన 'మధురాష్టకం'లో వర్ణించింది ఈస్థితినే. మధువంటే ఆనందమని, మధురాధిపతి అంటే ఆనందానికి అధిపతి అని అర్థం. దీనిని తెలిసికొనక ఇతరమార్గములు పట్టినవారిని పశువన్నారు. ఇటువంటి ఆనందస్వరూపాన్ని నిత్యమూ అనుభ వించుచూ, శిష్యులచేతకూడా అనుభవింపజేసే సద్గురువు "నిత్యనిర్మల సచ్చిదానందస్వరుపమే!"
13.సృష్ఠిస్థితిలయతిరోధానుగ్రహమహాకారణమ్
ప్రతీపనికి ఒకకారణముంటుంది. మనం ప్రకృతిలోగమనించే, పుట్టుక, వుండుట, పెరుగుట, మరణించుట, ఇవికాకుండా, తిరోధానము అనగా, సృష్టిలోనే లేకుండాపోవుట, అనుగ్రహము అనగా లేనిది ఇచ్చుట, వీటన్నిటికీ పరబ్రహ్మఒక్కడే ఉపాదాన, నిమిత్తకారణ భూతమై యున్నది. అందువలన దానిని మహాకారణము అన్నారు. అలాగుననే, శిష్యులలో జ్ఞానము కలిగించుట, దానినిపెంచుట, సంశయములను నివృత్తిచేయుట, అజ్ఞానమును తిరిగిరాకుండా, సమూలముగా పెకలించివేయుట, అఖండైకరసానుభూతిని, పరబ్రహ్మానుబ్ హవమును అనుగ్రహించుట, వీటన్నింటికీ మహాకారణము సద్గురువు.
14.చిన్మాత్రవిస్తారితమ్
మనకు ధ్యానములోకలిగే మొట్టమొదటి అనుభవము 'ఆత్మదర్శనము'. అది మిణుగురు పురుగు వలె ఒక్కసారి మెరిసిఅదృశ్యమవుతుంది. సాధనచేయగా, చేయగా, అదినిలబడి, చైతన్య వంతమయి, విస్తరించి, దృశ్యమున్నంతమేర, తానేఅయి కనపడుతుంది. దీనిగురించి తదుపరి వచ్చే నామములలో చక్కటి వివరణలున్నాయి. ఇటువంటి చైతన్యవిస్తారితమైన ఆత్మకల సద్గురువు, తన ఎదుటకు వచ్చిన జీవియొక్క ఆత్మపరివేష్ఠనాన్ని (aura), ఆత్మచైతన్యాన్ని గుర్తించి, ఆజీవియొక్క పరిపక్వతను గ్రహించి, తదనుగుణంగా ఉపదేశమిచ్చి, తదుపరిస్థాయికి చేరగలిగేటట్లు చేస్తాడు. అందువల్ల సద్గురువు చినాత్రవిస్తారితుడు.
15. సర్వజ్ఞసర్వవిలోకనమ్
శ్రీమద్భగవద్గీత:కర్మససన్న్యాసయోగం:26: "కామక్రోధవియుక్తానామ్ యతీనామ్ యుత చేతసా, లభితోబ్రహ్మనిర్వాణం వర్తతేవిదితాత్మనా" - కామక్రోధ రహితులును, చిత్తవృత్తులు జయించినవాడునుఅయి, పరబ్రహ్మ పరమాత్మసాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటనూ శాంతపరమాత్మయే గోచరించును.
ఆత్మసంయమయోగము:29: "సర్వభూతస్తమాత్మానం సర్వభూతానిచాత్మని, ఈక్షతేయోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శినః" - సర్వవ్యాపకాత్మమైన అనంతచైతన్యమునందు ఏకీభావస్థితి రూపయోగయుక్తమైన ఆత్మకలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడు ను అగుయోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమైయున్నట్లుగను, ప్రాణుల న్నింటిని ఆత్మయందు కల్పితములుగను భావించును.
31. సర్వభూతస్థితయోమాం భజత్యేకమాస్థితం, సర్వదావర్తమానోపి సయోగిమయివర్తతే" - భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వ భూతములయందును ఆత్మ రూపమున నన్ను భజించును. అట్టియోగి సర్వదా సర్వవ్యవహారములయందు ప్రవర్తించు చున్ననూ, నాయందే ప్రవర్తించుచుండును.
ముండకోపనిషత్:1-1-9: "యఃసర్వజ్ఞ సర్వవిద్యస్య జ్ఞానమయంతపః తస్మాదేతద్బ్రహ్మ నామరూప మన్నంచజాయతే" - సర్వజ్ఞుడు, సర్వవేత్త, జ్ఞానమయమైన తపస్సుకలవాడు అయిన వానివల్ల, హిరణ్యగర్భుడు, ఈనామరూపాలు, అన్నము మొదలగునవి పుడుతున్నాయి.
మండలబ్రాహ్మణోపనిషత్: "సర్వశరీరేషు చైతన్యేకతా ధ్యానమ్" సర్వప్రాణులయందున్న చైతన్యమొకటియేయని భావించుటయే ధ్యానము.
వేదాంతచూడామణి:317: సర్వత్ర సర్వతస్సర్వం బ్రహ్మమాత్రావలోకనైః సద్భావవాసనా దార్థ్వాత్తత్త్రయాలయమశ్నుతే" - అన్నిచోట్లను(అన్నికాలములయందును), అంతటను సమస్తము బ్రహ్మమేయని చూచుటచేత, సత్తగు బ్రహ్మభావముయొక్క ధృఢత్వమువలన ఆమూడున్నూ అనగా సంస్కారభావనాకర్మలు (1జన్మపరంపరాగత సుస్థిరసంస్కారము, 2. అనాత్మభావనలు, 3.తత్కార్యములు)అను మూడున్నూ నాశనమగుచున్నవి.
ఇచ్చట యోగియొక్క అవలోకన, భావనలు ఏరకంగా స్థిరమైయుండునో తెలియజేయు చున్నారు. తాను యోగంలోకూర్చుని తాపీగా పరబ్రహ్మభావనలో మునిగిపోకుండా, ఇతర జీవుల పట్ల ఏరకంగా సమభావన, సహానుభూతివుండాలో చెప్పారు. ఇతరులబాధలను చూసి జాలిపడటం 'sympathy'. ఇతరులబాధలను తనబాధలవలె అనుభవించడం 'empathy' ముందర తనలోని ప్రాణచైతన్యాన్నిగుర్తించి, అనుభవించి, అలాగే ఇతర ప్రాణుల లోని చైతన్యాన్ని దర్శించి, ఆరెండునూ ఒక్కటే అనిభావించడమే సమదర్శనం. ఇదే యోగంలో చరమదశ. దీనినే సర్వత్ర పరబ్రహ్మభావనము, లేదా దర్శనము అంటారు. ఈస్థాయికి వచ్చిన వారినే 'పరమహంసలు' అనికూడా అంటారు. ఈస్థాయిలో వున్న సద్గురువుని 'సర్వజ్ఞ సర్వ విలోకనం' అనడంలో పొరపాటేమియూ లేదుకదా!
16. ధైర్యయశోప్రజ్ఞానవైరాగ్యసత్తాస్ఫూర్తిస్వరూపసర్వాత్మకమ్
ఐతరేయోపనిషత్:3-2: "యదేతద్ హృదయంమనశ్చైతత్, సంజ్ఞానమానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధాదృష్టి, ధృతిర్మతిర్మనీషాజూతిః, స్మృతిఃసంకల్పః క్రతురసుః కామోవశయితి, సర్వాణ్యే యైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి" - ఈహృదయము, మనస్సు, చేతన త్వము, ఈశ్వరత్వము, సమస్త వివేకము, సద్ జ్ఞానము, శాస్త్రజ్ఞానము, సకలము నెరింగెడి జ్ఞానము, ధైర్యము, మనస్సు, మనోధారుఢ్యము, మనోవేదజ్ఞానము, స్మరణము, రూపాదు లను వికల్పములుగా గాంచుట, నిశ్చయము, ప్రాణవృత్తి, ఆశ, స్వాధీనత, అనునవన్నియు ప్రజ్ఞానముయొక్క నామరూపములే యగుచున్నవి.
ఇచట బ్రహ్మభావనపొందినవారు ఎటువంటి గుణములతో వుండాలో తెలియజేశారు. మీరు చక్కగా గమనిస్తే, సద్గురువు సరిగ్గా ఇటువంటి సద్గుణములతో విరాజిల్లుతూవుంటారు.
17. శబ్దబ్రహ్మవిద్యాత్మికమ్
తైత్తిరీయోపనిషత్:1-8-1: "ఓమితిబ్రహ్మ ఓమితేదగ్ంసర్వం, ఓమిత్యేతదనుకృతి హస్మనా ఆప్యోశ్రావయేత్యాశ్రావయన్తీ, ఓమితిసామానిగాయన్తి, ఓగ్ంశోమితి శస్త్రాణిశగ్ంశన్తి, ఓమిత్య థర్వుః ప్రతిగరంప్రతిశృణోతి, ఓమితిబ్రహ్మప్రసౌతిద్, ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి, ఓమితి బ్రాహ్మణః ప్రవక్ష్యన్నాహ బ్రహ్మోపాప్నవానీతి, బ్రహ్మైవోపాప్నోతి" - ఓంఅను అక్షరమే బ్రహ్మ. ఈసర్వ చరాచరజగత్తు ఓంకారమే. యజ్ఞాదివైదిక కార్యక్రమములలొ సమ్మతిసూచకముగా ఓం అని చెప్పుట విదితముకదా! యజ్ఞసమయములో అధ్వరువుఅగ్నినుద్దేశించి హవిస్సులను సమర్పించు సమయమువచ్చినదని తెల్పుము అనిచెప్పుటకు ఓంఅని చెప్పుచున్నాడు. ఓం అనిచెప్పి సామములు పాడుదురు. ఓంఅనిపరికియే శస్త్రములు పఠించుచున్నారు. ఓంఅని పలికియే అధర్వుడు ప్రోత్సాహకరవాక్యములు పలుకుచున్నాడు. ఓంఅనిపలికియే యజ్ఞము చేయించు ముఖ్యఋత్విక్కుడు అనుజ్ఞనిచ్చుచున్నాడు. ఓంఅని పలికియే అగ్నిహోత్రమును చేయుటకుఅనుజ్ఞ నిచ్చుచున్నాడు. ఓంఅని బ్రహ్మణ్యుడు వేదముచదువుటకు ప్రారంభించును.
అమృతబిందూపనిషత్:16: "శబ్దాక్షరం పరబ్రహ్మ, తస్మిన్ క్షీణేయదక్షరం, తద్విద్వానక్షరం ధ్యాయే, ద్యదిచ్ఛేచ్ఛాన్తిమాత్మనః" - పరబ్రహ్మము శబ్దాక్షరము (శబ్దమనెడి వేదము అక్షరము) గానున్నది. ఆశబ్దము సమాప్తినొందినపిదప నేది శేషించుచున్నదో ఆఆక్షరమును ఆత్మశాంతి గోరు విద్వాంసుడు ధ్యానింప వలయును.
17: "ద్వేవిద్యేవేదితత్యేతు శబ్దబ్రహ్మపరంచయత్, శబ్దబ్రహ్మాణినిష్ణాతః, పరంబ్రహ్మాదిగచ్ఛతి” - రెండువిద్యలను తెలిసికొనదగినది. అనగా శబ్దబ్రహ్మమును, పరబ్రహ్మమును చక్కగా తెలుసు కొన్నవాడు పరబ్రహ్మమును పొందుచున్నాడు.
నాదబిందూపనిషత్:30: "బ్రహ్మప్రణవసంధాననాదో జ్యోతిర్మయశ్శివః, స్వయమావిర్భ వేదాత్మా మేఘాపాయేం~శుమానివ" - బ్రహ్మప్రణవముల సంధానమువలన నాదము పుట్టును. అదే జ్యోతిర్మయుడైన శివుడు. మబ్బులు తొలగగానే సూర్యునివలె స్వయముగా ఆవిర్భవించును.
34: "ఆదౌజలధిజీమూతభేరీనిర్ఝరసంభవః, మధ్యే మర్థళశబ్దాభో ఘంటాకాహళజస్తదా" - (సాధన) ప్రారంభములో సముద్రఘోష, మేఘగర్జనము, భేరీనినాదము, నదీప్రవాహశబ్దము వంటి ప్రణవనాదములు వినును. సాధనమధ్యలో మద్దెలశబ్దము, ఘంటానాదము, కాహళశబ్దము వినును.
35:"అంతేంతు కింకిణీవంశవీణాభ్రమరనిస్వనః, ఇతినానావిధనాదాశ్రూయంతే సూక్ష్మ సూక్ష్మతః" - ప్రణవధ్యానముయొక్క అంత్యములో కింకిణీ (చిరుమువ్వలు) నాదము, వేణుగాన నాదము, వీణానాదము, భ్రమరఝంకారనాదము మొదలగు నానావిధనాదములు అత్యంత సూక్ష్మముగా వినపడును.
36: "మహతిశ్రూయమాణేతు మహాభేర్యాధికధ్వనౌ, తత్రసూక్ష్మంసూక్ష్మతరం నాదమేవ పరామృశేత్" - ధ్యానస్థితిలో అధికముగా శ్రవణముచేయునపుడు మహాభేరీనాద శబ్దములు వినిపించును. అప్పుడు అత్యంతసూక్ష్మనాదములను గమనింపవలెను.
41. సర్వచింతాంసముత్సృజ్య సర్వచేష్టావివర్జితః, నాదమేవానుసంధధ్యాన్నాదే చిత్తం విలీయతే" - సర్వచింతలను విడచిపెట్టి, సర్వచేష్టలను విసర్జించి, ప్రణవనాదమును మాత్రమే అనుసంధానము చేయవలెను. అపుడు ప్రణవనాదములో చిత్తము లయమగుచున్నది.
47: "మనస్తత్యలయంయాతి తద్విష్ణోపరముపదమే, తావదాకాశసంకల్పో యావచ్చబ్ద ప్రవర్తతే" - మనస్సు ఎచ్చటలయమును చెందునో, అదియే విష్ణువుయొక్క సర్వోత్తమ స్థానమై యున్నది. ఆకాశములో శబ్దములవలె మనస్సులో సంకల్పములు ప్రవర్తించుచున్నవి. ఎంత కాలము శబ్దముండునో అంతకాలమే సంకల్పముండును.
8. "నిశ్శబ్దంతత్పరంబ్రహ్మ పరమాత్మాసమీయతే, నాదోయావన్నవస్తావన్నాదాంతేతు మనో న్మనీ” - నిశ్శబ్దమైన, పరబ్రహ్మపరమాత్మ ఏకమగును. నాదమున్నంతవరకే మనస్సుండును. నాదాంతమున మనోన్మనియగును.
49: "సశబ్దశ్చాక్షరేలీనో నిశ్శబ్దంపరముపదమ్, సదానాదానుసంధానాత్సంక్షీణా వాసనా తుయా" - ఆశబ్దము అక్షరపరబ్రహ్మములో లీనమగును. నిశ్శబ్దమే పరమపదము. నిరంతర నాదానుసంధానమువలన సర్వవాసనలు క్షీణించును.
51, 52: సర్వేతత్రలయంయాంతి బ్రహ్మప్రణవనాదకే, సర్వావస్థావినుర్ముక్త సర్వచింతా వివర్జితః। మృతవత్తిష్ఠతేయోగీ సముక్తోనాత్రసంశయః, శంఖదుంధుభినాదంచ శృణోతికదాచన।" - బ్రహ్మప్రణవనాదములో సర్వమును లయమునుపొందుచున్నవి. సర్వావస్థలనుండి విముక్తుడై సర్వవిచారములనుండి విడువబడినవాడై, మృతుడువలె ఎవడుండునో, ఆయోగి ముక్తుడనుట లో సంశయములేదు. ఇకఎప్పుడునూ శంఖదుంధుభినాదములను వినడు.
55, 56: "జాగ్రన్నిద్రావినిర్ముక్తస్స్వరూపావస్థతామియాత్, దృష్టిస్థిరాయస్య వినా సదృశం వాయుఃస్థిరో యస్యవినాప్రయత్నమ్, చిత్తంస్థిరంయస్య వినావలంబం సబ్రహ్మతాపాంతర నాద రూపమిత్యుపనిషత్” - అట్టివాడు (పరిపక్వధ్యానాభ్యాసముచేత) జాగ్రద్ నిద్రావస్థలులేనివాడై స్వరూప(ఆత్మ)అవస్థనుపొందును. దృశ్యములేకున్ననూ ఎవనిదృష్టిస్థిరముగానున్నదో, ప్రయత్నము లేకుండగనే ఎవనికివాయువు స్థిరముగానుండునో, అవలంబము (ఆధారము) లేకుండగనే ఎవనిచిత్తము స్థిరముగానుండునో, అతడు బ్రహ్మతాపాంతర నాదరూపము నందును అని ఉపనిషత్తు.
పతంజలియోగసూత్రములు: 27: "తస్యవాచకః ప్రణవః" 28: "తజ్జపస్తదర్థభావనః" - దాని(పరబ్రహ్మ) యొక్క సర్వనామము ఓంకారము. దానిని జపించుటవలన దాని( పరబ్రహ్మ) యొక్క అర్థము, భావనయుకలుగును.
ఇచ్చట పరబ్రహ్మము శబ్దరూపముగా ఎలావున్నాడో, ఆశబ్దబ్రహ్మోపాసన ఎలాచేయాలో వివరించారు. దీనినే నాదబిందూపాసన అనికూడా అంటారు. దీనిగురించి చాలావిపులముగా www.tatvavisleshana.weebly.com లో ‘నాదము' అనేవిభాగములో చర్చించడ మైనది. పరిశీలించప్రార్థన. పతంజలి దీని రహస్యాన్ని విప్పిచెప్పారు. పరబ్రహ్మముయొక్క సర్వనామము ఓంకారమని, ఆఓంకారమును నాదబిందువుగా జపిస్తే పరబ్రహ్మముయొక్క అర్థము, అనుభవము కలుగుతాయని విశదీకరించారు. అటువంటి అనుభవాన్నిపొందిన సద్గురువును "శబ్దబ్రహ్మాత్మికమ్" అనిపొగడవచ్చుకదా!
18. పంచబ్రహ్మవిద్యాత్మికమ్
మొదట ఈనామమును పంచ బ్రహ్మవిద్యలు అనే అర్థములో చూస్తే చాలా బ్రహ్మవిషయక విద్యలు కనబడ్డాయి. చాందోగ్యోపనిషత్ లో దహరవిద్య, భూమవిద్య, వైశ్వానరవిద్య, మధు విద్య, పంచాగ్నివిద్యలు, బృహదారణ్యకోపనిషత్ లో శాండిల్యవిద్య, సంవర్గవిద్యలు, తైత్తిరీయో పనిషత్ లో భార్గవీ లేదా వారుణీవిద్య వున్నాయి. వాటినన్నింటినీ వివరించడానికి ఇచ్చట చోటు సరిపోదు. జిజ్ఞాసులు ఆయాయుపనిషత్తులు పరిశీలింపప్రార్థన. మరల ఈనామమును పంచబ్రహ్మవిద్య అని ఒకేవస్తువుగా తీసుకున్నచో, పంచబ్రహ్మోపనిషత్లో దీనిగురించి చాలా వివరముగా వున్నది. వివరణ చాలాఎక్కువగా వున్నందున, సంస్కృతపాఠమునువదలి, దానితాత్పర్యమును ఈదిగువనివ్వడమైనది.
"పైప్పలాదుడు మహేశుని అడిగేను, ముందుగా ఏమిపుట్టెను? సద్యోజాతము. భగవంతు డెవరు? అఘోరుడు, వామదేవుడు. వీరెవరు? తత్పురుషుడు. ఇంకావీరెవరు? అన్నివిద్యలకు ప్రేరకుడీశానుడు. భూతమునకు, భ్వ్యమునకు, సర్వదేవయోనులకు ప్రేరకుడు. వర్ణములెన్ని? భేదములెన్ని? గుహ్యమైనసర్వమును మహాదేవుడే, అతనికి నమస్కారము అనిన, మహేశు డనెను. ఓశాకలా! లోకమున గోప్యముకన్న గోప్యమైనదేమున్నదో విను. సద్యోజాతము - మహి, పూష, రమ, బ్రహ్మ, త్రివృత్తుస్వరము, ఋగ్వేదము, గారపత్యమంత్రములు, సప్తస్వర ములు, వర్ణము పీతము, క్రియాశక్తి. సర్వాభీష్టఫలప్రదమైన అఘోరము - సలిలము, చంద్రము, గౌరి, యజుర్వేదము, మేఘముతోసమమైన స్వరము, సాంద్రము, దక్షిణాగ్ని, పంచాద్వర్థ సంయుక్తము, ఇచ్చాక్రియాన్వితస్థితి, శక్తిరక్షణసంయుక్తము, పాపవినాశకము, దోష ప్రశమనము, సర్వైశ్వర్యఫలప్రదము. వామదేవుడు - మహాబోధదాయకుడు, పావకాత్మకుడు, విద్యాలోకయుక్తుడు, కోటిసూర్యసమప్రభుడు, ప్రసన్నుడు, సామవేదస్వరూపుడు, గానాష్టక సమన్వితుడు, ధీరస్వరుడు, అహవనీయస్వరూపుడు, అనుత్తముడు, జ్ఞానసంహార సంయు క్తుడు, శక్తిద్వయసమన్వితుడు, శుక్లవర్ణుడు, తమోమిశ్రుడు, స్వయముగా పూర్ణబోధకరుడు, లోకత్రయనియంత, ధామత్రయసమన్వితుడు, నరులకు సర్వసౌభాగ్యప్రదుడు, సర్వ కర్మఫల ప్రదుడు, అష్టాక్షరసంయుక్తుడు, అష్టపత్రాంతరస్థితుడు. తత్పురుషుడు - వాయుమండల సంవృతుడు, పంచాగ్ని సంయుక్తుడు, మంత్రశక్తినియామకుడు, పంచాశద్వర్ణ రూపుడు, అథర్వవేదస్వరూపుడు, కోటికోటి గణాధ్యక్షుడు, బ్రహ్మాండాఖండవిగ్రహుడు, రక్తవర్ణుడు, కామపుడు, సర్వాదివ్యాధి భేషజుడు, సృష్టిస్థితిలయకారణుడు, సర్వశక్తిమంతుడు, అవస్థా త్రయాతీతుడు, తురీయుడు, సత్యచిత్సుఖ స్వరూపుడు, బ్రహ్మవిష్ణ్వాదిసేవ్యుడు, సర్వ జనకుడును. ఈశానుడు - పరముడు, ప్రేరకుడు, బుద్ధిసాక్షి, ఆకాశాత్మకుడు, అవ్యక్తుడు, ఓంకారస్వరభూషితుడు, సర్వదేవమయుడు, శాంతుడు, శాంత్యతీతుడు, స్వరబాహ్యుడు, అకారాదిస్వరాధ్యక్షుడు, ఆకాశమయవిగ్రహుడు, పంచకృత్య నియంత, పంచబ్రహ్మాత్మకుడు, పంచబ్రహ్మోపసంహారముచేసి, స్వాత్మతేజస్సుతో ప్రకాశించుచున్నాడు. ఆదియందు, అంత మందు, మధ్యమందుప్రకాశించును. మరొకకారణముచేకాదు. శంభుమాయామోహితులై జగ ద్గురు వైనమహాదేవుని సర్వకారణకారణుడని దేవతలెరుంగరు. పరాత్పరము, విశ్వధామమైన ఇతనిరూపము కనిపించదు. జగత్తు ఎవనిచే ప్రకాశించుచున్నదో, ఎవనియందు లీనమగు చున్నదో, పరమశాంతమైన ఆబ్రహ్మనే నేను. సద్యోజాతాదిపూర్వకమైన పంచబ్రహ్మపరునిగా నెరుంగవలెను. ఏదిపంచబ్రహ్మాత్మకముగా వినబడుచున్నదో, కనబడు చున్నదో, పంచ విధములుగా వున్న ఆబ్రహ్మకార్యమును తెలిసికొనవలెను. బ్రహ్మకార్యమని తెలిసి, ఈశానుని పొందును.
సర్వము పంచబ్రహ్మాత్మకమని స్వాత్మయందు లీనముచేసి, సోహమస్మి అనితెలిసిన విద్వాంసుడు అమృతుడైన బ్రహ్మయగును. ఇదే బ్రహ్మయని తెలిసినవాడు ముక్తుడగును. సంశయములేదు. పరబ్రహ్మస్వరూపియు, పంచాక్షరమయుడునగు శంభుని నకారాది యకారాంతరూపునిగా తెలిసి, పంచాక్షరమును జపముచేయవలెను. పంచబ్రహ్మతత్త్వము కనుక, సర్వము పంచాత్మకముగా నెరుగవలెను. పంచబ్రహ్మాత్మకమైన విద్యనెవడు భక్తిభావితుడై చదువునో వాడు పంచాత్మకమునుపొంది, స్వయముగా పంచవిధముల ప్రకాశించును."
సవివరముగానున్న దీనిని వివరించనవుసరము లేదని భావించుచున్నాము. ఇటువంటి పంచబ్రహ్మజ్ఞానము కలిగినటువంటి సద్గురువును "పంచబ్రహ్మాత్మికమ్" అనవచ్చునుకదా!
19. తురీయం, తురీయాతీతం
అన్నపూర్ణోపనిషత్:2-2: "వ్యవహారమిదగ్ంసర్వం మాకరోతుకరోతువా, అకుర్వనాపి కుర్వన్వాజీవ స్వాత్మరతిఃక్రియః అథవాతమపిత్యక్త్వాచైత్యాగ్ం సగ్ంశాంతోజ్వలన్మణిరివాత్మని, చిత్యేచైత్యదశాహీనేయాస్థితిః క్షీణచేతసాం సోచ్యతేశాంతకలనా జాగ్రత్త్వసుషుప్తతా, ఏషానిదాఘ సౌశుప్తి స్థితిరభ్యాసయోగతః ప్రౌఢసతీతురీయేతి కథితాతత్త్వకోవిదైః" - ఋభువు చెప్పు చున్నాడు. ఈసర్వవ్యవహారమును చేయుగాక, మానుగాక, చేయుచుగాని, చేయకగాని, జీవుడుతన ఆత్మ యందు ఇష్టముకలవాడై యుండవలెను. లేదా అదిన్ని వదిలిపెట్టి శాంతమైన చిత్తే ఘనముగా కలవాడై ప్రకాశించుమణివలె ఆత్మయందు శాంతుడైజీవుడుండును. చిత్తము చైత్యదశాహీనము కాగా, మనస్సు క్షీణించినవారికే స్థితియున్నదో. శాంతముగానుండు ఆదశ జాగ్రదావస్థలో సుషుప్తి వంటిది. ఓనిదాఘా! ఈసౌషుప్తిస్థితి అభ్యాసమువలన కలుగును. క్రమముగాప్రౌఢమై తత్త్వవేత్తల చే తురీయస్థితియని చెప్పబడును.
"అస్యాంతురీయావస్థాయాగ్ంస్థితిం ప్రాప్యో~వినాశినీమ్, అనందైకాతశీలత్వాదనునంద పదంగతః అనునందమహానంద కాలాతీతో~పహిముక్త ఇత్యుచ్యతేయోగీ తుర్యాతీతపదంగతః పరిగఌతసమస్తజన్మపాశ స్సకలవిలినతమోమయాభిమానః పరమరసమయః పరాత్మసక్తో, జలగతసైంధవఖండః" - ఈతురీయావస్థలో వినాశములేని స్థితినిపొంది కేవలము ఆనంద శీలుడుగానున్నందున అనానందపదవిని పొందును. సమస్తజన్మపాశములుపోయి సమస్త మైన తమోమయమైన అభిమానమువిలీనమై, పరమాత్మాసక్తుడై, రసమయుడై, నీటిలోవేసిన లవణమువలె బ్రహ్మములో కలసిపోవును.
5-14: "యదసక్తంసమం, స్వచ్ఛంస్థితం తత్తుర్యముచ్యతే, యాస్వచ్ఛాసమతాశాంతా జీవన్ముక్తవ్యవస్థితిః సాక్ష్యవస్థావ్యవహృతౌ సాతుర్యకలనోచ్యతే నైతజాగ్రన్నచస్వప్నస్సంకల్పా నామసంభవాత్, సుషుప్తిభావనోప్యేత అభావాజ్జడతాస్థితే, శాంతసమ్యక్ప్రబుద్ధానాం యథా స్థితిమిదంజగత్, విలీనంతుర్య మిత్యాహురబుద్ధానాస్థితంస్థిరం, అహంకారకలాత్యాగే సమతా యాస్సముద్గతే, విశరారౌకృతేచిత్తే తుర్యావస్థాప్రతిష్ఠితే, సిద్ధాంతో~ధ్యాత్మశాస్త్రాణాం, సర్వాప హ్నవ ఏవహి, నావుద్యుస్తేహనోమాయాశాంతం" - ఏదిఆసక్తమై సమమై స్వచ్చమైయున్నదో, అది తుర్యమనబడును. ఏదిసమతసాంతజివన్ముక్తస్థితి యున్నదో, వ్యవహారమున సాక్ష్యవస్థ యైన అది తుర్యకలన అనబడును. ఇదిజాగ్రదవస్థకాదు. స్వప్నసంకల్పములు కాదు. అసంభ వము కనుక సుషుప్తిభావముకాదు. జడతాస్థితిలేదు కనుక సమ్యక్ప్రబుద్ధులకు ఈజగత్తు శాంతమైనది. విలేనమైన దీనిని తుర్యమందురు. అబుద్ధులకు స్థిరమైనది. అహంకారకళను త్యజించగా సమత్వము కల్గగా, శత్రువులులేకుండ చిధ్రముచేయబడగా, తుర్యావస్థలో నుంచ బడగా, ఆధ్యాత్మ శాస్త్రముల సిద్ధాంతము అంతయు అపహ్నవమే అనగా లేనిదే! ఇక్కడ అవిద్యలేదు, మాయ లేదు. ఈబ్రహ్మ దుఃఖములేనిదై శాంతమైనది. స్వచ్చమైన చిదాకాశమున శమరూపమైన దాని యందు శాంతమైనది.
అవధూతగీత: "కేవలంతుర్యరూపోస్మి తుర్యాతీతో~స్మికేవలః, సదాచైతన్యరూపోస్మి చిదా నందమయో~స్మ్యహమ్" - అహంబ్రహ్మస్మి జ్ఞానముచే నేను కేవలతుర్యరూపుడను. తుర్యా తీత కేవలపరబ్రహ్మను. సర్వదాచైతన్యరూపుడను, చిదానందమయుడను, అవ్యయుడను అగుచున్నాను.
ధ్యానబిందూపనిషత్:2-4: "తురీయే కేవలపరమాత్మసంబధినీభవతి, నిత్యబోధ స్వరూపాభవతి, తదా శనైశ్శనైరుపరమేద్బుద్ధ్యాధృతిగృహీతయా ఆత్మసంస్థంమనంకృత్వా నకించితపిచింతయే త్తదాప్రాణాపాన యోరైక్యంకృత్వా సర్వంవిస్వమాత్మస్వరూపేణ లక్ష్యం ధారయతి, తధాతురీయ తీతావస్థా, తదాసర్వేషామానందస్వరూపోభవతి, ద్వందాతీతోభవతి, యవద్దేహధారణా వర్తతే తావత్తిష్ఠతి, పశ్చాత్పరమాత్మస్వరూపేణ ప్రాప్తిర్భవతీత్యనేన ప్రకారేణ మోక్షోభవతి." - తురీయమునందు బ్రహ్మనిష్ఠునిస్థితి పరమాత్మ సంబంధములదియగును. అదినిత్యము బోధస్వరూపమైనది. అపుడుసాధకుడు ధైర్యముతోకూడిన బుద్ధిద్వారా మనస్సు ను బాహ్యవిషయములనుండి మరలించి, అంతర్ముఖముచేసి హృదయమునందునిలిపి, ఇతర చింతలను వీడి, సదా బ్రహ్మమునే ధ్యానించవలెను. అపుడు ప్రాణాపానములను ఏకముచేసి, సర్వజగత్తును బ్రహ్మముగా గాంచగలడు. అదియే తురీయాతీతదశ యగును. శరీరధారణ యున్నంతవరకును ఇట్లుండి, తదుపరి విదేహముక్తినొంది పరమాత్మలో లీనుడగును. ఈప్రకారముగ జీవునకు మోక్షము కలుగుచున్నది.
వాటిని పరిశీలించినచో మనకు రెండులక్ష్యములు గోచరించుచున్నవి. మొదటిది శరీరములో వున్నది. ఆజ్ఞాచక్రముతో మొదలై సహస్రారముతో అంతమగును. ఆజ్ఞాచక్రమునుండి సహస్రారము వరకు పయనించుటను చలదృష్టి అంటారు. అనగా దృష్టి కేంద్రీకరించవలసిన స్థానమును ఆజ్ఞాచక్రమునుండి మెల్లమెల్లగా పైకిజరుపుట. అలాసహస్రారముచేరి, అక్కడ జ్యోతి సమూహమును దర్శించుట తురీయము. ఇదిమన శరీరములో మనము దర్శించగల్గిన చివరి అంశము. దీనినే అంతర్లక్ష్యము అనికూడా అంటారు. కాని ఇదే చివరిదికాదు. దీనితర్వాత తురీయాతీతము వున్నదని పెద్దలు విశదీకరిస్తున్నారు. మండలబ్రాహ్మణోపనిషత్తులో "బహిర్లక్ష్యస్తు నాసాగ్రే చతుష్షడష్టదశద్వాదశాంగుళిభిః" - బహిర్లక్ష్యము నాసికాగ్రమునుండి క్రమముగా ఆరు, ఎనిమిది, పది, పన్నెండు అంగుళములపైనవున్నది" అనివిశదీకరించారు. దీనిని తురీయాతీతమంటారు. ఇదిమన శరీరము అవతలనున్న లక్ష్యము. ఇది పరబ్రహ్మతప్ప వేరొకటికాదు. సద్గురువులు పోడురి కృష్ణవేణుమాతాజీగారు అనుభవపూర్వకముగా చెప్పిన దేమిటంటే, సహస్రారముపైన ఆరుస్థాయిలుకలవని, ఇందులో మొదటిమూడు ధ్యానములో అనుభవమునకువచ్చునని, మిగిలిన మూడుస్థాయిలు శరీరమువదిలినపిమ్మటే పొందగలరని తెలియజేశారు. ఒకానొకసాంప్రదాయము ప్రకారము (మాకున్నపరిమితులవలన ఆ సాంప్రదాయమును బహిర్గతము చేయుటలేదు) మోక్షమునకు 18స్థాయిలు కలవని, మొదటి ఆరుమూలాధారమునుండి ఆజ్ఞాచక్రమువరకు, తదుపరి ఆరు ఆజ్ఞాచక్రమునుండి సహస్రారము వరకు, ఆతదుపరి ఆరు సహస్రారముపైన కలవు. కాబట్టి తురీయము మనశరీరములో చివరిది. తురీయాతీతము దానిఆవలనున్న పరమాత్మ. ఈరెండింటినీ చక్కగా అనుభవములోనికి తెచ్చుకున్న సద్గురువును "తురీయం, తురీయాతీతం" అనవచ్చుకదా!
20. నిరామయమ్
అవధూతగీత: "శుద్ధంవిశుద్ధమవిచారమనంతరూపం, నిర్లేపమవిచారమనంతరూపం, నిష్ఖండఖండమవిచారమనంతరూపం, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం" - నేను శుద్ధుడను, అశుద్ధుడను విచారములేనివాడనగుటచే అనంతరూపబ్రహ్మమగుచున్నాను. నిర్లిప్తుడను, లిప్తుడను (అసంగుడను, సంగుడను) అనువిచారమునకు దూరమైనవాడ నగుటచే అనంతరూప పరమాత్మనగుచున్నాను. నేను అపరిచ్చిన్నుడను, పరిచ్చిన్నుడను అను విచారరహితుడనగుటచే అనంతరూపపరబ్రహ్మనగుచున్నాను. నేను జ్ఞానామృత స్వరూపుడను, గగనస్వరూపుడను, సర్వత్రవ్యాపించినవాడను.
వివేకచూడామణి:469: "నిర్గుణంనిష్కలంసూక్ష్మం నిర్వికల్పంనిరంజనం, ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తికించన" - గుణాతీతమైన, విభాగరహితమైన (అఖండమైన), అన్నిటికంటె సూక్ష్మమైన (ఇంద్రియాతీతజ్ఞానముచే తెలియదగిన), సంకల్పవికల్పశూన్యమైన, సర్వసందేహ శూన్యమైన మాయామాలిన్యములేని ఒకేఅభిన్నమగు పరబ్రహ్మవున్నది. ఇట్టిపరబ్రహ్మము (తో) నందు ఎట్టిబేధమొకించుకయు లేదు.
అష్టావక్రగీత: "సాకారంఅనృతంవిద్ది నిరాకారంతునిశ్చలం, ఏతత్త్వోపదేశే నపునర్భవసంభవ" - సాకారస్వరూపమును మిధ్యగాతెలిసికొనుము. నిరాకారమగు ఆత్మతత్త్వమును నిశ్చలముగా ఎరుగుము. ఈతత్త్వోపదేశమున నీవు మరలమరల పుట్టుట జరుగదు.
సమాధ్యవస్థలో ఆపర్బ్రహ్మానందములో మునిగియుండి, వేరేయితరమైనవాటిచేత రంజింప బడనిస్థితియే నిరామయము. సద్గురువునకు ఇట్టిస్థితి స్వభావసిద్ధము.
21. అఖండాత్మతేజోశివం
కఠోపనిషత్:41: "తందుర్దర్శంగూఢమనుప్రవిష్టం గుహాహితంగహ్వరేష్టం పురాణం, ఆధ్యాత్మ యోగాధిగమేనదేవంమత్వాధీరో హర్షశోకాజహాతి" - సామాన్యులచే దర్శింపలేనిదియు, నిగూఢ మైనదియు, అంతరాత్మగాకలదియు, హృదయగుహలో కలదియు, ప్రాకృతవిషయవికారములు లేనట్టిదియు, లోకాదియు, జ్యోతిస్వరూపమైనదియునగు ఆఆత్మను అధ్యాత్మయోగముచే, శ్రద్ధాభక్తి ధ్యానయోగములచే నిరంతరము ధ్యానించి, ఆఆత్మనుతెలుసుకొని, అనగా ఆఆత్మను హృదయగుహలో దర్శించి, సర్వత్రాదర్శించిన ధీరుడు, సుఖదుఃఖాదిద్వంద్వములను జయించు చున్నాడు. ఇతడే సమదర్శినుడు, ఇతడే గురువు.
శ్రీమద్భగవద్గీత:విభూతియోగము-11: "తేషామేవారుకంపార్థ మహామజ్ఞాజంతమః, నాశయా మ్యాత్మభావస్తో జ్ఞానదీపేనభాస్వతా" - జ్ఞానుల అంతఃకరణములయందు స్థిత్రుడైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞానరూపదీపమును(జ్యోతిని) వెలిగించి అంధ కారమును పారద్రోలెదను.
చాందోగ్యోపనిషత్:8-12-3: "యఏషసంప్రసాదో~స్మాత్శరీరాత్సముత్థాయ పరంజ్యోతిరుప సంపద్య స్వేనరూపేణాభినిష్పద్యతే, స ఉత్తమపురుషః" - ఈసుషుప్తియందలి జీవుడు దేహమందలి ఆత్మాభిమానాన్నివదలి పైకిలేచి పరంజ్యోతినిపొంది, తనస్వరూపాన్ని పొందుతాడు. అతడు ఉత్తమపురుషుడు.
మైత్రేయీబ్రాహ్మణం: "ఆత్మనివిజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతంభవతి" - ఆత్మతెలిస్తే ఈదృశ్యమాన జాతమంతాతెలుస్తుంది.
శతపథబ్రాహ్మణం:10-6-32: "సఆత్మానముపాసీత మనోమయః ప్రాణశరీరంభావరూపం" - మనోమయుడు, ప్రాణశరీరంకలవాడు, ప్రకాశరూపుడు అయిన ఆఅత్మనుపాసించాలి.
కేనోపనిషత్:4-4: "తస్యైసఆదేశోయతేదద్ విద్యుతో~ద్యద్యుతదా ఇతీతిన్యమీమిషదా ఇతధి దైవతమ్" - ఆబ్రహ్మముయొక్క ఉపదేశమిదియే. విద్యుత్తుయొక్కప్రకాశమువలె క్షణమాత్రము మెరుపుమెరిసినపుడు కన్నులు మిరుమిట్లుగొనిపోవును. విద్యుత్తు క్షణమాత్రమే ప్రకాశిం చును. అట్లే బ్రహ్మముయొక్క దర్శనముకూడ!
వివేకచూడామణి -520: "నమస్తస్మై సదైకస్మైచిన్మ్హసేనమః, యదితద్విశ్వరూపేణరాజతే గురురాజతే" - ఏబ్రహ్మవస్తువు ఈదృశ్యమానమగుచున్న ప్రపంచముతో ప్రాకాశించుచున్నదో, అట్టి పరబ్రహ్మస్వరూపుడైన, సర్వదాకేవలాత్ముడవయిన, అనిర్వాచ్యమహాతేజోరూపుడవైన తమకు, ఓగురురాజస్వామీ! నమస్కారము.
ఇచట ఆత్మదర్శనమును వివరించుచున్నారు. అది మిణుగురుపురుగువలె, మెరుపువలె ప్రకాశించునని వివరించారు. సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీ అనుభవపుర్వకముగా చెప్పిన ప్రకారం, ధ్యానములో మనస్సు లయమైనప్పుడు, మనకుకనపడే అంధకారములో, ఒకచోట, సెకనులో లక్షోవంతులో, మిణుగురుపురుగు వెలిగిఆరిపోయినట్లు, మనఆత్మ ఒక్కసారి మాత్రమే కనబడుతుంది. మరల మరల ధ్యానంచేసినపుడు, మరల మరల మనస్సు లయమయి నపుడు, మరల ఒక్కసారిమాత్రమే దర్శనమిస్తుంది. కాని మనం ధ్యానాన్ని క్రమం తప్పకుండా కొనసాగించి నప్పుడు, ఆసూక్ష్మమైనకాంతి అదృశ్యమవకుండా అలాగే వుంటుంది. మనం ధ్యానాన్ని కొనసాగించేకొద్దీ, మనఅభ్యాసాన్నిబట్టి, ఆకాంతిపరిమాణంపెరిగి, బిందువంత, బొట్టంత, గుడ్డంత, చంద్రబింబమంత అవుతుంది. వదలకుండా ధ్యానాన్ని కొనసాగిస్తే, మనకు ఎంతమేర దృశ్యము వుంటుందో, అంతమేరకు ఆప్రకాశము పెరుగుతుంది. ఈపరిపక్వదశలో, మనఆత్మను ఎలాదర్శించుకొంటున్నామో, అలాగే ఇతరజీవరాశులలోనున్న ఆత్మస్వరూపాన్ని కూడా దర్శించగలుగుతాము. అప్పుడే సమదర్శనత్వము వస్తుంది. అప్పుడే సర్వవ్యాప్తియైన, అఖండాత్మతేజోశివమైన పరబ్రహ్మానుభవం వస్తుంది. దీన్నిపొందినటువంటి సద్గురువు "అఖండాత్మతేజోశివమే!"
22. హృదయకుహరమధ్యేకేవలంబ్రహ్మమాత్రమ్
కఠోపనిషత్-14: "ప్రతీబ్రవీమితదామేనిబోధ స్వర్గ్యమగ్నింనచికేతఃప్రజానన్, అనంత లోకాస్తి మధోప్రతిష్ఠాం విద్ధిత్వమేనం నిహితంగుహాయాం" - యముడు చెప్పుచున్నాడు. ఓనచికేతుడా! స్వర్గమునుచేర్చు అగ్నినితెలిసికొన్నవాడనైననేను, అనగా జ్యోతిస్వరూపుడైన నేను, పుణ్య కర్మానుష్ఠాన ఫలితము కోరనినీకు విశదీకరించెదను. దానినినావలన గ్రహించుము. అది పదు నాలుగులోకములకు మరియు స్థావరజంగములకు ఆధారమైనట్టిది అయిన ఈఅగ్నిని హృదయ గుహలో జ్యోతిస్వరూపముగా నిన్నదానిని నీవుతెలిసికొనుము.
"త్రిణాచికేతః త్రిభిరేత్యసంధిం త్రికర్మకృత్తరతైజన్మమృత్యు, బ్రహ్మజజ్ఞం దేవమీఢ్యం విదిత్వాని చాయ్యేమాంశాంతిమత్యంతమేతి" - ఓనచికేతుడా! హృదయగుహలోగల ఈఆత్మ (బ్రహ్మము) సృష్ట్యాదియందుగలది. సర్వులచే స్తుతింపదగినది, స్వయంప్రకాశకమైనది. ఈఆత్మ (బ్రహ్మ)ను మనసావాచాకర్మణా పుణ్యకర్మానుష్ఠానముచేసి, సాధనచే హృదయగుహకు చేరి, కూటస్థునితో క్షేత్రజ్ఞుని ఏకీభూతునిచేసినచో, జననమరణములనే సంసారసాగరములను దాటుచున్నాడు. అనగా అమృతత్త్వమును పొందుచున్నాడు.
తైత్తిరీయోపనిషత్:1-6-1: "సయఏషో~ న్తర్ హృదయఆకాశః, తస్మిన్నయం పురుషో మనో మయః, అమృతోహిరణ్మయః" - ఆపరబ్రహ్మహృదయఆకాశము లోపల కలదు. అందులోగల ఈ పురుషుడు, ఈదేహమునందుగల ఆత్మమనోమయుడు, అమృతుడు, కాలాతీతుడు, శాశ్వతుడు, జ్యోతిర్మయుడు.
చాందోగ్యోపనిషత్:8-1-1: "అధయదిదమస్మిన్ బ్రహ్మపురేదహరంపుండరీకం వేశ్మదహరో స్మిన్నన్తరాకాశః, తస్మిన్ యదన్తఃతదన్వేష్టవ్యం, తద్వావిజిజ్ఞాసితవ్యమ్" - బ్రహ్మకు పురం లాంటిదైన ఈశరీరంలో, సూక్ష్మమైన తామరపువ్వుఆకారంలోవుండే హృదయమనే ఇంటి లోపల ఏదహరాకాశం(సూక్ష్మమైన ఆకాశం) వుందో, ఆహృదయాకాశంలోపల వున్నవాడే వెదుక వలసినవాడు, తెలుసుకొనవసినవాడు.
8-3-3: "సవాఏషఆత్మా హృదితస్వైతదేవనిరుక్తం హృద్యమితి తస్మాత్ హృదయమహర హర్వా ఏవం విత్స్వర్గంలోకమేతి" - ఈఆత్మ హృదయమునందే కలదు. దానికి ఇది శబ్దార్థము. హృది = హృదయమునందు, ఆయమ్ = ఈఆత్మ. ఈప్రకారము తెలుసుకొన్నవాడు ప్రతి దినము స్వర్గమును (బ్రహ్మమును) పొందును.
ఇచట మనశరీరములో ఆత్మవుండు చోటు వివరిస్తున్నారు. అది హృదయములో వున్న గుహలో, అనగా దహరాకాశములో, సూక్ష్మమైన ఆకాశములో వుందని తెలియజేశారు. దీనినే శ్రీలహరిమహాశయులు 'రామగుహ' అని వ్యవహరించారు. హృదయమనేది భౌతికమైన గుండే కాదు. అది భౌతికనేత్రాలకు కనపడదు. దానినిదర్శించాలంటే వేరేదృష్టి అవుసరము. అది తపస్సు లేదా, ధ్యానముద్వారా వస్తుంది. ఈచూపు (vision) వేరేగా వుంటుంది. ఈచూపు తోనే మనం షట్చక్రాలను, ఆత్మను, ధ్యానంలో వివిధములైనటువంటి లోకాలను, స్థానము లను, చివరకు పరబ్రహ్మను దర్శించి అనుభవిస్తాము. అందులో భాగంగానే ఆత్మను అఖండ మైన తేజోస్వరూపంతో ఇటు మనహృదయగుహలోను, అటు విశ్వమంతటా కూడా దర్శిస్తాము. అప్పుడది బ్రహ్మ మవుతుంది.
23. అహమహమితి
బృహదారణ్యకోపనిషత్:3-5-2: యఏష తస్మిన్మండలే పురుషస్తస్వాహరితినామః" - ఈఆదిత్యమండలంలోనున్న పురుషునికి 'అహః' అనిపేరు.
5-5-2: "తద్యస్సత్యమసౌ అదిత్యోఏష అతస్మిన్మండలే పురుషోయశ్చాయం దక్షిణేక్ష న్పురుషః" - ఆసత్యమే ఈఆదిత్యుడు. ఈఆదిత్యమండలంలో వున్న పురుషుడే ఈదక్షిణ నేత్రంలో వున్న పురుషుడు.
చాందోగ్యోపనిషత్:1-7-5: "తస్యైతస్యతదేవరూపం, యదముష్యరూపం, యావముష్య గేష్ణౌయన్నామతన్నామ" - ఆదిత్యాంతర్గతపురుషుని రూపంవంటిదే ఈచాక్షుశపురుషుని రూపంకూడా. ఆపురుషునిఅవయవాలే, ఈపురుషునిఅవయవాలు. ఆతనిపేరే ఈతనిపేరు.
ఐతరేయోపనిషత్:2-4-6: "తద్యోహంసో~సౌయో~సౌసోహం" - నేనే ఆదిత్యమండలంలోని పురుషుడు. అతడే నేను.
ఇచ్చట సూర్యమండలంలోని పురుషుడు, దక్షిణనేత్రంలోని పురుషుడు ఒక్కరే అని ప్రతి పాదిస్తున్నారు. దక్షిణనేత్రంలో వేరేపురుషుడు ఎవరూలేరు. అతడు ఆత్మే. సూర్యమండలంలో వున్నవాడు పరమాత్మ. అవిధంగా ఆత్మ, పరమాత్మలకు అబేధాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ ఇద్దరూ ఒక్కరే కాబట్టి, ఆత్మను ముందర తెలుసుకొంటే, పరమాత్మ తనంతటతానే లభిస్తాడు. ఇదే రహస్యం. కాబట్టి పరమాత్మకోసం ఎక్కడెక్కడో వెతుకనవసరంలేదు. ఆత్మను వెతికితే పరమాత్మ దోరుకుతాడు. వేరే యితరమార్గములేదు.
24. సాక్షి
వాసుదేవమననము: "సాక్షిలక్షణం కథమితిచేత్. లోకేఏకస్యపురుషస్య అన్యదీయావస్థాయాః అవస్థావ్యాపారాణాంచ సాక్షాత్ ద్రష్టృత్వం సాక్షిత్వంయధా తూష్ణీమవస్థితస్యసన్న్యాసినః తత్త్రగత పురుషతదవస్థాత వ్యాపారాణాం నిర్వికారేణసాక్షాద్ద్రష్టృత్వం సాక్షిత్వం ఆత్మాపిజీవానా మవస్థా త్రయ మవస్థవ్యాపారాంశ్చ అవస్థాపతో జీవాంశ్చపశ్యన్నపి నిర్వికారేణావతిష్ఠతే. ఇదమేవ సాక్షిత్వం." - సాక్షియొక్క స్వరూపము నిరూపించబడుచున్నది. లొకములో ఒకానొక పురుషుని యొక్క అవస్థలను, అవస్థావ్యాపారములను సాక్షాత్తుగాచూచుటయే సాక్షిత్వము. ఉదాసీనుడుగా నుంటున్న సన్న్యాసి వచ్చుచున్నవారి వ్యాపారములగాంచుచూ నిర్వికారుడై యెటులనున్నాడో, ఆత్మకూడా ఆలాగుననే జీవులవస్థలను, తద్వ్యాపారములను, అవస్థలు గల జీవులను చూచు చున్ననూ, ఏవికారమునొందకయున్నది. ఇదియే సాక్షిత్వము. ఆత్మయే శరీరేన్ద్రియములను, తద్వికారములను గాంచుచూ, సాక్షిగా నుంటున్నది.
అష్టావక్రగీత: "స్థూలసూక్ష్మకారణశరీరాద్వ్యతిరిక్తో~వస్థాత్రయసాక్షి, సచ్చిదానందరూపో యస్తిష్ఠతి సఆత్మా" - స్థూలసూక్ష్మకారణములను మూడుశరీరములకును, జాగ్రత్స్వప్న సుషుప్తువులను మూడవస్థలకును భిన్నమై, సాక్షియై, సచ్చిదానందమగునదియే ఆత్మ.
తేసాక్షిపురుషే పరమాత్మనిచేశ్వరే, నైరాశ్యేబన్ధమోక్షేచ నచింతాముక్తయేమమ" – సాక్షి మాత్రుడును, పరమాత్మయునగు ఈశ్వరుడు తెలియబడిన వాడగుచుండగా, ఆశారహితమైన బంధమోక్షములనియెడు చింతనుండి ముక్తుడనగుచున్నాను.
"నత్వందేహో నతేదేహో భోక్తాకర్తానవాభవాన్, చిద్రూపోసి సదాసాక్షి నిరపేక్షసుఖంచరః" - నీవుశరీరముకావు, నీకుదేహములేదు, నీవుభోక్తవుగాని, కర్తవుగాని కావు. జ్ఞానస్వరూపు డవు. ఎల్లప్పుడూ సాక్షివి. కోరిక లేనివాడవు అగుచున్నావు. సుఖముగా మెలగుము.
వివేకచూడామణి:218: "అసౌస్వసాక్షిభావోయతస్స్నేనానుభూతే, అతఃపరంస్వయ సాక్షాత్ప్ర త్యగాత్మనచేతత్వః" - ఆత్మయే తనసాక్షిత్వమును అనుభవించుచున్నాడు. అందు వలననే లోపలనున్న ఆత్మసాక్షాత్తుగా స్వయముగా సర్వసాక్షి. అతనికన్న మరియొకడు లేడు.
295: "అహంపదార్థస్త్వమాదిసాక్షి నిత్యంసుషుప్తావపిభావదర్శనాత్, బ్రూతేహ్యజోనిత్యయితి స్స్వయంయత్ప్రత్యగాత్మా సదసద్విలక్షణః" - సోహంపదార్థమగునాత్మ (కూటస్థాత్మ శుద్ధ చైతన్యము) అహంకారాదులకు సాక్షియై, ఎల్లప్పుడు సుషుప్త్యావస్థయందు దాని భావ దర్శనము కలుగుటవలన వేదము, పుట్టుకలేనిది, త్రికాలములయందున్నది, అని స్వయముగా చెప్పు చున్నది. ఆఅంతరాత్మ సదసత్తులకంటె విలక్షణముగానున్నది.
ఇచ్చట రెండువిషయములు ద్యోతకమగుచున్నవి. జ్ఞానమువలన స్వస్వరూపభావనపొందిన ఆత్మ, అంతఃకరణయొక్క వికారములకు లొంగకుండా, వాటినంటకుండా, వాటినిగమనిస్తూ వుంటుంది. అంటే సాక్షిమాత్రంగావుటుంది. అలాగే, మహాత్ములుకూడా వైరాగ్యముపొంది, ఈ ప్రపంచములోవుంటూ, దానివిషయసుఖాలకు లొంగకుండా, జీవవ్యాపారముకొనసాగించుచూ, తనజీవితాన్ని తానే సాక్షిమాత్రంగా గడుపుతూవుంటారు. వారే సద్గురువులవుతారు.
25. సాక్షాత్ ఆత్మరూపేణభాతి
కఠోపనిషత్:85: "యథోదకంశుద్ధేశుద్ధమాసిక్తంతాదృగేవ భవతి, ఏవంమునేర్విజానత ఆత్మా భవతి గౌతమ" - ఓనచికేతా! ఏవిధముగా శుభ్రమైననీరు, శుభ్రమైననీటిలో పోయబడి ఒకటే అగునో, అటులనే, ఆత్మనుదర్శించిన జితేంద్రియుడైనవానివలన ఆత్మగ్రహింపబడి, అతడు ఆత్మయగును. అనగా ఆత్మ (పరబ్రహ్మముతో) ఏకీభూతమగును.
4-1: పరాంచిఖానివ్యతృణత్ స్వయంభూస్తస్మాత్పరాగ్ం పశ్యతినాంతరాత్మన్, కశ్చిద్ధీరః ప్రత్య గాత్మామైచ్చదావృస్త చక్షురమృతత్త్వమిచ్ఛన్" - పరమేశ్వరుడు ఛిద్రాలలాగావుండే యింద్రియా లను బహిర్ముఖంచేసి వాటిని హింసించాడు. అందుచేతనే అవి బాహ్యవిషయాలను గ్రహించ గలుగుతున్నాయి. ఆత్మదర్శనానికి అవిఅసమర్థములు. కానిఎవడో ఒకధీరుడైన వివేకవంతుడు మోక్షాభిలాషియై, కండ్లుమూసుకొని, ఇంద్రియములను మరలించి, అంతర్ముఖం చేసి, నిగ్రహంతో సమాధియందు పరమాత్మను దర్శిస్తాడు.
శ్రీమద్భగవద్గీత:కర్మసన్న్యాసయోగం:24: "యో ~0తసుఖో~0తరారామ: తదంతర్జ్యోతి రేవయః, సయోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో~ధిగచ్ఛతి" - అంతరాత్మయందే సుఖించు వాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞానియైనవాడునునగు యోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితిడై బ్రహ్మనిర్వాణము పొందును.
బృహదారణ్యకోపనిషత్:2-4-5: "ఆత్మావా అరేద్రష్టవ్యం శ్రోతవ్యోమంతవ్యో నిధిధ్యాసితవ్యః, సో~ న్వేష్టవ్య సవిజిజ్ఞాసితవ్య" - ఆత్మయే దర్శింపదగినది, వినదగినది, ఆలోచింపదగినది, మననం చేయదగినది, ధ్యానంచేయదగినది.
ముండకోపనిషత్:2-2-6: "ఓమిత్యేవంధ్యాయధ ఆత్మానం" - ఓం అని ఆత్మను ధ్యానం చేయాలి.
ఇక్కడకూడా ఆత్మకు పరమాత్మకు అభేదాన్ని ప్రతిపాదించారు. ఆపరమాత్మ మనలో ఆత్మ రూపంతో ప్రకాశిస్తూవుంటాడు. నిచ్చెనకు మొదటిఅడ్డకర్ర ఆత్మ అయితే, చివరిఅడ్డకర్ర పరమాత్మ. ఈనిచ్చెనద్వారా మాత్రమే పరమాత్మను చేరుకోగలము. ఇకొకగమ్మత్తైన విషయం ఏమిటంటే, ధ్యానంలో ఆత్మ జ్యోతిరూపంలో ఎలాదర్శనమిస్తుందో, అలాగే, సద్గురువుకూడా, పరీక్షించడానికి జ్యోతిరూపంలో శిష్యునికి దర్శనమిస్తాడు.
26. త్వమేవాహం
యజుర్వేదశాంతిమంత్రం: "ఓం సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యంకరవావహై, తేజస్వినావధీతమస్తు, మావిద్విషావహై" - ఆపరమాత్మ గురుశిష్యులమైన మనలనిద్దరినీ రక్షించుగాక. బ్రహ్మదర్శనప్రాప్తికై మనమిద్దరమూ పరిశ్రమించెదముగాక, మనయిద్దరి కృషి ఫలవంతమగుగాక. మేము పరస్పరము ద్వేషింపకుందుముగాక!
తైత్తిరీయోపనిషత్:శిక్షావల్లి:1: "సహనౌయశః సహనౌబ్రహ్మవర్చసమ్" - మాయిద్దరికి యశము, కీర్తి గలుగునుగాక, మాయిద్దరికికూడ బ్రహ్మతేజస్సు కలుగుగాక!
చాందోగ్యోపనిషత్:6-9-4: "తత్సత్యం, సఆత్మా, తత్త్వమసి శ్వేతకేతో" - శ్వేతకేతూ! అదిసత్యం, అదేఆత్మ, ఆఆత్మవేనీవు.
పైంగలోపనిషత్:3-1: "అథహైనం పైంగలః పప్రచ్ఛయాజ్ఞవల్క్యః తత్త్వమసి, త్వంతదసి, త్వంబ్రహ్మాసి, అహంబ్రహ్మస్మీత్యనుసంధానుకుర్యాత్, తత్ర పారోక్ష్యశబళస్సర్వజ్ఞత్వాది లక్షణో మాయోపాధి సచ్చిదానన్దలక్షణో జగద్యోనిస్తత్పదవాచ్యోభవతి, నఏవాంతఃకరణ సమ్భిన్న బొధో~ స్మత్ప్రత్యయా~ వలమ్భనస్త్వం పదవాచ్యోభవతి, పరజీవోపాధీమాయావిద్యేవిహాయ తత్త్వం పదలక్ష్యం ప్రత్యగభిన్నంబ్రహ్మా" - పైంగలముని యాజ్ఞవల్క్యుని 'మహావాక్య వివరణమును వివరించుము' అనిఅడిగెను. ఆయాజ్ఞవల్క్యముని ఈరీతిగాచెప్పెను.ఆబ్రహ్మము నీవే అయివున్నావు. నీవేఆబ్రహ్మముగావున్నావు. నీవు బ్రహ్మమవైవున్నావు. నేనుగూడ బ్రహ్మమనై యున్నాను. అనిఈరీతిగా అనుసంధానము చేయవలెను. ఆమహావాక్యమునందు పరోక్షశబలుడై యున్నవాడును, సర్వజ్ఞత్వాదిలక్షణయుక్తుడును, మాయయే(అవ్యక్తము) ఉపాధిగాకలవాడును, సచ్చిదానందలక్షుణుడును అగు జగత్కర్త 'తత్' పదవాచ్యు డగుచున్నాడు. ఈశ్వరజీవులయొక్క శరీరములైన 'మాయ, అవిద్యలను' విడచిపెట్టి, 'తత్ - త్వం' అనుపదములకు లక్ష్యమైయున్న ప్రత్యగాత్మ బ్రహ్మమే అగుచున్నది.
యోగశిఖోపనిషత్:5-9: అద్వైతం భావయేద్భక్త్యా గురోర్దేవస్యచాత్మనః యోగశీర్షం మహా గుహ్యం యోజానాతి మహామతిః, నతస్యకించిదజ్ఞాతం త్రిషులోకేషువిద్యతే, నపుణ్యపాపే స్వస్థో నదుఃఖం నపరాజయః నచాస్తిపునరావృత్తిరస్మిన్ సంసారం మండలే" - భక్తితో గురు దేవునికి, తనకు అద్వైతమును, అభేదమును భావించవలెను. మహాగుహ్యమైన యోగశీర్షమునెవడు తెలిసికొనునో, వానికిమూడులోకములయందును తెలియనిదేమియూ నుండదు. పుణ్య పాపములులేవు. స్వస్థలములేదు, దుఃఖములేదు, పరాజయములేదు. ఈసంసారమండల మున పునరావృత్తిలేదు.
ఇచ్చట అద్వైతము ప్రతిపాదింపబడుచున్నది. యోగములోను, జ్ఞానములోను, ధ్యానము లోను చిట్టచివరి అంశమిదియే! తనకు పరబ్రహ్మమునకు అభేదమును కల్పించుకొని, తద్దర్శనా నుభవము పొంది, దానిలో ఐక్యమగుటయీ వుండును. ఎంతచెప్పిననూ చివరిగమ్యమిదియే!
ది.9-10-2013న శ్రీనేరేళ్ళ పురుషోత్తమశర్మగారు మాస్వగృహమునకు విచ్చేసినారు. అప్పుడు జరిగిన సంభాషణలో వారు ఒకానొక గ్రంధములో చదివిన ఒకానొక గురుస్తోత్రమును చెప్పినారు. ఆ గురుస్తోత్రములో 31గురులక్షణములు 31గురు నామము లుగా విలసిల్లినవి. ఆ గురుస్తోత్రమును వినినవెంటనే నాకు ఎందులకో ఒక విధమైన ఉద్వేగముకలిగినది. సదరు నామములయొక్క సామాన్యభావార్థముతోపాటు తత్త్వార్థములను కూడా తెలియజేస్తే శ్రీగురుతత్త్వము బాగుగా బొధపడునని అనిపించి నది. దీనిని శ్రీపురుషోత్తమశర్మగారికి చెప్పగా, వారు చాలా ఆనందపడి, వెంటనే ఆపని ప్రారంభించమన్నారు. ఆ స్తోత్రము ఈ విధముగా వున్నది.
“సద్గురుం, పరబ్రహ్మాత్మకం, సనాతనసనాతనం, పురాణం, పరిపూర్ణం, పరమానన్దం, పురుషోత్తమం, అవ్యక్తంవ్యక్తం, మహాతత్త్వం, అహంకారం, పంచభూతా త్మకం, శేషసంజ్ఞాత్మకం, సచ్చిదానంద నిత్య నిర్మలం, సృష్టిస్థితిలయ తిరోధానాను గ్రహమహాకారణం, తత్త్వం, చిన్మాత్ర విస్తారితం, బ్రహ్మం, సర్వజ్ఞసర్వవిలోకనం, మహత్త్వం, ధైర్యయశోప్రజ్ఞాన వైరాగ్యసత్తాస్ఫూర్తి స్వరూపసర్వాత్మకం, శబ్దబ్రహ్మ విద్యాత్మికం, పంచబ్రహ్మ విద్యాత్మికం, తురీయం, నిరామయం, అఖండాత్మతేజోశివం, తురీయాతీతం, హృదయకుహరమధ్యే కేవలంబ్రహ్మమాత్రం, అహమహ మితి, సాక్షి, సాక్షాతాత్మరూపేణభాతి, త్వమేవాహం”
మొదట ఈగురునామములను పరిశీలించినచో, వాటిలో వర్ణింపబడినవన్నీ ఆపరబ్రహ్మ లక్షణములే! వాటినే సద్గురువునకు ఆపాదిస్తున్నారు. ఎందులకు? "బ్రహ్మ విద్ బ్రహ్మైవభవతి". పరబ్రహ్మమును తెలుసుకున్నవాడు పరబ్రహ్మమే అవుతాడు. సద్గురువు, పరబ్రహ్మ ఒకే నాణెముయొక్క రెండు పార్శ్వములు. ఇంకా ముందుకు చూస్తే, సద్గురువు పరబ్రహ్మముకంటే ఎక్కువే అవుతాడు. పరబ్రహ్మము తాను చేయించ వలసినదంతా చక్కగా చేయించి, తాను మాత్రము ఏమీ తెలియనట్లు, దేనికీ అంటకుండా వుంటుంది. కాని సద్గురువు అలాకాదు. తాను కష్టపడి, ఆపరబ్రహ్మముగురించి ఆలోచించి, తెలుసుకొని, దానిని అనుభవించి, తానే అది అయ్యికూడా, తాను దానిలో లయమవ్వకుండా, తనను ఆశ్రయించిన శిష్యులకు సందేహ నివృత్తిచేసి, పరబ్రహ్మ జ్ఞానమునుపదేశించి, దానిని తాను ఎలా అనుభవించాడో, అదేవిధంగా శిష్యులకు కూడా అనుభవంలోకి వచ్చేటట్లుచేస్తాడు. ఇప్పుడు చెప్పండి! గురువు పరబ్రహ్మము కంటే ఎక్కువ అవునా, కాదా? కాబట్టి ఏవైతే పరబ్రహ్మకు వున్నాయో, అవన్నీ సద్గురువుకు చెందుతాయి. ఇందులో సందేహమేమీలేదు.
తదుపరి ఈనామములకు వివరణకోసం, మాకు లభించిన గ్రంధములు, 1.బ్రహ్మవిద్యారత్నాకరము(రెండు సంపుటాలు), 2.శ్రీమద్భగవద్గీత, 3. అష్టావక్రగీత, 4.శ్రీనోరి శ్రీనాధవెంకట సోమయాజులవారి బ్రహ్మసూత్రదర్శనం, 5.ఉపనిషత్తులు, 6.వివేకచూడామణి. అనన్యులైన ఈగ్రంధకర్తలకు మాశరణాగతిని ఇందుమూలముగా తెలియజేసుకొనుచున్నాము. ఇక్కడ ఇంకొక విషయముకూడా చెప్పవలసియున్నది. ప్రతిదానికి చాలాచోట్ల చాలావిధాలుగా వివరణలు వున్నాయి. వాటినన్నింటినీ ఇవ్వా లంటే, ఆగ్రంధాలనే తిరిగివ్రాయవలసి వుంటుంది. అందువల్ల కొన్నింటినే ఎంపిక (selective) గా ఇవ్వడం జరిగింది. ఉత్సాహవంతులైన పాఠకులు పైగ్రంధములను పరిశీలించి, ఇంకా జ్ఞానమును బడయగలరని ఆశిస్తున్నాము.
సద్గురువు గురించి లభించినంతమేరకు అందరికీ తెలియజేయాలని, శ్రీగురుతత్త్వమును అందించాలని మాచిన్నికోరిక. ఈఅత్యుత్సాహములో ఏవైన పొరపాట్లు దొర్లితే మన్నించ ప్రార్థన. దీనిపై పాఠకుల సూచనలను, సలహాలను ఆహ్వానించుచున్నాము.
ఇట్లు, తత్త్వవిశ్లేషణ బృందం.
1.సద్గురుమ్
వివేకచూడామణి:34,35: "శ్రోతోయో~వృజనో~కామహతో యోబ్రహ్మవిత్తమ, బ్రహ్మణ్యు పరతశ్శాంతోనిరింధినఇవానలః" - వేదసారమెరిగి, తదాచరణదక్షుడును, సకలపాప వినిర్ముక్తు డును, నిష్కళంకుడును, కామమునకు లోబడనివాడును, ఉత్తమ బ్రహ్మవేత్తయును, సర్వదా పరబ్రహ్మమునందు రమించుచూ, తత్సుఖమును బడసినవాడును, కట్టెలులేని అగ్నివలె సమస్తవృత్తులు శమించుటచే శాంతమూర్తియై ప్రకాశించువాడును, తనకు నమస్క రించుచుండెడి సత్పురుషులకు బంధువును, ఎటువంటి ప్రయోజనముపేక్షింపకయే దయా సముద్రుడును, అనగా నిర్హేతుకజాయమాన కరుణాసముద్రుడును అయినవాడు, సద్గురువు.
అష్టావక్రగీత: "కృత్వామూర్తి పరిజ్ఞానంచైతన్యస్యకిం గురు:, నిర్వేదసమతాయుక్త్వా యస్తార యతి సంసృతే" - వైరాగ్యము, సమత్వమనెడి యుక్తులచేత ఎవడు చైతన్యము యొక్క విశేష జ్ఞానమును చేసి(పొంది), ఎవడు సంసారమునుండి తరింపజేసి కొనుచున్నాడో, అట్టివాడు గురువు కాడాఏమి?
ఇక్కడ సద్గురువుయొక్క కొన్నిలక్షణములను మాత్రమే ఇవ్వడమైనది. మున్ముందు నామములలో ఇంకా చాలాలక్షణములు, వివరణలు వస్తాయి. ఇంకా కావాలనుకునే వారు, 'శ్రీగురుగీత', www.tatvavisleshana.weebly.com లో 'శ్రీగురుసూక్తము' పరిశీలించ మనవి.
2.పరబ్రహ్మాత్మికం, బ్రహ్మం
అద్వయతారకోపనిషత్:9: "ఆచార్యోవేదసమ్పన్నో విష్ణుభక్తో విమత్సరః, యోగజ్ఞో యోగ నిష్ఠశ్చ సదాయోగా~త్మకశుచిహి:, గురుభక్తిసమాయుక్త: పురుషజ్ఞోవిశేషతః ఏవం లక్షణ సమ్పన్నోగురురిత్యభిధేయతే, గుశ్శబ్దస్త్వన్ధకారస్స్యాత్, రుశబ్దస్తన్నిరోధకః, అన్ధకార నిరోధిత్వా ద్గురురిత్యభిధేయతే, గురురేవ పరబ్రహ్మా, గురురేవ పరాగతిః, గురురేవ పరావిద్యా, గురురేవ పరాయణం, గురురేవపరాకాష్ఠా, గురురేవపరంధనం, యస్మాత్తదుపదేష్ఠాసౌ తస్మాద్గురుతరో గురురితి, యస్సకృదుచ్ఛారయతి, తస్యసంసారమోచనం భవతి, సర్వ జన్మకృతంపాపం తక్షణా దేవ నశ్యతి, సర్వాన్ కామానవాప్నోతి, సర్వ పురుషార్థాసిద్ధిర్భవతి, యఏవం వేదేత్యుపనిషత్" - వేదసంపన్నుడును, విష్ణుభక్తుడును, మాత్సర్యరహితుడును, యోగవేత్తయు, యోగాను ష్ఠానము కలవాడును, సదాయోగాత్మకుడును, శుచియైనవాడును, ఆచార్యుడగును. గురుభక్తి తత్పరుడును, పరమాత్మజ్ఞానము కలవాడు. ఇట్టిలక్షణములు కలవాడు గురువు అని చెప్ప బడును. 'గు' అనగా అంధకారము. 'రు' అనగా దానినిపోగొట్టువాడు. కావున అతనిని 'గురువు' అనిచెప్పబడును. గురువే పరబ్రహ్మము, గురువేపరమగతి, గురువే పరావిద్య, గురువేపరమఆశ్రయము. గురువే పరాకాష్ఠ, గురువే పరమధనము, సదుపదేశము చేయు వాడు కావున గురువు మిక్కిలి గొప్పవాడు. ఎవడు ఈగురుస్తోత్రమును ఒక్కసారి యుచ్ఛ రించునో అట్టివానికి సంసార నివృత్తికలుగును. అతడు అనేక జన్మలలో చేసిన పాపములు తక్షణమే నశించును. అతడు సకలాభీప్సితములును పొందును. అతనికి సకల పురుషార్థ సిద్ధులు కలుగును. ఇదియే ఉపనిషత్తు.
పైన చెప్పినదానిని పరిశీలిస్తే, గురువేపరబ్రహ్మ, ఉత్కృష్ఠమైన ఆశ్రయము గురువే, పర బ్రహ్మమును చేరుకొనుట అనగా 'గతి' గురువే, దానికి కావలసిన జ్ఞానము అనగా పరావిద్య గురువే, దానికి కావలసిన 'పరంధనం' అనగా సాధనసంపత్తి గురువే, ఈవిధముగా ఉపదేశము చేయువాడు నిశ్చయముగా గురువులలోకెల్ల ఉత్తమగురువు. కాబట్టి గురువే పరబ్రహ్మ, పరబ్రహ్మే గురువు. సర్వకాలసర్వావస్థలలోను మనలను ఉద్థరించే గురువుయొక్క స్మరణయే, పరబ్రహ్మ విచారమవుతుంది. ఒకవేళ ప్రత్యక్ష గురువు స్పందించకపోయినా, "శ్రీగురుమండలి” స్పందించి, పరబ్రహ్మవిషయిక జ్ఞానము ను మనకు ప్రసాదించుతుంది. కాబట్టి సద్గురువు పరబ్రహ్మాత్మికమైన వాడు. ఈభావనతో మిగిలిన నామములను 'తత్త్వవిచారణ' చేస్తే మనకు సరియైన జ్ఞానము కలిగి, గురువు యొక్క 'తత్త్వం' పూర్తిగా బొధపడుతుంది.
3.సనాతనసనాతనం, పురాణం
ఈరెండు నామముల భౌతికా ర్ధము ఒక్కటే. కావున ఈరెండింటినీ ఒకేసారి పరిశీలిద్దాం.
శ్రీమద్భగవద్గీత:విజ్ఞానయోగం:10: "బీజమాం సర్వభూతానాం విద్ది పార్థ సనాతనం, బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేస్వినామహమ్" - ఓపార్థా! సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే.
అక్షరపరబ్రహ్మయోగం:9:"కవింపురాణమనుశాపితారమ్,అణోరణీయాసమను స్మరేధ్య:, సర్వస్యధాతారమ చింత్యరూపం ఆదిత్యవర్ణం తమస:పరస్తాత్" - సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరినీ శాసించువాడు, అణువు కంటెనూ సూక్ష్మమైనవాడు, అందరినీ ధరించి పోషించు వాడు, అచింత్యస్వరూపుడు, సూర్యునివలె నిత్యచేతన ప్రకాశస్వరూపుడు.
సాంఖ్యయోగం:20:"నజాయతేమ్రియతేవాకదాచిత్,నాయంభూత్వానభూయః, అజోనిత్యః శాశ్వతో~యం పురాణోనహన్యతే హన్యమానే శరీరే" - ఈఆత్మ ఏకాలమునందు పుట్టదు, గిట్టదు. పుట్టియుండినదికాదు. ఇది భావవికారములు (ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరి ణామము, అపక్షయము, వినాశము అను ఆరునూ భావవికారములు) లేనిది. ఇది అజన్మ, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడిననూ ఇది చంపబడదు.
బృహదారణ్యకోపనిషత్:5-4-1: "సయోహైతం మహాధ్యక్షం ప్రధమజం వేదసత్యం బ్రహ్మేతి జహతేమాన్ లోకన్" - ఈగొప్పపూజనీయమైన, మొదట ఉత్పన్నమైన 'సత్య బ్రహ్మను' ఈవిధంగా తెలుసుకొన్నవాడు ఈలోకాన్ని జయిస్తాడు.
మహోపనిషత్:4-12: "పరాత్పరం, యన్మహతోమహంతం, స్వరూపతేజోమయ శాశ్వతం, శివమ్, కవిం, పురాణం, పురుషం, సనాతనం, సర్వేశ్వరం, సర్వదేవైరూపా స్వయం, అహంబ్రహ్మేతినియతమ్,మోక్షహేతుర్మహాత్మానామ్"ఉత్తమోత్తమమైనదియు, మహత్తరమైనదియు, తేజోమయమైనదియు, కళ్యాణకారకమైనదియు, శాశ్వత మైనదియు, సర్వజ్ఞమును, పురాణమును, సనాతనమును, సకలదేవతాబృందమునకు ఉపాస్యమైనదియునగు సర్వేశ్వర రూపమును తెలిసికొన్నచో ఆపిమ్మట ఎప్పుడునూ భయములేదు.
"వాసుదేవస్సనాతనః" - వాసుదేవుడనబడు కేవలపరబ్రహ్మ వస్తువే అనాది, సనాతన మైనది.
శ్రీకృష్ణపరమాత్మ స్వయముగా సమస్తమునకు తానే మూలబీజమని చెప్పినారు. అనగా పరమాత్మే మొదటగా అవ్యక్తముగా వున్నవాడు. దానిలోంచే అన్నీవచ్చినవి. కాబట్టి సనాతన మైన వాటికి సనాతనమని, పురాణమని తెలుస్తున్నది. పైంగలోపనిషత్తు ప్రకారం, సృష్తికి పూర్వం పరమాత్మఒక్కడే వున్నాడు. ఆపరమాత్మలోనే సకలము సంకుచిత వస్త్రమువలె దాగి యున్నది. దానిలోంచి క్రమముగా మహత్తు, విరాట్, గర్భోదకశాయుడయిన శ్రీమహావిష్ణువు (ఈయన మనవిశ్వమునకు చెందిన, స్థితికారకు డైన, చతుర్భుజవిష్ణువు కాడు), సూక్ష్మపంచ భూతములు, వగైరాలన్నియూ పుట్టినవి. ఆవిధముగా అన్నిటికంటె ముందు వున్నటువంటి పరబ్రహ్మ సనాతనసనాతనము. ఆపరబ్రహ్మలక్షణాలు కలిగిన సద్గురువుకూడా 'తత్త్వజ్ఞాన' పరంగా సనాతనుడు. ఎందుకంటే, తత్త్వజ్ఞానం గురుపరంపరనుండే లభిస్తోంది కదా!
4.పరిపూర్ణం
ఈశావాశ్యోపనిషత్:శాన్తిమన్త్రం: "ఓంపూర్ణమదః పూర్ణమిదం, పూర్ణాత్పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణమేవావశిష్యతే"- సృష్టిప్రారంభమునగల ఆత్మపూర్ణ స్వరూ పము. విశ్వము ఆత్మయొక్క ఖండస్వపముకాదు. సృష్ట్యాదియందు సంపూర్ణ స్వరూపము గాగల ఆత్మనుండి, పూర్ణస్వరూపముగా స్థావరజంగమాత్మకవిశ్వము సృజియింపబడినదని చెప్పబడు చున్నది. పూర్ణమునుంచి పూర్ణముతీసివేసిననూ పూర్ణమేశేషించును. (పరిపూర్ణ మైన పరబ్రహ్మ నుండి పూర్ణమైన ప్రకృతి బయటకు వచ్చిననూ, పరబ్రహ్మ పరిపూర్ణుడే). ఆత్మ అవ్యయము.
శ్రీమద్భగవద్గీత:సాంఖ్యయోగం:16: "నాసతోవిద్యతేభావో, నాభావోవిద్యతే సతః, ఉభయో రపిదృష్టో~ న్తః త్వనయోస్త్వదర్శిభిః" - అసద్వస్తువునకు ఉనికియేలేదు. సత్తు అనుదానికి లేమియే లేదు. ఈవిధముగా ఈరెండిటియొక్క వాస్తవరూపములను తత్త్వజ్ఞానియైన వాడే ఎరుంగును.
వివేకచూడామణి:242: "అహేయమనుపాధేయం మనోవాచామగోచరం, అప్రమేయ మను ద్యస్తం, బ్రహ్మపూర్ణమహంమహః" - విడువశక్యముకానిదియు, గ్రహింపశక్యము కానిదియు, మనో వాక్కులకు గోచరము కానిదియు, కొలుచుటకు వీలులేనిదియు, ఆద్యంతరహితమైన తేజోరూపి యునగు పరబ్రహ్మమునేనేను.
పైన పరబ్రహ్మముయొక్క పరిపూర్ణత్వము వర్ణింపబడినది. సమాధ్యావస్థలో పరబ్రహ్మ యొక్క పరిపూర్ణత్వము సర్వచైతన్యరూపములో అనుభవములోనికివచ్చును. ఆపరిపూర్ణ త్వమును అనుభవించి, శాంతచిత్తుడై సద్గురువుండును. అందువలన సద్గురువుకూడా పరిపూర్ణుడే.
5. పరమానన్దమ్
తైత్తిరీయోపనిషత్:3.6: "ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్, అనందాద్ద్యేవఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేనజాతాని, జీవంతి, ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి" - ఆనందము బ్రహ్మ మని గ్రహించితిని. ఆనందము బ్రహ్మస్వరూపము. ఆనందమునుంచే నిజముగా ఈసర్వజీవ రాసులు పుట్టుచున్నవి. ఆనందముచే పుట్టినజీవరాసులు జీవించుచున్నవి. ఆనందములో ప్రవేశించి లయమగుచున్నవి.
2.5.: "తస్మాద్వా ఏతస్మాద్విజ్ఞానమయాత్, అన్యోన్తరఆత్మానన్దమయా"- ఆవిజ్ఞానమయుని కంటె భిన్నమైనవాడై, ఆవిజ్ఞానమయుని కంటిలోపలనున్న ఆత్మ ఆనంద మయమైనది.
"తస్యప్రియమేశిరః, మోదో దక్షిణపక్షః ప్రమోద ఉత్ర్తరపక్షః, ఆనన్ద ఆత్మా, బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా" - (ఆనన్దమయుని అవయవకల్పన) ఆఆనందమయాత్మకు ప్రియవృత్తియే శిరస్సు, మోదవృత్తియే దక్షిణపక్షము, ప్రమోదవృత్తియే ఉత్తరపక్షము, ఆనందమే ఆత్మ, బ్రహ్మమే ప్రతిష్ఠ..
2.6: "రసోవైసః" - నిశ్చయముగా అతడు ఆనందమే.
2.7: "ఏషహ్యేవానన్దయాతి" - నిశ్చయంగా అతడు ఆనందాన్నిస్తున్నాడు.
2.8: "ఏతమానన్దమయాత్మానముపసంక్రామమితి" -విద్వాంసుడు ఆఆనంద మయాత్మను పొందుతాడు.
చాంధోగ్యోపనిషత్:4-10-5: "ఓంకంబ్రహ్మ, ఖంబ్రహ్మ" - ఓం సుఖంబ్రహ్మ, ఆకాశ వ్యాపకం బ్రహ్మ.
వివేకచూడామణి:352: "నిత్యాద్వయాఖండచిదేకరూపో బుధ్ద్యాదిసాక్షీ సదసద్విలక్షణః, అహంపదప్రత్యయలక్షితార్ధః,ప్రత్యక్సదానందఘనఃపరాత్మా"-పరమాత్మనిత్యముద్వైతరహితము (ఏకము), పరిచ్ఛిన్నముకానిది(పరిపూర్ణము), జ్ఞానప్రకాశములే ముఖ్యమైన స్వరూపముగా కలది, బుద్ధిమొదలైన అంతరేంద్రియములకు సాక్షి, (అవిచేయుపనులు తెలియుచూ, అవి పొందకుండా వున్నది), సత్తగు కారణమునకు (మాయోపాధికుడగు ఈశ్వరునకు), అసత్తగు కారణమునకు (అవిద్యోపాధియగు జీవజగత్తులకు) విలక్షణమైనది, 'అహం' అనుపదముచే బోధితమైన జ్ఞానముచే(నేనను జ్ఞానముచే) సూచింపబడిన అర్థరూపమైనది. అన్తరాత్మ సర్వకాలసర్వావస్థలయందు ఆనందఘనమైనది.
పైవాటినన్నంటినీ గమనించినచో, భౌతికప్రపంచమునకు సబంధించని, వేరే ఆనందం గురించి తెలుస్తుంది. అది సమాధ్యవస్థలో జీవబ్రహ్మైక్యస్థితిలో కలిగే ఆనందం. ఒక్కపరబ్రహ్మ వలననే ఆ ఆనందం లభిస్తుంది. ఆఆనందం అనుభవిస్తూనే శ్రీత్యాగరాజుల వారు "రమించు వారెవరురా, రఘూత్తమా నినువినా" ఓరామచంద్రా! నీకన్నా ఆనందం పొందించేవారెవరు? అని కీర్తించారు. సద్గురువు ఈఆనందం తాను పొందడమేకాకుండా, ఆశ్రితశిష్యులచేత కూడా పొందిస్తాడు. కాబట్టి సద్గురువును "పరమానందస్వరూపం" అనడంలో ఎంతో ఔచిత్యంవుంది.
6. పురుషోత్తమమ్
కఠోపనిషత్:64: "ఇంద్రియేభ్యఃపరాహ్యర్థా అర్ధేభ్యశ్చ పరంమనః, మనసస్తు పరాబుద్ధి బుద్ధేరాత్మా మహాన్పరః॥ మహతః పరమవ్యక్తమవ్యక్తా పురుషంపరః, పురుషాన్నపరం కిచిత్ సాకాష్ఠాసాపరాంగతిః॥" - ఇంద్రియములకంటె ఇంద్రియార్థములు గొప్పవి. ఇంద్రియార్థముల కంటే మనస్సు గొప్పది. అహంకారము, చిత్తము, మనస్సు కంటె బుద్ధి గొప్పది. బుద్ధికంటె మహత్తు గొప్పది. మహత్తత్త్వముకంటే అవ్యక్తము గొప్పది. అవ్యక్తముకంటె పురుషుడు (బ్రహ్మము) గొప్పవాడు. ఆపురుషునికంటె ఏదియూ గొప్పదిలేదు. ఆస్థానమే ఉత్కృష్ఠము. అదే పరమాగతి.
శ్రీమద్భగవద్గీత:పురుషోత్తమప్రాప్తియోగం:18: "యస్మాత్ క్షరమతీతో~ హమక్షరాదపి చోత్తమః, అతోస్మిలోకేవేదేచప్రథితః పురుషోత్తమః" - నశ్వరమగు జడవర్గము(క్షేత్రము) కంటెను నేను అతీతుడను. నాశరహితమైన జీవాత్మకంటెను ఉత్తముడను. కనుక ఈజగత్తునందును, వేదములయందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కితిని.
బృహదారణ్యకోపనిషత్:2-5-1: "యశ్చాయమస్యా పృథివ్యాం తేజోమయః అమృతమయః పురుషోశ్చాయ మధ్యాత్మగ్ం శరీరస్తేమయో~మృతమయః పురుషోయమేవ సయోయ మాత్మా" - పృధివియందు తేజోమయుడు, అమృతమయుడు అయిన ఏపురుషుడున్నాడో, శరీరమండు తేజోమయుడు, అమృతమయుడు అయిన ఏజీవుడైయున్నాడో, అతదే ఆత్మ.
కఠోపనిషత్:2-4-12: "అంగుష్ఠమాత్ర పురుషోమధ్యఆత్మని తిష్ఠతి, ఈశానోభూతభావస్య ఏవాద్యస ఉశ్వః ఏతద్వైతమ్" - (యముడు నచికేతునితో) చేతిబొటనవ్రేలంత పరిమాణంకల పురుషుడు శరీరమధ్యంలో వున్నాడు. అతడు భూతభవిష్యద్వర్తమానాలలో కూడ వున్నాడు. నీవు నన్ను అడిగింది ఇదే.
పురముఅనే ఉపాధియందు వసియించి పరబ్రహ్మ పురుషశబ్దవాచ్యుడైనాడు. సర్వ శరీరములు ఆత్మతో కూడియున్నందున అవియన్నియూ పురుషశబ్దవాచ్యములే. ఆప్రకారము గా జంతువులు, స్త్రీలు కుడా పురుషశబ్దవాచ్యములే. తెలుగుభాషలో మాత్రమే పురుషుడంటే మగవాడు. ఆత్మ, పరబ్రహ్మములే పురుషసబ్దవాచ్యములు. ఆత్మను పురుషశబ్దముగా గైకొన్నచో, పరమాత్మానుభవమును పొందిన ఆత్మను 'పురుషోత్తమం' అనవచ్చును. కావున ఆఅనుభవమును పొందిన సద్గురువు నిశ్చయముగా 'పురుషోత్తముడే!"
7. అవ్యక్తంవ్యక్తం
శ్రీమద్భగవద్గీత:విజ్ఞానయోగం:24: "అవ్యక్తంవ్యక్తమాపన్నం మన్యంతేమామబుద్ధయః, పరంఅభావమజానంతో మామవ్యయమనుత్తమమ్" - నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపనివాడను(అవ్యక్తుడను). నాపరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక నన్ను సాధారణమనుష్యునిగా(వ్యక్తముగా) తలెచెదరు.
వివేకచూడామణి:513: "అవ్యక్తాదిస్థూలపర్యంతమ్ తత్విశ్వం యత్రాభాసమాత్రమ్ ప్రతీతమ్, వ్యోమప్రఖ్యం సూక్ష్మమధ్యాన్తహీనం బ్రహ్మాద్వైతం ద్యత్తదేవాహమస్మి" - ఏవస్తువు నందుఅవ్యక్తము (సూక్ష్మమగు మూలప్రకృతి) మొదలుకొని వ్యక్తమై స్థూలమువరకూ గల (పరమాణువు మొదలు కొని పర్వతాదులవరకును, మహాపరిమాణముగల గగనము వరకూ గల) ఈప్రత్యక్ష సిద్ధమైన (నిజముగా తోచుచున్న) సంకల్పసిద్ధప్రపంచము ఉన్నట్లుగా తోచు చున్నదో, ఏఅఖండపరిపూర్ణ బ్రహ్మము గగనముతో సమానమై సూక్మమైనదో, ఆద్యన్తములు లేనిదో, రెండవది లేనిదై కేవల స్వరూపమైయున్నదో, పూర్వోక్తవిశేషణవిశిష్ఠ, నిర్వికార, నిరామయ, నిరంజన, నిరూప, నిష్కలంక, నిరుపమ, నిర్మల పరబ్రహ్మమే, కేవల చైతన్యాత్మకుడగు 'నేను' అగుచున్నాను.
కైవల్యోపనిషత్: "అచిన్త్యమవ్యక్తమనన్తరూపం శివం ప్రశాన్తమమృతం బ్రహ్మయోనిం, తథా~~దిమధ్యాన్త విహీనమేకం ద్విభుంచిదాననదమరూపమద్భుతమ్" - ఊహకందనిది, మంగళకరమైనది, త్రిగుణరహితమైనది, శాంతత్వముకలది, శాశ్వతము, జగత్కారణము, ఆది మధ్యాంతరహితమైనది, అద్భుతము, వ్యక్తముకానిది, అనన్తరూపముగా ఉన్నది, ఆత్మ (పరబ్రహ్మము).
కఠోపనిషత్:108, 109: "ఇంద్రియేభ్యపరంమనో, మనసఃసత్త్వముత్తమం, సత్త్వాదధి మహానాత్మా, మహతో~వ్యక్తముత్తమం, అవ్యక్తాత్తోపరఃపురుషో వ్యాపకో~లింగ ఏవచ, యత్ జ్ఞాత్వా ముచ్చతే జన్తురమృతంచగచ్చతి" - ఇంద్రియములకంటె మనస్సు శ్రేష్ఠమైనది, ఆ మనస్సు కంటె సత్త్వము అనగా బుద్ధిశ్రేష్ఠమైనది. ఆమహదాత్మకంటె సర్వకారణమగు అవ్యక్తము శ్రేష్ఠ మైనది. ఆవ్యక్తముకంటె పరమైనవాడు పురుషుడు. అతడు సర్వవ్యాపకుడు. అలింగుడు. అట్టివానిని తెలిసికొనినవాడు సంసారబంధమునుండి విముక్తుడై అమృతత్త్వమును పొందుచున్నాడు.
ఇచ్చట పరబ్రహ్మకు గల అవ్యక్తవ్యక్త, అనగా, నిరాకారసాకారస్వరూపములయొక్క విచారణ జరిగింది. పరబ్రహ్మస్వరూపము ఎల్లప్పుడూ నిరాకారస్వరుపమే! అది తనంతతాను ఏమియూ చేయదు ఏదైనా చేయించాలంటే, మహత్తును, అహంకారాన్ని, తద్వారా 'విరాట్'ను ప్రేరే పిస్తుంది. అప్పుడు 'విరాట్' అయిన 'గర్భోదకశాయి విష్ణువు' స్పందించి, తదనుగుణ సాకార స్వరూపాన్ని ధరించి ఆపని పూర్తిచేస్తాడు. "యదాయదాహిధర్మస్య" అనే శ్లోకార్థము ఇదే. ఇంకాకొంచెం లోతుగా చూస్తే, సృష్ఠి, ప్రకృతికిసంభంధించినవేమియూ పరబ్రహ్మవద్దకు రా జాలవు. మహాప్రళయంలో కూడా ఆసమయంలో అజ్ఞానములోవున్న సర్వజీవరాశులు, రాళ్ళు, రప్పలు, పర్వతా లతోసహా అన్నీ పంచభూతాలలోనూ, అవి సూక్ష్మపంచ భూతాలలోనూ, అవి విరాట్లోనూ, విరాట్ అహంకారం లోను, అహంకారం మహత్తులోను లయ మవుతాయే తప్ప, మహత్తు లోంచి పరబ్రహ్మలో లయమవ్వవు. ఎందుకంటే ఆప్రకారంగా లయమయ్య జీవరాశులలో 'బ్రహ్మజ్ఞానము' లేదు కనుక. ఒక్క 'బ్రహ్మవేత్త' మాత్రమే నేరుగా ఎటువంటి అడ్డంకిలేకుండా పరబ్రహ్మలో నిరవశేషంగా లయం పొందుతాడు. (ఈవిషయాన్ని www.tatvavisleshana.weebly.comలో 'ప్రాణోత్క్రమణం'లో విపులంగా చర్చించడ మైనది.) మరలా సృష్ఠిప్రారంభమయ్యే దశలో లోగడ లయంచెందిన విధంగా మహత్తునుండి అహంకారం, విరాట్, సూక్ష్మపంచభూతాలలోంచి భౌతికపంచభూతాల్లోకి, వాటిలోంచి మరలా ప్రకృతి, అన్నీ సృష్ఠించబడతాయి.
కాని సద్గురువుమాత్రం ఒకేసారి అవ్యక్తంలోను, వ్యక్తంలోను కూడా వుండగలడు. దీనికి సరియైన ఉదాహరణ శిష్యులసందేహనివృత్తి. ఆశ్రితశిష్యులు సందేహాలు అడిగినప్పుడు, ఆవశ్యకతను బట్టి, వెంటనే ధ్యానస్థితిలో సమాధిలో ప్రవేశిం చి, సంబంధిత వివరాలు తెలుసు కొని, శిష్యులసందేహాలు అనుభవపూర్వకముగా తీరుస్తారు. (ఇటువంటివి సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీగారు పలుమారులు చేశారు. కొన్నిఉదాహరణలు 'ఒకయోగి ఆత్మకధ' లో కూడావున్నాయి.) దీనినిబట్టి సద్గురువులు స్వయముగాను, ప్రయత్న పూర్వకముగాను, ఒకేసమయంలో అవ్యక్తములోను, వ్యక్తముగా కూడా వుండగలరని విశద మగుచున్నది. కాబట్టి సద్గురువులను 'అవ్యక్తంవ్యక్తం' గా భావించవలసి యుంటుంది.
8.మహత్త్వం, తత్త్వం
సర్వసారోపనిషత్:19: "నైవంభవామ్యహం దేహేనైంద్రియాణిదశైవతు, నబుద్ధిర్మన ఈశశ్చ నాహంకారస్తదైవచ, అప్రాణోహ్యమనాశ్శుభ్రోబుధ్యాధీనాంహి సర్వదాసాక్ష్యహం, సర్వదా నిద్యస్చి న్మాత్రో ~హం నసంశయః, నాహంకర్తా నైషభోక్తా ప్రకృతేస్సాక్షిరూపకః, మత్సాన్నిధ్యా త్ప్రవర్తన్తే దేహోద్యా అజడాయివ, స్థాణుర్నిత్యస్సదానంద శ్శుద్ధోజ్ఞానమయో~ మలః ఆత్మాహం సర్వ భూతానాం విభుస్సాక్షీనసంశయః, బ్రహ్మైద్వాహం సర్వవేదాంతవేద్యం నాహంవేద్యం వ్యోమ వాతాది రూపమ్, రూపంనాహం, నామనాహం, నకర్మర్హ్మైవాహగ్ం, సచ్చిదానంద రూపమ్, నాహందేహో జన్మమృత్యుకుతోమే, నాహంప్రాణం క్షుత్పిపాసేకుతోమే, నాహంచేత శ్శోకమోహౌ కుతోమే, నాహం కర్తా బన్ధమోక్షాకుతోమేత్సుపనిషత్" - నేను శరీరమునుగాను, దశేంద్రియ ములనుగాను, బుద్ధి, మనస్సు, ఈశ్వరుడనుగాను. అదేరీతిగా అహంకారముకూడాగాను. నేను ప్రాణరహితుడను, మనోరహితుడను, పరిశుద్ధుడను, బుద్ధ్యాదులకు సర్వదాసాక్షి భూతుడను. నేను సదానిత్యు డను, చిన్మాత్రుడను. ఇందులో సందియములేదు. నేను కర్తను గాను, భోక్తనుగాను, ప్రకృతికి సాక్షిరూపముగానుందును. నాతోకలసియున్నందున, దేహాదులు చైతన్యవంతలై కార్యములు చేయుచున్నవి. నేను నిశ్చలుడను, నిత్యుడను, సదాఆనంద స్వరూపుడను, శుద్ధుడను, జ్ఞానమయుడను, నిర్మలుడను, సర్వభూతములయొక్క ఆత్మను. సర్వవ్యాపకుడను, సాక్షిని, ఇందులోసందేహములేదు. సర్వవేదాంతవేద్యమగు బ్రహ్మమును నేను. నేను అజ్ఞేయుడను. ఆకాశాది పంచభూతములు నేనుకాను. నేను నామములనుకాను. కర్మలనుకాను. సచ్చిదానంద మయమైన బ్రహ్మమునేనేను. నేను దేహమునుకాను, జనన మరణములు నాకెట్లు? నేను ప్రాణమును కాను, ఆకలిదప్పికలు నాకెట్లు? నేను చిత్తమును కాను, శోకమోహములు నాకెట్లు? నేనుకర్తను కాను, బంధమోక్షములు ఇకనాకెక్కడవున్నవి.
నాదబిందూపనిషత్:22: "ఉత్పన్నేచాత్మవిజ్ఞానే ప్రారబ్దంనైవముంచతి, తత్త్వజ్ఞానో దయా దూర్ధ్వం ప్రారబ్దంనైవవిద్యతే" - ఆత్మవిజ్ఞానము కల్గినంతలో ప్రారబ్దము వదలదు. తత్త్వజ్ఞానో దయమైన పిమ్మట ఇక ప్రారబ్దముండదు.
అన్నపూర్ణోపనిషత్:4-11: "సంవిత్తత్త్వేకృతధ్యానో నిదాఘ యదితిష్ఠసి, తద్యత్నేనాధి కేనోచ్చైరాదయసితతదం వాసనాసంపరిత్యాగే యదియత్నంకరోషిభో, యావద్విలీనం నమనో నతా వద్వాసనాక్షయః, సక్షీణావాసనాయావత్ చిత్తంతావన్నశామ్యతి, యావన్నతత్త్వవిజ్ఞానం తావచ్చిత్తశమః కుతఃయావన్నచిత్తోపశమో, తవతత్త్వవేదనమ్, యావన్నాసనానాశస్తావ తత్త్వాద్గమఃకుతః, యావన్నతత్త్వం సంప్రాప్తిర్నతావద్వాసనాక్షయః, తత్త్వజ్ఞానం మనోనాశో వాసనాక్షయ ఏవచ" - ఋభువు చెప్పుచున్నాడు. ఓనిదాఘా! సంవితత్త్వమున ధ్యానము కల్గి యున్నచో అధికప్రయత్నముతో ఆపదవిని పొందగలవు. వాసనాపరిత్యాగమునందు ప్రయత్నముచేసిన, మనస్సు ఎంతవరకూ విలీనముకాదో, అంతవరకూ వాసనాక్షయముకాదు. వాసనక్షీణించువరకూ చిత్తముపశమింపదు (వాసన = విషయపదార్థ సంగ్రహణము). తత్త్వ విజ్ఞానము రానంతవరకు చిత్తశాంతి ఎక్కడిది? చిత్తోపశాంతి కల్గునంతవరకు తత్త్వవేదనము కాదు. వాసనానాశమగునంతవరకూ తత్త్వజ్ఞానమెట్లు కలుగును? తత్త్వజ్ఞానము వచ్చువరకు వాసనాక్షయమెట్లు కల్గును? కావున, తత్త్వజ్ఞానము, చిత్తనాశము, వాసనాక్షయము పరస్పర కారణములై, దుస్సాధ్యములై యున్నవి.
ఆధ్యాత్మోపనిషత్:7: "మాయోపధిర్జగద్యోని సర్వజ్ఞత్వాదిలక్షణః పారోక్ష్యశ్శబళ స్సత్వా ద్యాత్మకస్తత్పదా~భిదః, ఆలంబనతయాభాత్య స్మత్ప్రత్యయశబ్దయోః, అన్తఃకరణసంభిన్నబోధ సత్వా~పరాబిధః, మాయా~విద్యేవిహాయైవ ఉపాధిపరజీవయోః అఖండం సచ్చిదానందం పరబ్రహ్మవిలక్ష్యతే" - మాయోపాధికత్వము, జగత్కారణము, సర్వజ్ఞత్వము, పరోక్షధర్మ విశిష్ఠత్వము మున్నగునవి పరమాత్మకు తటస్థలక్షణమును, స్వరూపలక్షణమును నగును. అట్టి లక్షణముగల పరమాత్మ మహావాక్యములోని 'తత్' పదవాచ్యార్థముగానగును. అంతఃకరణ సహితుడై అహంతత్త్వమునకు ఆధారవిషయముగా ఆ చిదాభాసుడు(జీవుడు) ప్రకాశించు చున్నాడు. "త్వమ్" అనగా చిదాభాసుడగు జీవుడే! జీవుడు బ్రహ్మముయొక్క ప్రతిబింబమే. ఈశ్వరుడు 'మాయ' శరీరముగాకలవాడు. జీవుడు 'అవిద్య' శరీరముగాకలవాడు. ఈశ్వరోపాధి యగు మాయను, జీవోపాధియగు అవిద్యను త్యజించినయెడల అఖండ సచ్చిదానంద రూపమగు పరబ్రహ్మము యొక్క దర్శనమగును.
వివేకచూడామణి:243: "తత్త్వంపదాదాభ్యామభిదీయమానయోర్బ్రహ్మాత్మనోశ్శోధితయోర్యదీ త్థమ్, శ్రుత్యా తయోస్తత్త్వమసీతి స్మ్యగేకత్వమేవప్రతిపాద్యతేముహు:" - 'తత్', 'త్వం' అను పదములచేత చెప్పబడుచున్న బ్రహ్మస్వరూపులైన జీవాత్మపరమాత్మలు ఈప్రకారముగా (లక్షణా వృత్తిననుసరించి యభేదముతో) బాగుగా పరిశోధింపబడినవారలుకాగా, ఆజీవేశ్వ రులకు 'తత్త్వమసి' (ఆబ్రహ్మము నీవు అయితివి) అను వేదవాక్యముచేత ఐక్యమే లెస్సగా మాటిమాటికీ ప్రతిపాదించబడుచున్నది.
దక్షిణామూర్త్యుపనిషత్: "వైరాగ్యతైలసంపూర్ణే భక్తివర్తిసమన్వితే, ప్రభోధపుర్ణపాత్రేతజ్ఞప్తిదీపం విలోకయేత్" - ఆత్మవిచారణయను ప్రమిదలో వైరాగ్యమను తైలమునుపోసి, అనన్యభక్తి యనెడు వత్తినియుంచి, బ్రహ్మమేనేనను ప్రజ్ఞాదీపమును వెలిగించవలెను.
'మహత్తు' అనేది మొదటగా అవ్యక్తముగానున్నటువంటి పరబ్రహ్మములోనుండి విడివడిన సత్త్వస్వరూపము. తదుపరి 'తత్త్వం' అనుపదమునకు విచారణ జరిగినది. 'తత్' అనగా పర బ్రహ్మము. 'త్వమ్' అనగా జ్ఞానవంతుడైన జీవుడు, అనగా ఆత్మ. ఆత్మే అజ్ఞానంలో వుంటే జీవుడనబడుతుంది. జ్ఞానంపొందగానే, స్వస్వరూపం తెలిసికొని ఆత్మ అవుతుంది. తదుపరి తత్త్వ విచారాన్ని, అనగా పరబ్రహ్మవిచారాన్ని కొనసాగించి, క్రమేణా 'త్వం' అనబడే ఆత్మ 'తత్' అనగా పరబ్రహ్మగా పరిణమిస్తుంది. అప్పుడు 'తత్త్వం' అవుతుంది. ఈవిచారణనే 'తత్త్వ విచారణ' అంటారు. 'తత్త్వం' అన్నదానికి మహావాక్యముల అర్థములే యదార్థములు తప్ప మరియొకటికాదు. కాబట్టి పరబ్రహ్మవిషయికజ్ఞానం పొందాలంటే, తత్త్వవిచారణే సరియైన మార్గం. అందుకే "ఉత్తమం తత్త్వ చింతనమ్" అన్నాఋఉ. మనకు తత్త్వవిచారణలో గజేంద్రుడే మార్గదర్శి. (ఈవిషయాలను www.tatvavisleshana.weebly.com లో 'గజేంద్రమోక్షము - తత్త్వవిచారణ - ఒకపరిశీలన' లో చర్చించడమైనది.)
అందువలన పరబ్రహ్మాన్ని సులువుగా అందించే తత్త్వవిచారాన్ని ఆశ్రితశిష్యులలో పాదుగొల్పే సద్గురువును "మహాతత్త్వం, తత్త్వం" అనడంలో ఎటువంటి మీమాంస లేదుకదా!
9. అహంకారం
పైంగలోపనిషత్ ప్రకారం సృష్టికిపూర్వం పరమాత్మ ఒక్కడేవున్నాడు. ఆపరమాత్మలోనే సకలము సంకుచితవస్త్రమువలె దాగివున్నది. ఆపరమాత్మనుండి రజోగుణముతో నుద్రిక్తమైన మహత్తు ఏర్పడెను. ఆమహత్తునందు ప్రతిఫలించిన బ్రహ్మము హిరణ్యగర్భచైతన్యముగా నుండెను. అందుండి తమోగుణాద్రిక్తమగు అహంకారము పుట్టెను. ఈఅహంకారము అంతః కరణలలోవుండే అహంకారముకాదు. ఈఅహంకారములో పరబ్రహ్మయొక్క ఆంశదాదాపుగా పూర్తిగా వుంది. కొద్దితేడా మాత్రమే వుంటుంది. ఈఅహంకారము పరబ్రహ్మలో తొలుదొల్త రేకెత్తిన 'నేనెవరిని' అన్న వికారమే! ఆవికారఫలితముగా పరబ్రహ్మనుండి మహత్తు, అహంకారము విడివడి తదుపరి సృష్టికార్యమునకు నాంది పలికినవి.
10. పంచభూతాత్మికం
పైవిధముగా ఏర్పడిన అహంకారమునందు ప్రతిఫలించిన పరబ్రహ్మము 'విరాట్' అను చైతన్యమై యుండెను. దానినుండి గర్భోదకశాయి అయిన శ్రీమహావిష్ణువు పుట్టెను. (ఈయన మన త్రిమూర్తులలోని విష్ణువుకాడు). ఈయననుండి సూక్ష్మపంచభూతములు పుట్టెను. ఇవి చైతన్యాత్మకమైనవి. వీటిలోంచే భౌతికపంచభూతములు, మిగిలిన సృష్టి వచ్చినవి. ఇక్కడ నుదహరించిన పంచభూతములు భౌతికమైనవి కావు, చైతన్యరూపమైనట్టివి.
11. శేషసంజ్ఞాత్మికం
మహోపనిషత్:4-8: "ఋతమాత్మా పరంబ్రహ్మ సత్యమిత్యాదికా బుధై కల్పితావ్యవహారార్థం యస్య సంజ్ఞా మహాత్మనః" - ఆత్మ, ఋతము, సత్యము, పరబ్రహ్మము అను పదములు పరబ్రహ్మమునకు వ్యవహారసంజ్ఞలు. వీనిని మహాత్ములు వ్యవహారార్థము కల్పించి ఏర్పరిచిరి.
సంజ్ఞ అనగా గుర్తు లేక నామము. శేషసంజ్ఞాత్మికం అంటే సంజ్ఞలను శేషించినది అని భావం. పరబ్రహ్మము అనామి, అవ్యక్తం, అవ్యయం. కాబట్టి దాన్ని గుర్తించడానికి కొన్ని వ్యవహార నామములు లేదా గుర్తులు కల్పించుకొనవలసి వచ్చినది. అందువలన మహాత్ములు పైవాటిని కల్పించి మనకు అందించారు. వీటిని ఉపయోగించుకొని, తత్త్వవిచారణచేసి, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలిసికొని, అనుభవాన్ని పొందినపిమ్మట, సంజ్ఞామాత్రమైన ఆనామములతో పనిలేదు. వాటిని విసర్జించవలసినదే. అందువలన పరబ్రహ్మము శేషసంజ్ఞాత్మిక మైనది. ఈభావాన్నికలిగించే సద్గురువునకు కూడా ఈనామము వర్తిస్తుంది. ఎప్పుడైతే సద్గుతత్త్వము పరబ్రహ్మానుభవము కలిగిస్తుందో, అప్పుడు సద్గురునామము పోయి పరబ్రహ్మ మాత్రమే శేషిస్తుంది, అనగా మిగులుతుంది.
12.సచ్చిదానందం, నిత్యనిర్మలం
చాందోగ్యోపనిషత్:4-15-1: "యఏషో~క్షిణిపురుషోదృశ్యతో ఏషఆత్మేతిహోవాచ, ఏతదమృత మభయమే తద్బ్రహ్మ తద్యస్మిన్ సర్పెర్వుదకంవాసించతి వర్త్మనే ఏవగచ్చతి" - ఈకంటియందు కనిపించె పురుషుడు ఆత్మ. అతడు అమృతుడు, అభయుడు. అతడే బ్రహ్మ. నేతినిగాని, నీటినిగాని ఇతనియందు పోస్తే అవి అతనికి అంటకుండా ప్రక్కలకుపోతాయి. నేయిగాని, నీరుగాని అతనికి అంటకుండా ప్రక్కలకుపోవడం అంటే, అతనికి పాపాలు అంటవు అని చెప్పడానికే.
ముండకోపనిషత్:2-2-9: "హిరణ్మయేకోశే విరజం బ్రహ్మనిష్కలమ్, తచ్ఛుబ్రమ్ జ్యోతిషాం జ్యోతిస్తద్యదాత్మ విదోవిదుః" - ఆనిర్మలమైన, కలారహితుడైన బ్రహ్మ జ్యోతిర్మయమైన పరమ కోశంలోవున్నాడు. అతడు శుద్ధమైనవాడు. ఆతువంటివానినిగానే అత్మజ్ఞానులు అతనిని తెలుసుకొంటున్నారు.
బృహదారణ్యకోపనిషత్:4-3-12: "అనన్యానుగతం పుణ్యేనానన్వాగతం, పాపేన తీర్ణోహి తదాసర్వాన్ శోకాన్ హృదయస్యభవతి" - ఆతత్త్వానికి పుణ్యపాపాలు అంటవు. ఎందుచేత నంటే, సుషుప్తిలో హృదయంలో ఉంటూనే సమస్తశోకాలూ లేనివాడౌతాడు.
4-3-14: "అనన్వాగతస్తేన భవత్యసంగోహ్యంపురుషః" - అతడు భోగయుక్తుడు కాడు. ఈఆత్మ అసంగుడు.
తేజబిందూపనిషత్:6-1-4: "సర్వగ్ం సచ్చిన్మయంవిద్ది సచ్చిన్మయంతతమ్, సచ్చిదానంద మద్వైతగ్ం సచ్చిదానందమవ్యయమ్, సచ్చిదానందమాత్రగ్ంహి, సచ్చిదానందమన్యకం, సచ్చిదానందరూపో~హగ్ం సచ్చిదానంద మేవఖమ్, సచ్చిదానందమేవత్వగ్ం సచ్చిదానంద కో~ స్మ్యహన్ మనోబుధ్యహంకార చిత్తసంఘాతకాహ్యామీ, నత్వం, నాహం, నచాన్యంవా సర్వం బ్రహ్మైవ కేవలం నవాక్యం నపదంవేదం నాక్షరం నజడంక్వచిత్" - ఋభుమహర్షి చెప్పు చున్నాడు. సర్వప్రపంచము సచ్చిదానందము. అద్వైతము, అవ్యయము, సచ్చిదానంద మాత్రము, సచ్చిదానందరూపము, ఆకాశము. నీవు, నేను సచ్చిదానందము. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, నీవు, నేను, మరొకరు లేరు. సర్వముకేవలము బ్రహ్మమే. వాక్యము, అక్షరము, జడము ఏమియూలేదు.
శంకరసూక్తి: "అన్యో~సావహమన్యో~స్మీత్యుపాస్తే యో~దేవతాం, నసవేదోనరోబ్రహ్మ నశవేదో న్యధాపశుః" - ఏమూఢజనుడు సర్వదా స్వయంప్రకాశమున సచ్చిదానందాత్మక, నిష్కలంక నిర్వికార పరబ్రహ్మస్వరూపమయ్యు, తననిరవధికానందరూప విశృంఖలత్వసర్వాత్మ భావత్వ మును తెలిసికొనజాలక బ్రహ్మోపాసన విడనాడి ఇతర దేవతోపాసన చేయుచున్నాడొ, అతడు బ్రహ్మమునెరుంగజాలక పశువగును.
ఇచట మరియొకసారి పరబ్రహ్మయొక్క నిర్మలసచ్చిదానందస్వరూపమును తెలియజేయు చున్నారు. ఎప్పుడైఅతే ఆత్మ బ్రహ్మీభావభూతమవుతుందో, అప్పుడు నిర్మలచైతన్యానంద స్వరూపుడౌతాడు. అప్పుడతనికి ఏవిధమైన కలంకము అంటదు. అప్పుడు తనఆత్మలోనే కాకుండా, సకల చరాచరప్రపంచ మంతటా, అణువణులోను ఆనిర్మలచైతన్యానందాన్ని దర్శించి, అనుభవిస్తాడు. శ్రీవల్లభాచార్యులు తన 'మధురాష్టకం'లో వర్ణించింది ఈస్థితినే. మధువంటే ఆనందమని, మధురాధిపతి అంటే ఆనందానికి అధిపతి అని అర్థం. దీనిని తెలిసికొనక ఇతరమార్గములు పట్టినవారిని పశువన్నారు. ఇటువంటి ఆనందస్వరూపాన్ని నిత్యమూ అనుభ వించుచూ, శిష్యులచేతకూడా అనుభవింపజేసే సద్గురువు "నిత్యనిర్మల సచ్చిదానందస్వరుపమే!"
13.సృష్ఠిస్థితిలయతిరోధానుగ్రహమహాకారణమ్
ప్రతీపనికి ఒకకారణముంటుంది. మనం ప్రకృతిలోగమనించే, పుట్టుక, వుండుట, పెరుగుట, మరణించుట, ఇవికాకుండా, తిరోధానము అనగా, సృష్టిలోనే లేకుండాపోవుట, అనుగ్రహము అనగా లేనిది ఇచ్చుట, వీటన్నిటికీ పరబ్రహ్మఒక్కడే ఉపాదాన, నిమిత్తకారణ భూతమై యున్నది. అందువలన దానిని మహాకారణము అన్నారు. అలాగుననే, శిష్యులలో జ్ఞానము కలిగించుట, దానినిపెంచుట, సంశయములను నివృత్తిచేయుట, అజ్ఞానమును తిరిగిరాకుండా, సమూలముగా పెకలించివేయుట, అఖండైకరసానుభూతిని, పరబ్రహ్మానుబ్ హవమును అనుగ్రహించుట, వీటన్నింటికీ మహాకారణము సద్గురువు.
14.చిన్మాత్రవిస్తారితమ్
మనకు ధ్యానములోకలిగే మొట్టమొదటి అనుభవము 'ఆత్మదర్శనము'. అది మిణుగురు పురుగు వలె ఒక్కసారి మెరిసిఅదృశ్యమవుతుంది. సాధనచేయగా, చేయగా, అదినిలబడి, చైతన్య వంతమయి, విస్తరించి, దృశ్యమున్నంతమేర, తానేఅయి కనపడుతుంది. దీనిగురించి తదుపరి వచ్చే నామములలో చక్కటి వివరణలున్నాయి. ఇటువంటి చైతన్యవిస్తారితమైన ఆత్మకల సద్గురువు, తన ఎదుటకు వచ్చిన జీవియొక్క ఆత్మపరివేష్ఠనాన్ని (aura), ఆత్మచైతన్యాన్ని గుర్తించి, ఆజీవియొక్క పరిపక్వతను గ్రహించి, తదనుగుణంగా ఉపదేశమిచ్చి, తదుపరిస్థాయికి చేరగలిగేటట్లు చేస్తాడు. అందువల్ల సద్గురువు చినాత్రవిస్తారితుడు.
15. సర్వజ్ఞసర్వవిలోకనమ్
శ్రీమద్భగవద్గీత:కర్మససన్న్యాసయోగం:26: "కామక్రోధవియుక్తానామ్ యతీనామ్ యుత చేతసా, లభితోబ్రహ్మనిర్వాణం వర్తతేవిదితాత్మనా" - కామక్రోధ రహితులును, చిత్తవృత్తులు జయించినవాడునుఅయి, పరబ్రహ్మ పరమాత్మసాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటనూ శాంతపరమాత్మయే గోచరించును.
ఆత్మసంయమయోగము:29: "సర్వభూతస్తమాత్మానం సర్వభూతానిచాత్మని, ఈక్షతేయోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శినః" - సర్వవ్యాపకాత్మమైన అనంతచైతన్యమునందు ఏకీభావస్థితి రూపయోగయుక్తమైన ఆత్మకలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడు ను అగుయోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమైయున్నట్లుగను, ప్రాణుల న్నింటిని ఆత్మయందు కల్పితములుగను భావించును.
31. సర్వభూతస్థితయోమాం భజత్యేకమాస్థితం, సర్వదావర్తమానోపి సయోగిమయివర్తతే" - భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వ భూతములయందును ఆత్మ రూపమున నన్ను భజించును. అట్టియోగి సర్వదా సర్వవ్యవహారములయందు ప్రవర్తించు చున్ననూ, నాయందే ప్రవర్తించుచుండును.
ముండకోపనిషత్:1-1-9: "యఃసర్వజ్ఞ సర్వవిద్యస్య జ్ఞానమయంతపః తస్మాదేతద్బ్రహ్మ నామరూప మన్నంచజాయతే" - సర్వజ్ఞుడు, సర్వవేత్త, జ్ఞానమయమైన తపస్సుకలవాడు అయిన వానివల్ల, హిరణ్యగర్భుడు, ఈనామరూపాలు, అన్నము మొదలగునవి పుడుతున్నాయి.
మండలబ్రాహ్మణోపనిషత్: "సర్వశరీరేషు చైతన్యేకతా ధ్యానమ్" సర్వప్రాణులయందున్న చైతన్యమొకటియేయని భావించుటయే ధ్యానము.
వేదాంతచూడామణి:317: సర్వత్ర సర్వతస్సర్వం బ్రహ్మమాత్రావలోకనైః సద్భావవాసనా దార్థ్వాత్తత్త్రయాలయమశ్నుతే" - అన్నిచోట్లను(అన్నికాలములయందును), అంతటను సమస్తము బ్రహ్మమేయని చూచుటచేత, సత్తగు బ్రహ్మభావముయొక్క ధృఢత్వమువలన ఆమూడున్నూ అనగా సంస్కారభావనాకర్మలు (1జన్మపరంపరాగత సుస్థిరసంస్కారము, 2. అనాత్మభావనలు, 3.తత్కార్యములు)అను మూడున్నూ నాశనమగుచున్నవి.
ఇచ్చట యోగియొక్క అవలోకన, భావనలు ఏరకంగా స్థిరమైయుండునో తెలియజేయు చున్నారు. తాను యోగంలోకూర్చుని తాపీగా పరబ్రహ్మభావనలో మునిగిపోకుండా, ఇతర జీవుల పట్ల ఏరకంగా సమభావన, సహానుభూతివుండాలో చెప్పారు. ఇతరులబాధలను చూసి జాలిపడటం 'sympathy'. ఇతరులబాధలను తనబాధలవలె అనుభవించడం 'empathy' ముందర తనలోని ప్రాణచైతన్యాన్నిగుర్తించి, అనుభవించి, అలాగే ఇతర ప్రాణుల లోని చైతన్యాన్ని దర్శించి, ఆరెండునూ ఒక్కటే అనిభావించడమే సమదర్శనం. ఇదే యోగంలో చరమదశ. దీనినే సర్వత్ర పరబ్రహ్మభావనము, లేదా దర్శనము అంటారు. ఈస్థాయికి వచ్చిన వారినే 'పరమహంసలు' అనికూడా అంటారు. ఈస్థాయిలో వున్న సద్గురువుని 'సర్వజ్ఞ సర్వ విలోకనం' అనడంలో పొరపాటేమియూ లేదుకదా!
16. ధైర్యయశోప్రజ్ఞానవైరాగ్యసత్తాస్ఫూర్తిస్వరూపసర్వాత్మకమ్
ఐతరేయోపనిషత్:3-2: "యదేతద్ హృదయంమనశ్చైతత్, సంజ్ఞానమానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధాదృష్టి, ధృతిర్మతిర్మనీషాజూతిః, స్మృతిఃసంకల్పః క్రతురసుః కామోవశయితి, సర్వాణ్యే యైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి" - ఈహృదయము, మనస్సు, చేతన త్వము, ఈశ్వరత్వము, సమస్త వివేకము, సద్ జ్ఞానము, శాస్త్రజ్ఞానము, సకలము నెరింగెడి జ్ఞానము, ధైర్యము, మనస్సు, మనోధారుఢ్యము, మనోవేదజ్ఞానము, స్మరణము, రూపాదు లను వికల్పములుగా గాంచుట, నిశ్చయము, ప్రాణవృత్తి, ఆశ, స్వాధీనత, అనునవన్నియు ప్రజ్ఞానముయొక్క నామరూపములే యగుచున్నవి.
ఇచట బ్రహ్మభావనపొందినవారు ఎటువంటి గుణములతో వుండాలో తెలియజేశారు. మీరు చక్కగా గమనిస్తే, సద్గురువు సరిగ్గా ఇటువంటి సద్గుణములతో విరాజిల్లుతూవుంటారు.
17. శబ్దబ్రహ్మవిద్యాత్మికమ్
తైత్తిరీయోపనిషత్:1-8-1: "ఓమితిబ్రహ్మ ఓమితేదగ్ంసర్వం, ఓమిత్యేతదనుకృతి హస్మనా ఆప్యోశ్రావయేత్యాశ్రావయన్తీ, ఓమితిసామానిగాయన్తి, ఓగ్ంశోమితి శస్త్రాణిశగ్ంశన్తి, ఓమిత్య థర్వుః ప్రతిగరంప్రతిశృణోతి, ఓమితిబ్రహ్మప్రసౌతిద్, ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి, ఓమితి బ్రాహ్మణః ప్రవక్ష్యన్నాహ బ్రహ్మోపాప్నవానీతి, బ్రహ్మైవోపాప్నోతి" - ఓంఅను అక్షరమే బ్రహ్మ. ఈసర్వ చరాచరజగత్తు ఓంకారమే. యజ్ఞాదివైదిక కార్యక్రమములలొ సమ్మతిసూచకముగా ఓం అని చెప్పుట విదితముకదా! యజ్ఞసమయములో అధ్వరువుఅగ్నినుద్దేశించి హవిస్సులను సమర్పించు సమయమువచ్చినదని తెల్పుము అనిచెప్పుటకు ఓంఅని చెప్పుచున్నాడు. ఓం అనిచెప్పి సామములు పాడుదురు. ఓంఅనిపరికియే శస్త్రములు పఠించుచున్నారు. ఓంఅని పలికియే అధర్వుడు ప్రోత్సాహకరవాక్యములు పలుకుచున్నాడు. ఓంఅనిపలికియే యజ్ఞము చేయించు ముఖ్యఋత్విక్కుడు అనుజ్ఞనిచ్చుచున్నాడు. ఓంఅని పలికియే అగ్నిహోత్రమును చేయుటకుఅనుజ్ఞ నిచ్చుచున్నాడు. ఓంఅని బ్రహ్మణ్యుడు వేదముచదువుటకు ప్రారంభించును.
అమృతబిందూపనిషత్:16: "శబ్దాక్షరం పరబ్రహ్మ, తస్మిన్ క్షీణేయదక్షరం, తద్విద్వానక్షరం ధ్యాయే, ద్యదిచ్ఛేచ్ఛాన్తిమాత్మనః" - పరబ్రహ్మము శబ్దాక్షరము (శబ్దమనెడి వేదము అక్షరము) గానున్నది. ఆశబ్దము సమాప్తినొందినపిదప నేది శేషించుచున్నదో ఆఆక్షరమును ఆత్మశాంతి గోరు విద్వాంసుడు ధ్యానింప వలయును.
17: "ద్వేవిద్యేవేదితత్యేతు శబ్దబ్రహ్మపరంచయత్, శబ్దబ్రహ్మాణినిష్ణాతః, పరంబ్రహ్మాదిగచ్ఛతి” - రెండువిద్యలను తెలిసికొనదగినది. అనగా శబ్దబ్రహ్మమును, పరబ్రహ్మమును చక్కగా తెలుసు కొన్నవాడు పరబ్రహ్మమును పొందుచున్నాడు.
నాదబిందూపనిషత్:30: "బ్రహ్మప్రణవసంధాననాదో జ్యోతిర్మయశ్శివః, స్వయమావిర్భ వేదాత్మా మేఘాపాయేం~శుమానివ" - బ్రహ్మప్రణవముల సంధానమువలన నాదము పుట్టును. అదే జ్యోతిర్మయుడైన శివుడు. మబ్బులు తొలగగానే సూర్యునివలె స్వయముగా ఆవిర్భవించును.
34: "ఆదౌజలధిజీమూతభేరీనిర్ఝరసంభవః, మధ్యే మర్థళశబ్దాభో ఘంటాకాహళజస్తదా" - (సాధన) ప్రారంభములో సముద్రఘోష, మేఘగర్జనము, భేరీనినాదము, నదీప్రవాహశబ్దము వంటి ప్రణవనాదములు వినును. సాధనమధ్యలో మద్దెలశబ్దము, ఘంటానాదము, కాహళశబ్దము వినును.
35:"అంతేంతు కింకిణీవంశవీణాభ్రమరనిస్వనః, ఇతినానావిధనాదాశ్రూయంతే సూక్ష్మ సూక్ష్మతః" - ప్రణవధ్యానముయొక్క అంత్యములో కింకిణీ (చిరుమువ్వలు) నాదము, వేణుగాన నాదము, వీణానాదము, భ్రమరఝంకారనాదము మొదలగు నానావిధనాదములు అత్యంత సూక్ష్మముగా వినపడును.
36: "మహతిశ్రూయమాణేతు మహాభేర్యాధికధ్వనౌ, తత్రసూక్ష్మంసూక్ష్మతరం నాదమేవ పరామృశేత్" - ధ్యానస్థితిలో అధికముగా శ్రవణముచేయునపుడు మహాభేరీనాద శబ్దములు వినిపించును. అప్పుడు అత్యంతసూక్ష్మనాదములను గమనింపవలెను.
41. సర్వచింతాంసముత్సృజ్య సర్వచేష్టావివర్జితః, నాదమేవానుసంధధ్యాన్నాదే చిత్తం విలీయతే" - సర్వచింతలను విడచిపెట్టి, సర్వచేష్టలను విసర్జించి, ప్రణవనాదమును మాత్రమే అనుసంధానము చేయవలెను. అపుడు ప్రణవనాదములో చిత్తము లయమగుచున్నది.
47: "మనస్తత్యలయంయాతి తద్విష్ణోపరముపదమే, తావదాకాశసంకల్పో యావచ్చబ్ద ప్రవర్తతే" - మనస్సు ఎచ్చటలయమును చెందునో, అదియే విష్ణువుయొక్క సర్వోత్తమ స్థానమై యున్నది. ఆకాశములో శబ్దములవలె మనస్సులో సంకల్పములు ప్రవర్తించుచున్నవి. ఎంత కాలము శబ్దముండునో అంతకాలమే సంకల్పముండును.
8. "నిశ్శబ్దంతత్పరంబ్రహ్మ పరమాత్మాసమీయతే, నాదోయావన్నవస్తావన్నాదాంతేతు మనో న్మనీ” - నిశ్శబ్దమైన, పరబ్రహ్మపరమాత్మ ఏకమగును. నాదమున్నంతవరకే మనస్సుండును. నాదాంతమున మనోన్మనియగును.
49: "సశబ్దశ్చాక్షరేలీనో నిశ్శబ్దంపరముపదమ్, సదానాదానుసంధానాత్సంక్షీణా వాసనా తుయా" - ఆశబ్దము అక్షరపరబ్రహ్మములో లీనమగును. నిశ్శబ్దమే పరమపదము. నిరంతర నాదానుసంధానమువలన సర్వవాసనలు క్షీణించును.
51, 52: సర్వేతత్రలయంయాంతి బ్రహ్మప్రణవనాదకే, సర్వావస్థావినుర్ముక్త సర్వచింతా వివర్జితః। మృతవత్తిష్ఠతేయోగీ సముక్తోనాత్రసంశయః, శంఖదుంధుభినాదంచ శృణోతికదాచన।" - బ్రహ్మప్రణవనాదములో సర్వమును లయమునుపొందుచున్నవి. సర్వావస్థలనుండి విముక్తుడై సర్వవిచారములనుండి విడువబడినవాడై, మృతుడువలె ఎవడుండునో, ఆయోగి ముక్తుడనుట లో సంశయములేదు. ఇకఎప్పుడునూ శంఖదుంధుభినాదములను వినడు.
55, 56: "జాగ్రన్నిద్రావినిర్ముక్తస్స్వరూపావస్థతామియాత్, దృష్టిస్థిరాయస్య వినా సదృశం వాయుఃస్థిరో యస్యవినాప్రయత్నమ్, చిత్తంస్థిరంయస్య వినావలంబం సబ్రహ్మతాపాంతర నాద రూపమిత్యుపనిషత్” - అట్టివాడు (పరిపక్వధ్యానాభ్యాసముచేత) జాగ్రద్ నిద్రావస్థలులేనివాడై స్వరూప(ఆత్మ)అవస్థనుపొందును. దృశ్యములేకున్ననూ ఎవనిదృష్టిస్థిరముగానున్నదో, ప్రయత్నము లేకుండగనే ఎవనికివాయువు స్థిరముగానుండునో, అవలంబము (ఆధారము) లేకుండగనే ఎవనిచిత్తము స్థిరముగానుండునో, అతడు బ్రహ్మతాపాంతర నాదరూపము నందును అని ఉపనిషత్తు.
పతంజలియోగసూత్రములు: 27: "తస్యవాచకః ప్రణవః" 28: "తజ్జపస్తదర్థభావనః" - దాని(పరబ్రహ్మ) యొక్క సర్వనామము ఓంకారము. దానిని జపించుటవలన దాని( పరబ్రహ్మ) యొక్క అర్థము, భావనయుకలుగును.
ఇచ్చట పరబ్రహ్మము శబ్దరూపముగా ఎలావున్నాడో, ఆశబ్దబ్రహ్మోపాసన ఎలాచేయాలో వివరించారు. దీనినే నాదబిందూపాసన అనికూడా అంటారు. దీనిగురించి చాలావిపులముగా www.tatvavisleshana.weebly.com లో ‘నాదము' అనేవిభాగములో చర్చించడ మైనది. పరిశీలించప్రార్థన. పతంజలి దీని రహస్యాన్ని విప్పిచెప్పారు. పరబ్రహ్మముయొక్క సర్వనామము ఓంకారమని, ఆఓంకారమును నాదబిందువుగా జపిస్తే పరబ్రహ్మముయొక్క అర్థము, అనుభవము కలుగుతాయని విశదీకరించారు. అటువంటి అనుభవాన్నిపొందిన సద్గురువును "శబ్దబ్రహ్మాత్మికమ్" అనిపొగడవచ్చుకదా!
18. పంచబ్రహ్మవిద్యాత్మికమ్
మొదట ఈనామమును పంచ బ్రహ్మవిద్యలు అనే అర్థములో చూస్తే చాలా బ్రహ్మవిషయక విద్యలు కనబడ్డాయి. చాందోగ్యోపనిషత్ లో దహరవిద్య, భూమవిద్య, వైశ్వానరవిద్య, మధు విద్య, పంచాగ్నివిద్యలు, బృహదారణ్యకోపనిషత్ లో శాండిల్యవిద్య, సంవర్గవిద్యలు, తైత్తిరీయో పనిషత్ లో భార్గవీ లేదా వారుణీవిద్య వున్నాయి. వాటినన్నింటినీ వివరించడానికి ఇచ్చట చోటు సరిపోదు. జిజ్ఞాసులు ఆయాయుపనిషత్తులు పరిశీలింపప్రార్థన. మరల ఈనామమును పంచబ్రహ్మవిద్య అని ఒకేవస్తువుగా తీసుకున్నచో, పంచబ్రహ్మోపనిషత్లో దీనిగురించి చాలా వివరముగా వున్నది. వివరణ చాలాఎక్కువగా వున్నందున, సంస్కృతపాఠమునువదలి, దానితాత్పర్యమును ఈదిగువనివ్వడమైనది.
"పైప్పలాదుడు మహేశుని అడిగేను, ముందుగా ఏమిపుట్టెను? సద్యోజాతము. భగవంతు డెవరు? అఘోరుడు, వామదేవుడు. వీరెవరు? తత్పురుషుడు. ఇంకావీరెవరు? అన్నివిద్యలకు ప్రేరకుడీశానుడు. భూతమునకు, భ్వ్యమునకు, సర్వదేవయోనులకు ప్రేరకుడు. వర్ణములెన్ని? భేదములెన్ని? గుహ్యమైనసర్వమును మహాదేవుడే, అతనికి నమస్కారము అనిన, మహేశు డనెను. ఓశాకలా! లోకమున గోప్యముకన్న గోప్యమైనదేమున్నదో విను. సద్యోజాతము - మహి, పూష, రమ, బ్రహ్మ, త్రివృత్తుస్వరము, ఋగ్వేదము, గారపత్యమంత్రములు, సప్తస్వర ములు, వర్ణము పీతము, క్రియాశక్తి. సర్వాభీష్టఫలప్రదమైన అఘోరము - సలిలము, చంద్రము, గౌరి, యజుర్వేదము, మేఘముతోసమమైన స్వరము, సాంద్రము, దక్షిణాగ్ని, పంచాద్వర్థ సంయుక్తము, ఇచ్చాక్రియాన్వితస్థితి, శక్తిరక్షణసంయుక్తము, పాపవినాశకము, దోష ప్రశమనము, సర్వైశ్వర్యఫలప్రదము. వామదేవుడు - మహాబోధదాయకుడు, పావకాత్మకుడు, విద్యాలోకయుక్తుడు, కోటిసూర్యసమప్రభుడు, ప్రసన్నుడు, సామవేదస్వరూపుడు, గానాష్టక సమన్వితుడు, ధీరస్వరుడు, అహవనీయస్వరూపుడు, అనుత్తముడు, జ్ఞానసంహార సంయు క్తుడు, శక్తిద్వయసమన్వితుడు, శుక్లవర్ణుడు, తమోమిశ్రుడు, స్వయముగా పూర్ణబోధకరుడు, లోకత్రయనియంత, ధామత్రయసమన్వితుడు, నరులకు సర్వసౌభాగ్యప్రదుడు, సర్వ కర్మఫల ప్రదుడు, అష్టాక్షరసంయుక్తుడు, అష్టపత్రాంతరస్థితుడు. తత్పురుషుడు - వాయుమండల సంవృతుడు, పంచాగ్ని సంయుక్తుడు, మంత్రశక్తినియామకుడు, పంచాశద్వర్ణ రూపుడు, అథర్వవేదస్వరూపుడు, కోటికోటి గణాధ్యక్షుడు, బ్రహ్మాండాఖండవిగ్రహుడు, రక్తవర్ణుడు, కామపుడు, సర్వాదివ్యాధి భేషజుడు, సృష్టిస్థితిలయకారణుడు, సర్వశక్తిమంతుడు, అవస్థా త్రయాతీతుడు, తురీయుడు, సత్యచిత్సుఖ స్వరూపుడు, బ్రహ్మవిష్ణ్వాదిసేవ్యుడు, సర్వ జనకుడును. ఈశానుడు - పరముడు, ప్రేరకుడు, బుద్ధిసాక్షి, ఆకాశాత్మకుడు, అవ్యక్తుడు, ఓంకారస్వరభూషితుడు, సర్వదేవమయుడు, శాంతుడు, శాంత్యతీతుడు, స్వరబాహ్యుడు, అకారాదిస్వరాధ్యక్షుడు, ఆకాశమయవిగ్రహుడు, పంచకృత్య నియంత, పంచబ్రహ్మాత్మకుడు, పంచబ్రహ్మోపసంహారముచేసి, స్వాత్మతేజస్సుతో ప్రకాశించుచున్నాడు. ఆదియందు, అంత మందు, మధ్యమందుప్రకాశించును. మరొకకారణముచేకాదు. శంభుమాయామోహితులై జగ ద్గురు వైనమహాదేవుని సర్వకారణకారణుడని దేవతలెరుంగరు. పరాత్పరము, విశ్వధామమైన ఇతనిరూపము కనిపించదు. జగత్తు ఎవనిచే ప్రకాశించుచున్నదో, ఎవనియందు లీనమగు చున్నదో, పరమశాంతమైన ఆబ్రహ్మనే నేను. సద్యోజాతాదిపూర్వకమైన పంచబ్రహ్మపరునిగా నెరుంగవలెను. ఏదిపంచబ్రహ్మాత్మకముగా వినబడుచున్నదో, కనబడు చున్నదో, పంచ విధములుగా వున్న ఆబ్రహ్మకార్యమును తెలిసికొనవలెను. బ్రహ్మకార్యమని తెలిసి, ఈశానుని పొందును.
సర్వము పంచబ్రహ్మాత్మకమని స్వాత్మయందు లీనముచేసి, సోహమస్మి అనితెలిసిన విద్వాంసుడు అమృతుడైన బ్రహ్మయగును. ఇదే బ్రహ్మయని తెలిసినవాడు ముక్తుడగును. సంశయములేదు. పరబ్రహ్మస్వరూపియు, పంచాక్షరమయుడునగు శంభుని నకారాది యకారాంతరూపునిగా తెలిసి, పంచాక్షరమును జపముచేయవలెను. పంచబ్రహ్మతత్త్వము కనుక, సర్వము పంచాత్మకముగా నెరుగవలెను. పంచబ్రహ్మాత్మకమైన విద్యనెవడు భక్తిభావితుడై చదువునో వాడు పంచాత్మకమునుపొంది, స్వయముగా పంచవిధముల ప్రకాశించును."
సవివరముగానున్న దీనిని వివరించనవుసరము లేదని భావించుచున్నాము. ఇటువంటి పంచబ్రహ్మజ్ఞానము కలిగినటువంటి సద్గురువును "పంచబ్రహ్మాత్మికమ్" అనవచ్చునుకదా!
19. తురీయం, తురీయాతీతం
అన్నపూర్ణోపనిషత్:2-2: "వ్యవహారమిదగ్ంసర్వం మాకరోతుకరోతువా, అకుర్వనాపి కుర్వన్వాజీవ స్వాత్మరతిఃక్రియః అథవాతమపిత్యక్త్వాచైత్యాగ్ం సగ్ంశాంతోజ్వలన్మణిరివాత్మని, చిత్యేచైత్యదశాహీనేయాస్థితిః క్షీణచేతసాం సోచ్యతేశాంతకలనా జాగ్రత్త్వసుషుప్తతా, ఏషానిదాఘ సౌశుప్తి స్థితిరభ్యాసయోగతః ప్రౌఢసతీతురీయేతి కథితాతత్త్వకోవిదైః" - ఋభువు చెప్పు చున్నాడు. ఈసర్వవ్యవహారమును చేయుగాక, మానుగాక, చేయుచుగాని, చేయకగాని, జీవుడుతన ఆత్మ యందు ఇష్టముకలవాడై యుండవలెను. లేదా అదిన్ని వదిలిపెట్టి శాంతమైన చిత్తే ఘనముగా కలవాడై ప్రకాశించుమణివలె ఆత్మయందు శాంతుడైజీవుడుండును. చిత్తము చైత్యదశాహీనము కాగా, మనస్సు క్షీణించినవారికే స్థితియున్నదో. శాంతముగానుండు ఆదశ జాగ్రదావస్థలో సుషుప్తి వంటిది. ఓనిదాఘా! ఈసౌషుప్తిస్థితి అభ్యాసమువలన కలుగును. క్రమముగాప్రౌఢమై తత్త్వవేత్తల చే తురీయస్థితియని చెప్పబడును.
"అస్యాంతురీయావస్థాయాగ్ంస్థితిం ప్రాప్యో~వినాశినీమ్, అనందైకాతశీలత్వాదనునంద పదంగతః అనునందమహానంద కాలాతీతో~పహిముక్త ఇత్యుచ్యతేయోగీ తుర్యాతీతపదంగతః పరిగఌతసమస్తజన్మపాశ స్సకలవిలినతమోమయాభిమానః పరమరసమయః పరాత్మసక్తో, జలగతసైంధవఖండః" - ఈతురీయావస్థలో వినాశములేని స్థితినిపొంది కేవలము ఆనంద శీలుడుగానున్నందున అనానందపదవిని పొందును. సమస్తజన్మపాశములుపోయి సమస్త మైన తమోమయమైన అభిమానమువిలీనమై, పరమాత్మాసక్తుడై, రసమయుడై, నీటిలోవేసిన లవణమువలె బ్రహ్మములో కలసిపోవును.
5-14: "యదసక్తంసమం, స్వచ్ఛంస్థితం తత్తుర్యముచ్యతే, యాస్వచ్ఛాసమతాశాంతా జీవన్ముక్తవ్యవస్థితిః సాక్ష్యవస్థావ్యవహృతౌ సాతుర్యకలనోచ్యతే నైతజాగ్రన్నచస్వప్నస్సంకల్పా నామసంభవాత్, సుషుప్తిభావనోప్యేత అభావాజ్జడతాస్థితే, శాంతసమ్యక్ప్రబుద్ధానాం యథా స్థితిమిదంజగత్, విలీనంతుర్య మిత్యాహురబుద్ధానాస్థితంస్థిరం, అహంకారకలాత్యాగే సమతా యాస్సముద్గతే, విశరారౌకృతేచిత్తే తుర్యావస్థాప్రతిష్ఠితే, సిద్ధాంతో~ధ్యాత్మశాస్త్రాణాం, సర్వాప హ్నవ ఏవహి, నావుద్యుస్తేహనోమాయాశాంతం" - ఏదిఆసక్తమై సమమై స్వచ్చమైయున్నదో, అది తుర్యమనబడును. ఏదిసమతసాంతజివన్ముక్తస్థితి యున్నదో, వ్యవహారమున సాక్ష్యవస్థ యైన అది తుర్యకలన అనబడును. ఇదిజాగ్రదవస్థకాదు. స్వప్నసంకల్పములు కాదు. అసంభ వము కనుక సుషుప్తిభావముకాదు. జడతాస్థితిలేదు కనుక సమ్యక్ప్రబుద్ధులకు ఈజగత్తు శాంతమైనది. విలేనమైన దీనిని తుర్యమందురు. అబుద్ధులకు స్థిరమైనది. అహంకారకళను త్యజించగా సమత్వము కల్గగా, శత్రువులులేకుండ చిధ్రముచేయబడగా, తుర్యావస్థలో నుంచ బడగా, ఆధ్యాత్మ శాస్త్రముల సిద్ధాంతము అంతయు అపహ్నవమే అనగా లేనిదే! ఇక్కడ అవిద్యలేదు, మాయ లేదు. ఈబ్రహ్మ దుఃఖములేనిదై శాంతమైనది. స్వచ్చమైన చిదాకాశమున శమరూపమైన దాని యందు శాంతమైనది.
అవధూతగీత: "కేవలంతుర్యరూపోస్మి తుర్యాతీతో~స్మికేవలః, సదాచైతన్యరూపోస్మి చిదా నందమయో~స్మ్యహమ్" - అహంబ్రహ్మస్మి జ్ఞానముచే నేను కేవలతుర్యరూపుడను. తుర్యా తీత కేవలపరబ్రహ్మను. సర్వదాచైతన్యరూపుడను, చిదానందమయుడను, అవ్యయుడను అగుచున్నాను.
ధ్యానబిందూపనిషత్:2-4: "తురీయే కేవలపరమాత్మసంబధినీభవతి, నిత్యబోధ స్వరూపాభవతి, తదా శనైశ్శనైరుపరమేద్బుద్ధ్యాధృతిగృహీతయా ఆత్మసంస్థంమనంకృత్వా నకించితపిచింతయే త్తదాప్రాణాపాన యోరైక్యంకృత్వా సర్వంవిస్వమాత్మస్వరూపేణ లక్ష్యం ధారయతి, తధాతురీయ తీతావస్థా, తదాసర్వేషామానందస్వరూపోభవతి, ద్వందాతీతోభవతి, యవద్దేహధారణా వర్తతే తావత్తిష్ఠతి, పశ్చాత్పరమాత్మస్వరూపేణ ప్రాప్తిర్భవతీత్యనేన ప్రకారేణ మోక్షోభవతి." - తురీయమునందు బ్రహ్మనిష్ఠునిస్థితి పరమాత్మ సంబంధములదియగును. అదినిత్యము బోధస్వరూపమైనది. అపుడుసాధకుడు ధైర్యముతోకూడిన బుద్ధిద్వారా మనస్సు ను బాహ్యవిషయములనుండి మరలించి, అంతర్ముఖముచేసి హృదయమునందునిలిపి, ఇతర చింతలను వీడి, సదా బ్రహ్మమునే ధ్యానించవలెను. అపుడు ప్రాణాపానములను ఏకముచేసి, సర్వజగత్తును బ్రహ్మముగా గాంచగలడు. అదియే తురీయాతీతదశ యగును. శరీరధారణ యున్నంతవరకును ఇట్లుండి, తదుపరి విదేహముక్తినొంది పరమాత్మలో లీనుడగును. ఈప్రకారముగ జీవునకు మోక్షము కలుగుచున్నది.
వాటిని పరిశీలించినచో మనకు రెండులక్ష్యములు గోచరించుచున్నవి. మొదటిది శరీరములో వున్నది. ఆజ్ఞాచక్రముతో మొదలై సహస్రారముతో అంతమగును. ఆజ్ఞాచక్రమునుండి సహస్రారము వరకు పయనించుటను చలదృష్టి అంటారు. అనగా దృష్టి కేంద్రీకరించవలసిన స్థానమును ఆజ్ఞాచక్రమునుండి మెల్లమెల్లగా పైకిజరుపుట. అలాసహస్రారముచేరి, అక్కడ జ్యోతి సమూహమును దర్శించుట తురీయము. ఇదిమన శరీరములో మనము దర్శించగల్గిన చివరి అంశము. దీనినే అంతర్లక్ష్యము అనికూడా అంటారు. కాని ఇదే చివరిదికాదు. దీనితర్వాత తురీయాతీతము వున్నదని పెద్దలు విశదీకరిస్తున్నారు. మండలబ్రాహ్మణోపనిషత్తులో "బహిర్లక్ష్యస్తు నాసాగ్రే చతుష్షడష్టదశద్వాదశాంగుళిభిః" - బహిర్లక్ష్యము నాసికాగ్రమునుండి క్రమముగా ఆరు, ఎనిమిది, పది, పన్నెండు అంగుళములపైనవున్నది" అనివిశదీకరించారు. దీనిని తురీయాతీతమంటారు. ఇదిమన శరీరము అవతలనున్న లక్ష్యము. ఇది పరబ్రహ్మతప్ప వేరొకటికాదు. సద్గురువులు పోడురి కృష్ణవేణుమాతాజీగారు అనుభవపూర్వకముగా చెప్పిన దేమిటంటే, సహస్రారముపైన ఆరుస్థాయిలుకలవని, ఇందులో మొదటిమూడు ధ్యానములో అనుభవమునకువచ్చునని, మిగిలిన మూడుస్థాయిలు శరీరమువదిలినపిమ్మటే పొందగలరని తెలియజేశారు. ఒకానొకసాంప్రదాయము ప్రకారము (మాకున్నపరిమితులవలన ఆ సాంప్రదాయమును బహిర్గతము చేయుటలేదు) మోక్షమునకు 18స్థాయిలు కలవని, మొదటి ఆరుమూలాధారమునుండి ఆజ్ఞాచక్రమువరకు, తదుపరి ఆరు ఆజ్ఞాచక్రమునుండి సహస్రారము వరకు, ఆతదుపరి ఆరు సహస్రారముపైన కలవు. కాబట్టి తురీయము మనశరీరములో చివరిది. తురీయాతీతము దానిఆవలనున్న పరమాత్మ. ఈరెండింటినీ చక్కగా అనుభవములోనికి తెచ్చుకున్న సద్గురువును "తురీయం, తురీయాతీతం" అనవచ్చుకదా!
20. నిరామయమ్
అవధూతగీత: "శుద్ధంవిశుద్ధమవిచారమనంతరూపం, నిర్లేపమవిచారమనంతరూపం, నిష్ఖండఖండమవిచారమనంతరూపం, జ్ఞానామృతం సమరసం గగనోపమోహం" - నేను శుద్ధుడను, అశుద్ధుడను విచారములేనివాడనగుటచే అనంతరూపబ్రహ్మమగుచున్నాను. నిర్లిప్తుడను, లిప్తుడను (అసంగుడను, సంగుడను) అనువిచారమునకు దూరమైనవాడ నగుటచే అనంతరూప పరమాత్మనగుచున్నాను. నేను అపరిచ్చిన్నుడను, పరిచ్చిన్నుడను అను విచారరహితుడనగుటచే అనంతరూపపరబ్రహ్మనగుచున్నాను. నేను జ్ఞానామృత స్వరూపుడను, గగనస్వరూపుడను, సర్వత్రవ్యాపించినవాడను.
వివేకచూడామణి:469: "నిర్గుణంనిష్కలంసూక్ష్మం నిర్వికల్పంనిరంజనం, ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తికించన" - గుణాతీతమైన, విభాగరహితమైన (అఖండమైన), అన్నిటికంటె సూక్ష్మమైన (ఇంద్రియాతీతజ్ఞానముచే తెలియదగిన), సంకల్పవికల్పశూన్యమైన, సర్వసందేహ శూన్యమైన మాయామాలిన్యములేని ఒకేఅభిన్నమగు పరబ్రహ్మవున్నది. ఇట్టిపరబ్రహ్మము (తో) నందు ఎట్టిబేధమొకించుకయు లేదు.
అష్టావక్రగీత: "సాకారంఅనృతంవిద్ది నిరాకారంతునిశ్చలం, ఏతత్త్వోపదేశే నపునర్భవసంభవ" - సాకారస్వరూపమును మిధ్యగాతెలిసికొనుము. నిరాకారమగు ఆత్మతత్త్వమును నిశ్చలముగా ఎరుగుము. ఈతత్త్వోపదేశమున నీవు మరలమరల పుట్టుట జరుగదు.
సమాధ్యవస్థలో ఆపర్బ్రహ్మానందములో మునిగియుండి, వేరేయితరమైనవాటిచేత రంజింప బడనిస్థితియే నిరామయము. సద్గురువునకు ఇట్టిస్థితి స్వభావసిద్ధము.
21. అఖండాత్మతేజోశివం
కఠోపనిషత్:41: "తందుర్దర్శంగూఢమనుప్రవిష్టం గుహాహితంగహ్వరేష్టం పురాణం, ఆధ్యాత్మ యోగాధిగమేనదేవంమత్వాధీరో హర్షశోకాజహాతి" - సామాన్యులచే దర్శింపలేనిదియు, నిగూఢ మైనదియు, అంతరాత్మగాకలదియు, హృదయగుహలో కలదియు, ప్రాకృతవిషయవికారములు లేనట్టిదియు, లోకాదియు, జ్యోతిస్వరూపమైనదియునగు ఆఆత్మను అధ్యాత్మయోగముచే, శ్రద్ధాభక్తి ధ్యానయోగములచే నిరంతరము ధ్యానించి, ఆఆత్మనుతెలుసుకొని, అనగా ఆఆత్మను హృదయగుహలో దర్శించి, సర్వత్రాదర్శించిన ధీరుడు, సుఖదుఃఖాదిద్వంద్వములను జయించు చున్నాడు. ఇతడే సమదర్శినుడు, ఇతడే గురువు.
శ్రీమద్భగవద్గీత:విభూతియోగము-11: "తేషామేవారుకంపార్థ మహామజ్ఞాజంతమః, నాశయా మ్యాత్మభావస్తో జ్ఞానదీపేనభాస్వతా" - జ్ఞానుల అంతఃకరణములయందు స్థిత్రుడైయున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞానరూపదీపమును(జ్యోతిని) వెలిగించి అంధ కారమును పారద్రోలెదను.
చాందోగ్యోపనిషత్:8-12-3: "యఏషసంప్రసాదో~స్మాత్శరీరాత్సముత్థాయ పరంజ్యోతిరుప సంపద్య స్వేనరూపేణాభినిష్పద్యతే, స ఉత్తమపురుషః" - ఈసుషుప్తియందలి జీవుడు దేహమందలి ఆత్మాభిమానాన్నివదలి పైకిలేచి పరంజ్యోతినిపొంది, తనస్వరూపాన్ని పొందుతాడు. అతడు ఉత్తమపురుషుడు.
మైత్రేయీబ్రాహ్మణం: "ఆత్మనివిజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతంభవతి" - ఆత్మతెలిస్తే ఈదృశ్యమాన జాతమంతాతెలుస్తుంది.
శతపథబ్రాహ్మణం:10-6-32: "సఆత్మానముపాసీత మనోమయః ప్రాణశరీరంభావరూపం" - మనోమయుడు, ప్రాణశరీరంకలవాడు, ప్రకాశరూపుడు అయిన ఆఅత్మనుపాసించాలి.
కేనోపనిషత్:4-4: "తస్యైసఆదేశోయతేదద్ విద్యుతో~ద్యద్యుతదా ఇతీతిన్యమీమిషదా ఇతధి దైవతమ్" - ఆబ్రహ్మముయొక్క ఉపదేశమిదియే. విద్యుత్తుయొక్కప్రకాశమువలె క్షణమాత్రము మెరుపుమెరిసినపుడు కన్నులు మిరుమిట్లుగొనిపోవును. విద్యుత్తు క్షణమాత్రమే ప్రకాశిం చును. అట్లే బ్రహ్మముయొక్క దర్శనముకూడ!
వివేకచూడామణి -520: "నమస్తస్మై సదైకస్మైచిన్మ్హసేనమః, యదితద్విశ్వరూపేణరాజతే గురురాజతే" - ఏబ్రహ్మవస్తువు ఈదృశ్యమానమగుచున్న ప్రపంచముతో ప్రాకాశించుచున్నదో, అట్టి పరబ్రహ్మస్వరూపుడైన, సర్వదాకేవలాత్ముడవయిన, అనిర్వాచ్యమహాతేజోరూపుడవైన తమకు, ఓగురురాజస్వామీ! నమస్కారము.
ఇచట ఆత్మదర్శనమును వివరించుచున్నారు. అది మిణుగురుపురుగువలె, మెరుపువలె ప్రకాశించునని వివరించారు. సద్గురువులు పోడూరి కృష్ణవేణుమాతాజీ అనుభవపుర్వకముగా చెప్పిన ప్రకారం, ధ్యానములో మనస్సు లయమైనప్పుడు, మనకుకనపడే అంధకారములో, ఒకచోట, సెకనులో లక్షోవంతులో, మిణుగురుపురుగు వెలిగిఆరిపోయినట్లు, మనఆత్మ ఒక్కసారి మాత్రమే కనబడుతుంది. మరల మరల ధ్యానంచేసినపుడు, మరల మరల మనస్సు లయమయి నపుడు, మరల ఒక్కసారిమాత్రమే దర్శనమిస్తుంది. కాని మనం ధ్యానాన్ని క్రమం తప్పకుండా కొనసాగించి నప్పుడు, ఆసూక్ష్మమైనకాంతి అదృశ్యమవకుండా అలాగే వుంటుంది. మనం ధ్యానాన్ని కొనసాగించేకొద్దీ, మనఅభ్యాసాన్నిబట్టి, ఆకాంతిపరిమాణంపెరిగి, బిందువంత, బొట్టంత, గుడ్డంత, చంద్రబింబమంత అవుతుంది. వదలకుండా ధ్యానాన్ని కొనసాగిస్తే, మనకు ఎంతమేర దృశ్యము వుంటుందో, అంతమేరకు ఆప్రకాశము పెరుగుతుంది. ఈపరిపక్వదశలో, మనఆత్మను ఎలాదర్శించుకొంటున్నామో, అలాగే ఇతరజీవరాశులలోనున్న ఆత్మస్వరూపాన్ని కూడా దర్శించగలుగుతాము. అప్పుడే సమదర్శనత్వము వస్తుంది. అప్పుడే సర్వవ్యాప్తియైన, అఖండాత్మతేజోశివమైన పరబ్రహ్మానుభవం వస్తుంది. దీన్నిపొందినటువంటి సద్గురువు "అఖండాత్మతేజోశివమే!"
22. హృదయకుహరమధ్యేకేవలంబ్రహ్మమాత్రమ్
కఠోపనిషత్-14: "ప్రతీబ్రవీమితదామేనిబోధ స్వర్గ్యమగ్నింనచికేతఃప్రజానన్, అనంత లోకాస్తి మధోప్రతిష్ఠాం విద్ధిత్వమేనం నిహితంగుహాయాం" - యముడు చెప్పుచున్నాడు. ఓనచికేతుడా! స్వర్గమునుచేర్చు అగ్నినితెలిసికొన్నవాడనైననేను, అనగా జ్యోతిస్వరూపుడైన నేను, పుణ్య కర్మానుష్ఠాన ఫలితము కోరనినీకు విశదీకరించెదను. దానినినావలన గ్రహించుము. అది పదు నాలుగులోకములకు మరియు స్థావరజంగములకు ఆధారమైనట్టిది అయిన ఈఅగ్నిని హృదయ గుహలో జ్యోతిస్వరూపముగా నిన్నదానిని నీవుతెలిసికొనుము.
"త్రిణాచికేతః త్రిభిరేత్యసంధిం త్రికర్మకృత్తరతైజన్మమృత్యు, బ్రహ్మజజ్ఞం దేవమీఢ్యం విదిత్వాని చాయ్యేమాంశాంతిమత్యంతమేతి" - ఓనచికేతుడా! హృదయగుహలోగల ఈఆత్మ (బ్రహ్మము) సృష్ట్యాదియందుగలది. సర్వులచే స్తుతింపదగినది, స్వయంప్రకాశకమైనది. ఈఆత్మ (బ్రహ్మ)ను మనసావాచాకర్మణా పుణ్యకర్మానుష్ఠానముచేసి, సాధనచే హృదయగుహకు చేరి, కూటస్థునితో క్షేత్రజ్ఞుని ఏకీభూతునిచేసినచో, జననమరణములనే సంసారసాగరములను దాటుచున్నాడు. అనగా అమృతత్త్వమును పొందుచున్నాడు.
తైత్తిరీయోపనిషత్:1-6-1: "సయఏషో~ న్తర్ హృదయఆకాశః, తస్మిన్నయం పురుషో మనో మయః, అమృతోహిరణ్మయః" - ఆపరబ్రహ్మహృదయఆకాశము లోపల కలదు. అందులోగల ఈ పురుషుడు, ఈదేహమునందుగల ఆత్మమనోమయుడు, అమృతుడు, కాలాతీతుడు, శాశ్వతుడు, జ్యోతిర్మయుడు.
చాందోగ్యోపనిషత్:8-1-1: "అధయదిదమస్మిన్ బ్రహ్మపురేదహరంపుండరీకం వేశ్మదహరో స్మిన్నన్తరాకాశః, తస్మిన్ యదన్తఃతదన్వేష్టవ్యం, తద్వావిజిజ్ఞాసితవ్యమ్" - బ్రహ్మకు పురం లాంటిదైన ఈశరీరంలో, సూక్ష్మమైన తామరపువ్వుఆకారంలోవుండే హృదయమనే ఇంటి లోపల ఏదహరాకాశం(సూక్ష్మమైన ఆకాశం) వుందో, ఆహృదయాకాశంలోపల వున్నవాడే వెదుక వలసినవాడు, తెలుసుకొనవసినవాడు.
8-3-3: "సవాఏషఆత్మా హృదితస్వైతదేవనిరుక్తం హృద్యమితి తస్మాత్ హృదయమహర హర్వా ఏవం విత్స్వర్గంలోకమేతి" - ఈఆత్మ హృదయమునందే కలదు. దానికి ఇది శబ్దార్థము. హృది = హృదయమునందు, ఆయమ్ = ఈఆత్మ. ఈప్రకారము తెలుసుకొన్నవాడు ప్రతి దినము స్వర్గమును (బ్రహ్మమును) పొందును.
ఇచట మనశరీరములో ఆత్మవుండు చోటు వివరిస్తున్నారు. అది హృదయములో వున్న గుహలో, అనగా దహరాకాశములో, సూక్ష్మమైన ఆకాశములో వుందని తెలియజేశారు. దీనినే శ్రీలహరిమహాశయులు 'రామగుహ' అని వ్యవహరించారు. హృదయమనేది భౌతికమైన గుండే కాదు. అది భౌతికనేత్రాలకు కనపడదు. దానినిదర్శించాలంటే వేరేదృష్టి అవుసరము. అది తపస్సు లేదా, ధ్యానముద్వారా వస్తుంది. ఈచూపు (vision) వేరేగా వుంటుంది. ఈచూపు తోనే మనం షట్చక్రాలను, ఆత్మను, ధ్యానంలో వివిధములైనటువంటి లోకాలను, స్థానము లను, చివరకు పరబ్రహ్మను దర్శించి అనుభవిస్తాము. అందులో భాగంగానే ఆత్మను అఖండ మైన తేజోస్వరూపంతో ఇటు మనహృదయగుహలోను, అటు విశ్వమంతటా కూడా దర్శిస్తాము. అప్పుడది బ్రహ్మ మవుతుంది.
23. అహమహమితి
బృహదారణ్యకోపనిషత్:3-5-2: యఏష తస్మిన్మండలే పురుషస్తస్వాహరితినామః" - ఈఆదిత్యమండలంలోనున్న పురుషునికి 'అహః' అనిపేరు.
5-5-2: "తద్యస్సత్యమసౌ అదిత్యోఏష అతస్మిన్మండలే పురుషోయశ్చాయం దక్షిణేక్ష న్పురుషః" - ఆసత్యమే ఈఆదిత్యుడు. ఈఆదిత్యమండలంలో వున్న పురుషుడే ఈదక్షిణ నేత్రంలో వున్న పురుషుడు.
చాందోగ్యోపనిషత్:1-7-5: "తస్యైతస్యతదేవరూపం, యదముష్యరూపం, యావముష్య గేష్ణౌయన్నామతన్నామ" - ఆదిత్యాంతర్గతపురుషుని రూపంవంటిదే ఈచాక్షుశపురుషుని రూపంకూడా. ఆపురుషునిఅవయవాలే, ఈపురుషునిఅవయవాలు. ఆతనిపేరే ఈతనిపేరు.
ఐతరేయోపనిషత్:2-4-6: "తద్యోహంసో~సౌయో~సౌసోహం" - నేనే ఆదిత్యమండలంలోని పురుషుడు. అతడే నేను.
ఇచ్చట సూర్యమండలంలోని పురుషుడు, దక్షిణనేత్రంలోని పురుషుడు ఒక్కరే అని ప్రతి పాదిస్తున్నారు. దక్షిణనేత్రంలో వేరేపురుషుడు ఎవరూలేరు. అతడు ఆత్మే. సూర్యమండలంలో వున్నవాడు పరమాత్మ. అవిధంగా ఆత్మ, పరమాత్మలకు అబేధాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ ఇద్దరూ ఒక్కరే కాబట్టి, ఆత్మను ముందర తెలుసుకొంటే, పరమాత్మ తనంతటతానే లభిస్తాడు. ఇదే రహస్యం. కాబట్టి పరమాత్మకోసం ఎక్కడెక్కడో వెతుకనవసరంలేదు. ఆత్మను వెతికితే పరమాత్మ దోరుకుతాడు. వేరే యితరమార్గములేదు.
24. సాక్షి
వాసుదేవమననము: "సాక్షిలక్షణం కథమితిచేత్. లోకేఏకస్యపురుషస్య అన్యదీయావస్థాయాః అవస్థావ్యాపారాణాంచ సాక్షాత్ ద్రష్టృత్వం సాక్షిత్వంయధా తూష్ణీమవస్థితస్యసన్న్యాసినః తత్త్రగత పురుషతదవస్థాత వ్యాపారాణాం నిర్వికారేణసాక్షాద్ద్రష్టృత్వం సాక్షిత్వం ఆత్మాపిజీవానా మవస్థా త్రయ మవస్థవ్యాపారాంశ్చ అవస్థాపతో జీవాంశ్చపశ్యన్నపి నిర్వికారేణావతిష్ఠతే. ఇదమేవ సాక్షిత్వం." - సాక్షియొక్క స్వరూపము నిరూపించబడుచున్నది. లొకములో ఒకానొక పురుషుని యొక్క అవస్థలను, అవస్థావ్యాపారములను సాక్షాత్తుగాచూచుటయే సాక్షిత్వము. ఉదాసీనుడుగా నుంటున్న సన్న్యాసి వచ్చుచున్నవారి వ్యాపారములగాంచుచూ నిర్వికారుడై యెటులనున్నాడో, ఆత్మకూడా ఆలాగుననే జీవులవస్థలను, తద్వ్యాపారములను, అవస్థలు గల జీవులను చూచు చున్ననూ, ఏవికారమునొందకయున్నది. ఇదియే సాక్షిత్వము. ఆత్మయే శరీరేన్ద్రియములను, తద్వికారములను గాంచుచూ, సాక్షిగా నుంటున్నది.
అష్టావక్రగీత: "స్థూలసూక్ష్మకారణశరీరాద్వ్యతిరిక్తో~వస్థాత్రయసాక్షి, సచ్చిదానందరూపో యస్తిష్ఠతి సఆత్మా" - స్థూలసూక్ష్మకారణములను మూడుశరీరములకును, జాగ్రత్స్వప్న సుషుప్తువులను మూడవస్థలకును భిన్నమై, సాక్షియై, సచ్చిదానందమగునదియే ఆత్మ.
తేసాక్షిపురుషే పరమాత్మనిచేశ్వరే, నైరాశ్యేబన్ధమోక్షేచ నచింతాముక్తయేమమ" – సాక్షి మాత్రుడును, పరమాత్మయునగు ఈశ్వరుడు తెలియబడిన వాడగుచుండగా, ఆశారహితమైన బంధమోక్షములనియెడు చింతనుండి ముక్తుడనగుచున్నాను.
"నత్వందేహో నతేదేహో భోక్తాకర్తానవాభవాన్, చిద్రూపోసి సదాసాక్షి నిరపేక్షసుఖంచరః" - నీవుశరీరముకావు, నీకుదేహములేదు, నీవుభోక్తవుగాని, కర్తవుగాని కావు. జ్ఞానస్వరూపు డవు. ఎల్లప్పుడూ సాక్షివి. కోరిక లేనివాడవు అగుచున్నావు. సుఖముగా మెలగుము.
వివేకచూడామణి:218: "అసౌస్వసాక్షిభావోయతస్స్నేనానుభూతే, అతఃపరంస్వయ సాక్షాత్ప్ర త్యగాత్మనచేతత్వః" - ఆత్మయే తనసాక్షిత్వమును అనుభవించుచున్నాడు. అందు వలననే లోపలనున్న ఆత్మసాక్షాత్తుగా స్వయముగా సర్వసాక్షి. అతనికన్న మరియొకడు లేడు.
295: "అహంపదార్థస్త్వమాదిసాక్షి నిత్యంసుషుప్తావపిభావదర్శనాత్, బ్రూతేహ్యజోనిత్యయితి స్స్వయంయత్ప్రత్యగాత్మా సదసద్విలక్షణః" - సోహంపదార్థమగునాత్మ (కూటస్థాత్మ శుద్ధ చైతన్యము) అహంకారాదులకు సాక్షియై, ఎల్లప్పుడు సుషుప్త్యావస్థయందు దాని భావ దర్శనము కలుగుటవలన వేదము, పుట్టుకలేనిది, త్రికాలములయందున్నది, అని స్వయముగా చెప్పు చున్నది. ఆఅంతరాత్మ సదసత్తులకంటె విలక్షణముగానున్నది.
ఇచ్చట రెండువిషయములు ద్యోతకమగుచున్నవి. జ్ఞానమువలన స్వస్వరూపభావనపొందిన ఆత్మ, అంతఃకరణయొక్క వికారములకు లొంగకుండా, వాటినంటకుండా, వాటినిగమనిస్తూ వుంటుంది. అంటే సాక్షిమాత్రంగావుటుంది. అలాగే, మహాత్ములుకూడా వైరాగ్యముపొంది, ఈ ప్రపంచములోవుంటూ, దానివిషయసుఖాలకు లొంగకుండా, జీవవ్యాపారముకొనసాగించుచూ, తనజీవితాన్ని తానే సాక్షిమాత్రంగా గడుపుతూవుంటారు. వారే సద్గురువులవుతారు.
25. సాక్షాత్ ఆత్మరూపేణభాతి
కఠోపనిషత్:85: "యథోదకంశుద్ధేశుద్ధమాసిక్తంతాదృగేవ భవతి, ఏవంమునేర్విజానత ఆత్మా భవతి గౌతమ" - ఓనచికేతా! ఏవిధముగా శుభ్రమైననీరు, శుభ్రమైననీటిలో పోయబడి ఒకటే అగునో, అటులనే, ఆత్మనుదర్శించిన జితేంద్రియుడైనవానివలన ఆత్మగ్రహింపబడి, అతడు ఆత్మయగును. అనగా ఆత్మ (పరబ్రహ్మముతో) ఏకీభూతమగును.
4-1: పరాంచిఖానివ్యతృణత్ స్వయంభూస్తస్మాత్పరాగ్ం పశ్యతినాంతరాత్మన్, కశ్చిద్ధీరః ప్రత్య గాత్మామైచ్చదావృస్త చక్షురమృతత్త్వమిచ్ఛన్" - పరమేశ్వరుడు ఛిద్రాలలాగావుండే యింద్రియా లను బహిర్ముఖంచేసి వాటిని హింసించాడు. అందుచేతనే అవి బాహ్యవిషయాలను గ్రహించ గలుగుతున్నాయి. ఆత్మదర్శనానికి అవిఅసమర్థములు. కానిఎవడో ఒకధీరుడైన వివేకవంతుడు మోక్షాభిలాషియై, కండ్లుమూసుకొని, ఇంద్రియములను మరలించి, అంతర్ముఖం చేసి, నిగ్రహంతో సమాధియందు పరమాత్మను దర్శిస్తాడు.
శ్రీమద్భగవద్గీత:కర్మసన్న్యాసయోగం:24: "యో ~0తసుఖో~0తరారామ: తదంతర్జ్యోతి రేవయః, సయోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో~ధిగచ్ఛతి" - అంతరాత్మయందే సుఖించు వాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞానియైనవాడునునగు యోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితిడై బ్రహ్మనిర్వాణము పొందును.
బృహదారణ్యకోపనిషత్:2-4-5: "ఆత్మావా అరేద్రష్టవ్యం శ్రోతవ్యోమంతవ్యో నిధిధ్యాసితవ్యః, సో~ న్వేష్టవ్య సవిజిజ్ఞాసితవ్య" - ఆత్మయే దర్శింపదగినది, వినదగినది, ఆలోచింపదగినది, మననం చేయదగినది, ధ్యానంచేయదగినది.
ముండకోపనిషత్:2-2-6: "ఓమిత్యేవంధ్యాయధ ఆత్మానం" - ఓం అని ఆత్మను ధ్యానం చేయాలి.
ఇక్కడకూడా ఆత్మకు పరమాత్మకు అభేదాన్ని ప్రతిపాదించారు. ఆపరమాత్మ మనలో ఆత్మ రూపంతో ప్రకాశిస్తూవుంటాడు. నిచ్చెనకు మొదటిఅడ్డకర్ర ఆత్మ అయితే, చివరిఅడ్డకర్ర పరమాత్మ. ఈనిచ్చెనద్వారా మాత్రమే పరమాత్మను చేరుకోగలము. ఇకొకగమ్మత్తైన విషయం ఏమిటంటే, ధ్యానంలో ఆత్మ జ్యోతిరూపంలో ఎలాదర్శనమిస్తుందో, అలాగే, సద్గురువుకూడా, పరీక్షించడానికి జ్యోతిరూపంలో శిష్యునికి దర్శనమిస్తాడు.
26. త్వమేవాహం
యజుర్వేదశాంతిమంత్రం: "ఓం సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యంకరవావహై, తేజస్వినావధీతమస్తు, మావిద్విషావహై" - ఆపరమాత్మ గురుశిష్యులమైన మనలనిద్దరినీ రక్షించుగాక. బ్రహ్మదర్శనప్రాప్తికై మనమిద్దరమూ పరిశ్రమించెదముగాక, మనయిద్దరి కృషి ఫలవంతమగుగాక. మేము పరస్పరము ద్వేషింపకుందుముగాక!
తైత్తిరీయోపనిషత్:శిక్షావల్లి:1: "సహనౌయశః సహనౌబ్రహ్మవర్చసమ్" - మాయిద్దరికి యశము, కీర్తి గలుగునుగాక, మాయిద్దరికికూడ బ్రహ్మతేజస్సు కలుగుగాక!
చాందోగ్యోపనిషత్:6-9-4: "తత్సత్యం, సఆత్మా, తత్త్వమసి శ్వేతకేతో" - శ్వేతకేతూ! అదిసత్యం, అదేఆత్మ, ఆఆత్మవేనీవు.
పైంగలోపనిషత్:3-1: "అథహైనం పైంగలః పప్రచ్ఛయాజ్ఞవల్క్యః తత్త్వమసి, త్వంతదసి, త్వంబ్రహ్మాసి, అహంబ్రహ్మస్మీత్యనుసంధానుకుర్యాత్, తత్ర పారోక్ష్యశబళస్సర్వజ్ఞత్వాది లక్షణో మాయోపాధి సచ్చిదానన్దలక్షణో జగద్యోనిస్తత్పదవాచ్యోభవతి, నఏవాంతఃకరణ సమ్భిన్న బొధో~ స్మత్ప్రత్యయా~ వలమ్భనస్త్వం పదవాచ్యోభవతి, పరజీవోపాధీమాయావిద్యేవిహాయ తత్త్వం పదలక్ష్యం ప్రత్యగభిన్నంబ్రహ్మా" - పైంగలముని యాజ్ఞవల్క్యుని 'మహావాక్య వివరణమును వివరించుము' అనిఅడిగెను. ఆయాజ్ఞవల్క్యముని ఈరీతిగాచెప్పెను.ఆబ్రహ్మము నీవే అయివున్నావు. నీవేఆబ్రహ్మముగావున్నావు. నీవు బ్రహ్మమవైవున్నావు. నేనుగూడ బ్రహ్మమనై యున్నాను. అనిఈరీతిగా అనుసంధానము చేయవలెను. ఆమహావాక్యమునందు పరోక్షశబలుడై యున్నవాడును, సర్వజ్ఞత్వాదిలక్షణయుక్తుడును, మాయయే(అవ్యక్తము) ఉపాధిగాకలవాడును, సచ్చిదానందలక్షుణుడును అగు జగత్కర్త 'తత్' పదవాచ్యు డగుచున్నాడు. ఈశ్వరజీవులయొక్క శరీరములైన 'మాయ, అవిద్యలను' విడచిపెట్టి, 'తత్ - త్వం' అనుపదములకు లక్ష్యమైయున్న ప్రత్యగాత్మ బ్రహ్మమే అగుచున్నది.
యోగశిఖోపనిషత్:5-9: అద్వైతం భావయేద్భక్త్యా గురోర్దేవస్యచాత్మనః యోగశీర్షం మహా గుహ్యం యోజానాతి మహామతిః, నతస్యకించిదజ్ఞాతం త్రిషులోకేషువిద్యతే, నపుణ్యపాపే స్వస్థో నదుఃఖం నపరాజయః నచాస్తిపునరావృత్తిరస్మిన్ సంసారం మండలే" - భక్తితో గురు దేవునికి, తనకు అద్వైతమును, అభేదమును భావించవలెను. మహాగుహ్యమైన యోగశీర్షమునెవడు తెలిసికొనునో, వానికిమూడులోకములయందును తెలియనిదేమియూ నుండదు. పుణ్య పాపములులేవు. స్వస్థలములేదు, దుఃఖములేదు, పరాజయములేదు. ఈసంసారమండల మున పునరావృత్తిలేదు.
ఇచ్చట అద్వైతము ప్రతిపాదింపబడుచున్నది. యోగములోను, జ్ఞానములోను, ధ్యానము లోను చిట్టచివరి అంశమిదియే! తనకు పరబ్రహ్మమునకు అభేదమును కల్పించుకొని, తద్దర్శనా నుభవము పొంది, దానిలో ఐక్యమగుటయీ వుండును. ఎంతచెప్పిననూ చివరిగమ్యమిదియే!
|
|
|
|